Previous Lesson -- Next Lesson
e) క్రీస్తును పొడుచుట (యోహాను 19:31-37)
యోహాను 19:31-37
31 ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. 32 కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి. 33 వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని 34 సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. 35 ఇది చూచిన వాడు సాక్ష్య మిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును. 36 అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. 37 మరియు తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.
యూదుల ఆచారములు బట్టి మనుషుల ఆలోచనలను వారు దూరమై పోయినారు. మోషే ధర్మ శాస్త్ర ప్రకారము ఎవరైతే చంపబడ్డారో వారి శవాలను ఆ రాత్రికే అక్కడి నుంచి తీసివేయాలి. కనుక యూదులు దీనికి బట్టి ఆ ముగ్గురి శవాలను అక్కడనుంచి తొలగించిరి. అయితే ఆ పండుగ సమయములో వారు చూచుటకు చాల వికారంగా ఉండిరి. కనుక వారు ఆ ముగ్గురిని మూఢ శాఖలుగా చేయమని పిలాతును అడిగిరి. ఎందుకంటె సిలువ వేయబడిన వారు మూడు దినముల తరువాత కూడా ప్రాణము కలిగి ఉండెదరు. ఎందుకంటె చేతులకు మరియు కాళ్లకు మేకులు కొట్టినప్పుడు ఎక్కువ రక్తము కారాదు కనుక బ్రతుకుటకు అవకాశముకలదు కనుకనే వారు ఈ శవాలను అక్కడినుంచి తొందరగా తీసుకొని వెళ్లి సమాధిచేయబడుటకు అజ్ఞాను పొందిరి.
యేసు మరణించాక మునుపే సైనికులు అక్కడే ఉండిరి. అతని శరీరము బలహీనమాయెను అయితే అతని ప్రాణము మాత్రమూ ఈ లోక పాపములకొరకు బలిగా అర్పించబడెను కనుక బలముకలిగినదిగా ఉండెను. అయితే మతాచారముల ప్రకారముగా వారు క్రీస్తు చనిపోయాడా లేదా అని నిర్దారించుకొనిరి. కనుకనే అందులోని ఒక సైనికుడు ఒక బల్లెమును తీసుకొని యేసు డొక్కాకు పొడిచెను. అప్పుడు అతడి నుంచి రక్తము మరియు నీరు వచ్చెను కనుక అతను చనిపోయాడని నిర్దారించుకొనిరి.
ఈ సంఘటననుంచి దేవుడు మూడు విధాలుగా గొప్పవాడని మనకు అర్థము చెప్తుంది. మొదటిగా, యూదులు క్రీస్తు ఎముకలను విరిచేసి అతని త్యాగమును చూపుట. ఎందుకంటె పస్కా పండుగలో ఏ జంతువూ ఎముక విరగకూడదు (నిర్గమ 12:46). కనుక దేవుడు అతని కుమారుడిని మరణము వరకు ఉంచి, ఎవ్వరు కూడా దేవుని గొర్రెపిల్ల లాగ ఉండలేదు.
రెండవదిగా, జకారియా 11:13 లో చెప్పినట్లు అతని ప్రక్కలో బల్లెముతో పొడుచుట. పాత నిబంధన గ్రంధములో వారి కాపరిని వారు 30 కంటే ఎక్కువైనా డబ్బులకు వారు వెలకట్టలేదు. మరియు దానికి అనుగుణంగా దేవుడు దావీదు ఇంటిమీదికి తన ఆత్మను ఉంచి వారు సిలువ వేయబడిన వాడిని వారి కన్నులతో చూసేదారని చప్పెను . కనుక దీని ప్రకారముగా కాక వారు దేవుడిని మరియు అతని రక్షణను వారు తెలుసుకోలేరు.
మూడవడిగా , ఎవరైతే ఆ సిలువ శ్రమలో ఉన్న శిష్యులు ఒక సాక్షులుగా ఉన్నారు. యేసు తన తండ్రిని వదిలి మరియు సిలువ మరణమును వదిలి వెళ్ళలేదు అనుటకు వారు సాక్షులుగా ఉండిరి. కనుక వారు యేసు ప్రక్కలో బల్లెముతో పొడుచుట కూడా చూసిరి కనుక దాని ప్రకారముగా దేవుని ప్రేమను తండ్రి కృపను మరియు పరిశుద్దాత్మ శక్తిని మనము విశ్వాసము ద్వారా పండుకొని వాటి ప్రకారము నిత్యజీవములోనికి నడిపింపబడినాము.
ప్రార్థన: ప్రభువా నీవు సాతాను మీద మరియు పాపముల మీద విజయము పొందుకున్న వాడివి. నీవు జీవము కలిగిన రాజువు మరియు ఆత్మచేత నింపబడిన తండ్రివి.
ప్రశ్న:
- యేసు ఎముకలు విరగలేదు అను సత్యమును బట్టి మనము ఏమి నేర్చుకున్నాము ?