Previous Lesson -- Next Lesson
3. క్రీస్తును మరియు అతని శిష్యులను ఈ లోకము ద్వేషించును (యోహాను 15:18 - 16:3)
యోహాను 15:26-27
26 తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్ను గూర్చిసాక్ష్యమిచ్చును. 27 మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.
ఈ లోక ద్వేషమును మరియు క్రీస్తు సిలువమరణమును బట్టి త్రిత్వము యొక్క సమాధానము ఏమిటి ? పరిశుద్ధాత్మను పంపుటయే. ఆత్మ వచ్చుట ఈ దినాలలో ఒక ఆశ్చర్యము . క్రీస్తు ఈ లోకమునకు వచ్చుట అనునది దేవుడు ఈ లోకమునకు వచ్చుట అని అర్థము, ఎందుకంటె అతను తండ్రినుంచి వచ్చినవాడు కనుక అతను తన తండ్రి అయినా దేవునితో ప్రేమ కలిగిన సహవాసము ఉన్నది. అతను ఈ లోకము విమోచించబడుట అతని సృష్టిగా ఉన్నది. అతని ఆత్మ ఈ లోకమును తీర్పు తీర్చి మనలను దేవుని పరిశుద్ధతలోనికి నడిపించును. అతని శిష్యులతో ఉన్న సహవాసము ఒక సాత్వికమునకు సాదృశ్యముగా ఉన్నది, ఎందుకంటె ఈ లోకము గర్వముతో ఉండి , నమ్మినవారిని మోసముచేస్తున్నది. అయితే అతను ఆత్మీయ సత్యమై ఉన్నాడు.
స్డేవిధముగా క్రీస్తు తన శిష్యులను అతను దేవుని కుమారుడని మరియు అతని ద్వారా రక్షణ వస్తుందని వారిని ఓదార్చెను. అతని ఆత్మీయ ఓదార్పు మనకు తండ్రి అయినా దేవుని ప్రేమను సాక్ష్యరూపముగా తెలియపరచును. పరిశుద్దాత్మ లేకుండా మనము నిజమైన విశ్వాసమును తెలుసుకొనలేము. కనుక విశ్వాసులు యెవ్వరుకూడా క్రీస్తును వారి సొంత కార్యముల ద్వారా లేదా జ్ఞానము ద్వారా క్రీస్తును చేరుకోలేరు , అయితే ఇది కేవలము క్రీస్తు బహుమానము ద్వారా తరువాత అతని నిజమైన విశ్వాసము ద్వారా మాత్రమే అతని యొద్దకు చేరుకోవచ్చు. కనుక అతను ప్రతి క్రైస్తవుడిని ఐక్యత కలిగి క్రీస్తులో పరిశుద్ధత కలిగి ఉండుమని కోరుకుంటున్నాడు. వారిని అతను విశ్వాసముతో ఉంచును. పరిశుద్ధాత్ముడు మన సాక్ష్యములను కాపాడును. ఒకవేళ నీవు క్రీస్తును ఇతరులకు పరిచయము చేయాలనుకుంటే నీ సొంత ఆలోచనలద్వారా ముందుకు వెళ్ళవద్దు. అయితే నీకు నీవు క్రీస్తు జ్ఞానముకొరకు కనిపెట్టుకొను. అతని మాటలను విని ఏవిధముగా అతడిని ఘనపరచాలో తెలుసుకో. ఎప్పుడైతే నీవు ఈ విధముగా చేసి క్రీస్తు ఆత్మద్వారా నింపబడి ఇతరులకు క్రీస్తును పరిచయము చేసినట్లయితే అప్పుడు యేసు నిను ద్వారా మహిమపరచబడతాడు.
క్రీస్తు తన 11 మంది శిష్యులను తనకు సాక్ష్యమునకు పిలిచి ఉన్నాడు, ఇది వారికి ఒక అవకాశముగా ఉన్నది. ఈ శిష్యులు క్రీస్తు కార్యములను చూసిన సాక్షులైనారు ఈ లోకములో. వారు ఏది చూసారో , విన్నారో వాటికి సాక్షులుగా ఉన్నారు, వారి మాటలు దేవుని సమాధానమునకు సన్నిధులుగా ఉన్నారు. కనుక మన విశ్వాసము ఆ సాక్ష్యాలపైనా ఆధారపడి ఉన్నది. క్రీస్తు ఒక పుస్తకమును వ్రాయలేదు, లేదా అతను అపొస్తలుడు కాదు , అయితే తన రక్షణద్వారా తన పరిశుద్ధాత్మను వారికి ఒక ఆధారముగా చేసి ఉన్నాడు. ఎందుకంటె ఆత్మీయ సత్యము అబద్దబు పలకదు అయితే ఈ లోక రోగమును క్రీస్తు తన శిష్యుల ద్వారా బాగుచేసెను. అందుకే యేసు ," మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తి నొంది నాకు సాక్షులై ఉందురు " అనెను.
ప్రార్థన: మమ్ములను ఒంటరిని చేయక , మాకొరకు వచ్చిన దేవుని కుమారుడా, పరిశుద్ధుడా, దేవునితో ఉన్నవాడా, నిన్ను బట్టి మేము స్తుతిస్తున్నాము, మమ్ములను నీ సాక్ష్యులు గా చేసినందుకు కృతజ్ఞతలు. నీ రాకడద్వారా మేము పరిశుద్ధపరచబడెదము. నిన్ను అనేకులు విశ్వసించులాగున మాకు నేర్పుము.
ప్రశ్న:
- దేవుడు ఈ లోకమునకు సిలువ వేయబడిన యేసును ఏవిధముగా చూపెను ?