Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 120 (Jesus appears to the disciples)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)

2. యేసు శిష్యులకు మీద గదిలో ప్రత్యక్షమగుట (యోహాను 20:19-23)


యోహాను 20:20
20 ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.

క్రీస్తు పునరుత్థానము అనగా దేవునితో సమాధానమును నెరవేర్చబడినది అని అర్థము. దేవుడు తన కుమారుడిని ఆ సమాధిలోనే ఉంచలేదు , లేక మన పాపములను మోశాడు కనుక అతనిని విడిచిపెట్టలేదు. అయితే అతను చూపిన త్యాగమునకు మరియు సమాధినుంచి లేచిన విధానమును బట్టి అతను తండ్రితో సమాధానము కలిగి ఉండెను. అతను ఆ సిలువను అంగీకరించి తండ్రి చిత్తముకంటె వేరే మరొకటి చేయలేదు. సిలువ అనునది అతను ఇక్కడికి వచ్చుటకు ఉద్దేశము కలిగినదిగా మరియు ఈ లోకమును విమోచించునదిగా ఉండెను. కనుక కొందరు ఏవిధముగా యేసు సిలువలో మరణించలేదని చెప్పగలరు ?

క్రీస్తు ఒక భూతము లేక దాచబడిన ఆత్మ కాదని వారికి చూపెను. అందుకే వారికి తేన చేతులకు కొట్టిన మేకుల రంధ్రాలను వారికి చూపెను. తరువాత అతని ప్రక్కటెముకలో బల్లెముతో పొడిచిన రంద్రమును కూడా వారికి చూపెను. అప్పుడు వారు ఆ అన్వళ్ళన్నిటిని చూచినా తరువాత అక్కడ నిలుచున్నది వేరే వారు కాదని సిలువ వేయబడిన క్రీస్తని అంగీకరించిరి. కనుక దేవుని గొర్రెపిల్ల ఒక జయించివారు మరియు మరణమును జయించువాడు.

అప్పుడు నిదానముగా శిష్యులు యేసును బట్టి అతను ఒక నీడ కాదు అయితే వ్యక్తిగతముగా అతనే వారి ఎదుట ప్రత్యక్షమయేనని అనుకొనిరి. కనుక అతను ప్రత్యక్షత వారికి ఆనందమును కలిగించెను. కనుక మన కొరకే యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచి నిత్యా జీవము కలిగిన వాడుగా ఉండెను. కనుక మనము అనాధులము కాదు. కనుక మనము కూడా తండ్రి కుమారా పరిశుద్దాత్మ ప్రకారముగా ఐక్యత కలిగి ఉన్నట్లయితే ఈ లోకమున జయించగలము.

కనుక శిష్యుల యొక్క ఆనందము క్రీస్తు మృతిని బట్టి ఒక ఫలితముగా ఉన్నది. అప్పటినుంచి అతను మనకు ఒక జీవము కలిగిన నిరీక్షణ అయి ఉన్నాడు. కనుక తెరవబడిన సమాధి మన చివరి కాదు అయితే అతని పునరుత్థాన జీవమే మన జీవితమే ఉన్నది. కనుక ఎవరైతే మహిమకు అర్హులవుతారో ," నేనే పునరుత్థానమును జీవమును. ఎవరైతే నా యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు మరణించిననో తిరిగి లేచును. మరియు ఎవరైతే నా యందు విశ్వాసము కలిగి జీవింతురో వారు మరణము నొందరు."

ఎప్పుడైతే యేసు వారి పాపములను క్షమించెనని తెలుసుకున్నప్పుడు శిష్యులందరు ఎంతో సంతోషముగా ఉండిరి. అతని క్షమాపణము చేత మనకు విమోచనము దొరుకుతుంది. కనుక మనకు ఇప్పుడు దేవునితో క్రీస్తు మరణము చేత సమాధానము ఉన్నది.

క్రీస్తు పునరుత్థాన దినమును నీ సంతోషము పంచుకుంటావా ? పునరుత్థానుడైన వాడు నీకు జీవమును , ఆనందమును, నిరీక్షణను, ఇచ్చినందుకు అతని ఎదుట నీ శిరమును వంచగలవా ? యేసు జీవించి ఉన్నాడు కనుక అతను మన ఆనందమై ఉన్నాడు. అందుకే అపోస్తులుడైన పౌలు చెప్పినట్లు, " క్రీస్తు నందు ఆనందించుడి, మరలా చెప్పుడు ఆనందించుడి. మీ సహనము సకల ప్రజలందరికి తెలియనీయుడి".

ప్రార్థన : ప్రభువా మా జీవితములకు నీవు ఒక నిరీక్షణను , జీవితమును మాకు దయచేసి మా పాపములకు కావలసిన క్షమాపణను దయచేసినందుకు కృతజ్ఞతలు. నీ గాయములు మాకు నీతిని నీ సన్నిధి మాకు జీవితమును ఇచ్చెను. నీ రాజ్యము వచ్చినట్లైతే మరణించిన అనేకులు తిరిగి లేచి నీ పునరుత్థాన దినమందు ఆనందించును.

ప్రశ్న:

  1. శిష్యులు ఎందుకు ఆనందించారు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:39 PM | powered by PmWiki (pmwiki-2.3.3)