Previous Lesson -- Next Lesson
11. పేతురు మరియు యోహాను మొదటిసారిగా బంధించబడి కోర్టుకు కొనిపోబడుట (అపొస్తలుల 4:1-22)
అపొస్తలుల 4:8-11
8 పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెనుప్రజల అధికారులారా, పెద్దలారా, 9 ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక 10 మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు. 11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.
ఈ సంఘటన జరుగు కొన్ని వారముల ముందు పేతురు యేసు ఎవరో తెలియదని భయము కలిగి చెప్పెను. అతను ప్రభువు స్వరము వినలేదన్నట్లుగా శపించెను. అయినప్పటికీ అతను ఇక్కడ పరిశుద్ధాత్మచేత నింపబడినవాడై మరియు అతని యందు క్రీస్తు చిత్తము నెరవేర్చబడెను, కనుకనే ఈ విధముగా చెప్పెను: "ఎప్పుడైతే నిన్ను వారు ప్రత్యక్షగుడారములోనికి మరియు సమాజములోనికి తీసుకొనివచ్చునప్పుడు ఏమి మాట్లాడాలో అని భయపడవద్దు. ఎందుకంటె పరిశుద్ధాత్ముడు ఆ సమయమందు నీ నోటిని పరిశుద్ధాత్మతో నింపి, నీ నాలుక మీద మాటలను ఉంచును. కనుక మాట్లాడుచున్నది నీవు కాదు, అయితే ప్రభువైన యేసే మాట్లాడును. మరియు నీలో కాయము చేయు శక్తిని మరియు జ్ఞానమును అడ్డుకొనును." (మత్తయి 10:18-20)
యూదుల దేశములో నాయకుల ముందర యేసే సాక్ష్యము చెప్పునట్లు ఆ ఇద్దరు అపొస్తలులు కూడా నిలబడిరి. వారు వ్యంగంగా మాట్లాడలేదు, అయితే సాత్వికముద్వారా దేవుని ముందర బాధ్యతకలిగిన మనుషులతో మాట్లాడిరి. వారిని వారు దేవుడు గౌరవముతో, జ్ఞానముతో, సహనంతో మరియు ధర్మముతో గౌరవించాడని భావించిరి.
దానికి బదులుగా పరిశుద్ధాత్ముడు పేతురును అక్కడున్నవారికి బందీగా చేయబడినవానికి మరియు అతను ఆ కృంటి వానికి చేసిన కార్యములను బట్టి వారికి వివరించెను. మరియు అతను వారు బందీని బట్టి మరియు వారు అతనిని అన్యాయముగా రాత్రంతా ఆ బందిఖానాలో ఉంచిన దానిని బట్టి విచారించెను.
వారికి జరిగిన అన్యాయమును బట్టి ఇద్దరు శిష్యులు ప్రభావితము చేశారు. వారి మాటలలో ఉన్న శక్తిని బట్టి వారు ఎక్కువగా మాట్లాడలేదు. అయితే పేతురు ఆ పిర్యాదు సారాంశమును బట్టి లోతుగా విశ్లేషించి, దేవుని విజయమును బహిరంగముగా క్రీస్తులో చూపెను. అతను భయముకలిగి మాట్లాడలేదు, అయితే పాలించువారందరితో మంచిగానే మాట్లాడి ఉన్నాడు, ఎందుకంటె వారి సమయము ఎంత ప్రాముఖ్యమో అని వారికి తెలుసు కనుక. ప్రభువు అతను ఆ దేశమును పాలించువారందరిని క్రీస్తు నందు విశ్వసించుటకు పిలుచుటకు అధికారమిచ్చియున్నాడు. కనుక పేతురులో క్రీస్తు యెడల ఏ అనుమానము ఉండునట్లు తన హృదయములో స్థలము ఇవ్వలేదు. పేతురు యేసును బట్టి వారందరితో ఈ విధముగా చెప్పెను, క్రీస్తు యేసు, మరియు నజరేతులో ఉన్న యెవ్వనస్తుడు అని మరియు మీరు అతనిని సిలువ వేసిరనియు చెప్పెను. పేతురు వారిని బల్లపరుపుగా కాక, వారిని హంతకులని మరియు దేవుని శత్రువులని పిలిచెను. వారు వ్యక్తిగతముగా ప్రభువైన యేసు క్రీస్తును సిలువవేసిరి. కనుక ఇద్దరు మనుషులను పట్టు జాలరులు వారి పొరపాటును ఎత్తి చూపి దేవుని కుమారుడిని జ్ఞాపకము చేయుట ఎంత అద్భుతము. భక్తికలిగిన వారు పాతనిబంధన విషయమును వారు తప్పిపోయారు. దేవుడు వారితో కొన్ని సంవత్సరాల క్రితము చేసిన వాగ్దానమును కూడా క్రీస్తు మరణమును బట్టి కట్టుబడి ఉండలేదు. పేతురు దేవుని నామములో వారి ప్రాసిక్యూటర్ గా ఉంది వారు ప్రభువు కు వ్యతిరేకముగా పాపము చేసారని చెప్పెను. యూదులు యేసుకు వ్యతిరేకముగా మాత్రమే పాపము చేయలేదని అయితే దేవునికి కూడా వ్యతిరేకముగా పాపముచేసిరి అని రుజువు చేసెను. కనుక పరిశుద్దుడైన దేవుడు మారుతినుంచి తిరిగి లేపిన క్రీస్తును వారి ఎదుట ఘనపరచెను. కనుక ఆ ఇద్దరు కూడా ప్రధాన యెజకుడిని ఖండించి క్రీస్తును పూజించిరి. దేవుడు పాత నిబంధన మత సంబంధమైన సంస్థలను పరిగణనలోనికి తీసుకొనలేదని, అయితే వాటిని జయించెనని చెప్పెను. కనుక అతను ఇప్పుడు ఎవరైతే యేసును వెబడించుచున్నారో వారికి అదేవిధమైన అధికారమును యిచ్చియున్నాడు.
యేసు నామములో గొప్ప రహస్యము దాగుకొని ఉన్నది. నరకము ఈ నామమును బట్టి విషము కంటే మరియు భయంకరముగా భయపడెను, అయితే పరలోకము ఈ నామమును బట్టి ఘనత కలిగి ఉండును. పరిశుద్దాత్మదేవుడు ఈ లోక రక్షకుడిని ఘనపరచి, మరియు దేవుడు యేసును తన కుడి స్థానమందు కూర్చోబెట్టుకున్నాడు. క్రీస్తు పరిశుద్దాత్మశక్తి ద్వారా నిత్యజీవమైన దేవునితో ఉన్నాడు. అతను ఈ భూమి మీద ఉన్నప్పటికంటే ఎక్కువగా అద్భుతములను ఈ దినము చేస్తున్నాడు, మరియు కొన్ని వేలమంది సేవకుల ద్వారా అతను కార్యము చేస్తున్నాడు. రక్షింపబడిన ప్రతి ఒకారు కూడా పరిశుద్దాత్మ ద్వారా మార్పుచెంది ఉంటున్నారు. జీవం కలిగిన క్రీస్తు నమ్మకమైన వాడు మరియు విజయశీలుడు. ఎవరైతే అతని యందు నమ్మకము కలిగి ఉంటాడో వారు శక్తి కలిగి ఉంటారు.
పాత నిబంధన ప్రకారముగా పేతురు పాలకులకు యేసును గూర్చి, అతను ఒక పునాది, శక్తి కలిగిన వాడని, మరియు కిరీటమును కలిగిన వాడని, మరియు దేవుని ఆత్మీయ ఆలయమని చెప్పెను. కనుక ఈ లోకములో ఎవరైతే క్రీసునందు విశ్వాసము కలిగి ఉంటారో వారు దేవుని ఆలయమును కట్టుచున్నారు. క్రీస్తు ఆత్మీయ శరీరమునకు ఒక అధిపతిగా మరియు శరీరములో ఉండు అవయవములను నడిపించువాడుగా ఉన్నాడు. క్రీస్తు ఆత్మీయ శరీరమునకు ఒక రహస్యముగా ఉన్నాడు, మరియు సిలువలో అతని విజయమునకు ఒక ఫలితముగా ఉన్నాడు. కనుక సహోదరుడా నీవు క్రీస్తు మీద కట్టబడి ఉన్నావా, లేక యూదుల పాలకుల మాదిరి అతనిని తిరస్కరించావా, మరియు క్రీస్తును బట్టి దేవుడిని ప్రేమించుచున్నావా?
ప్రార్థన: ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఈ లోకములో ప్రజలలో కార్యములు చేస్తున్న రక్షకుడివి, మరియు వేలమంది విశ్వాసులను లేపి వారి హృదయములలో సంఘములను కట్టువాడవు. నీకు నమ్మకముగా ఉండునట్లు మరియు నీ ఆత్మకొరకు వచ్చునట్లు సహాయము చేయుము, అప్పుడు నీ ఆత్మీయ ఆలయమును ముగించునట్లు మరియు నీవే అధిపతివి.
ప్రశ్న:
- ప్రధాన యాజకుని ముందర పేతురు యొక్క సమాచారం ఏమిటి?