Previous Lesson -- Next Lesson
11. పేతురు మరియు యోహాను మొదటిసారిగా బంధించబడి కోర్టుకు కొనిపోబడుట (అపొస్తలుల 4:1-22)
అపొస్తలుల 4:1-7
1 వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును 2 వారు ప్రజ లకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరు త్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి 3 వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి. 4 వాక్యము వినినవారిలో అనేకులు నమి్మరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదువేలు ఆయెను. 5 మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి. 6 ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితో కూడ ఉండిరి. 7 వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా
ఎక్కడైతే దేవుని ఆశీర్వాదము ఉండునో అక్కడ నరకము కూడా రేకెత్తించును. యేసు కృంటివాడిని పేతురు యోహాను ద్వారా స్వస్థతపరచెను. కనుక అక్కడున్న గుంపు సువార్తను వినుటకు పరిగెత్తుకుని వచ్చిరి. వారు అక్కడ కలుసుకొనుట అపాయమని దేవాలయపు పోలీసు జోక్యం చేసుకొన్నారు, ఎందుకంటె అద్భుతములు గురించి వారికి కొన్ని అనుమానాలు ఉన్నవి కనుక. మత నాయకులు దేవాలయములో ఒక ప్రక్కలో నిలుచుండి ప్రవక్తల బాధ్యతలను దేవాలయములో క్రమముగా ఉండునట్లు గమనించిరి. విద్య కలిగిన సద్దూకయ్యులు మనుషులు పట్టు జారలూరి బట్టి ప్రేరేపణకలిగి ఉండిరి, ఎందుకంటె వారు ఏవిధమైన అనుమతులు లేకుండా బోధిస్తుండిరి కనుక. బహిరంగముగా ప్రకటించుట అనునది వారికి విద్యాకలిగిన వారినుంచి మరియు జ్ఞానము కలిగిన వారినుంచి అనుమతి వచ్చిఉండేను. ఎందుకంటె వారు యేసు మరణము నుంచి పునరుత్తానుడై లేచాడని ప్రకటించుచుండిరి. అయితే చదువుకున్న వారు మరియు జ్ఞానులు అతని పునరుత్తనమును బట్టి ఖండించిరి. కనుక వారు ఈ విషయమును బట్టి ప్రకటించిరి కనుక వారిని అనగా అపొస్తలులును దేవాలయపు పోలీసులు పట్టుకొని బంధించిరి. అక్కడ వారు కృంటి వాడిని యేసు స్వస్థపరచుటను బట్టి యేసును స్తుతిస్తూ ఘనపరచుచు కీర్తించిరి. మరియు ఆ దేవాలయములో ఉన్న వారికి యేసును బట్టి ప్రకటించుటకు యేసు ఇచ్చిన అవకాశమును బట్టి కూడా అతనిని ఘనపరచిరి. మరియు వారు తరువాత దినమును బట్టి జరుగు కార్యములను బట్టి ముందుగానే ప్రార్థనాపూర్వకముగా సిద్దపడిరి.
అపొస్తలులకు సంబంధించిన సమాచారమును బట్టి అక్కడున్న గుంపుకు ప్రభావము చూపెను. అక్కడున్న అనేకమంది సిలువవేయబడి మరియు మరణమును జయించిన యేసును బట్టి అతని యందు విశ్వాసము కలిగి హృదయమందు నలుగగొట్టబడిరి. ఆ విధముగా వారు చేస్తున్నప్పుడు వారి పాపములకు క్షమాపణ పొందిరి. అప్పుడు సంఘములో ఐదువేల మంది విశ్వాసులు చేర్చబడిరి. వారుకూడా పరిశుద్ధాత్మను పొందుకొనిరి. క్రీస్తు వారిలో నివాసము చేసి వారి ద్వారా కార్యములను చేసెను. మరియు యేసు కొరకు బంధించబడిన వారి కొరకు వారు యెడతెగక ప్రార్థన చేసిరి.
తరువాత దినము సంహేద్రిన్ అను సభ్యులు కూడుకొని, యూదులు కలుసుకొనుటకు బట్టి విచారణ చేసిరి. ఈ కమిటీ ప్రధాన యెజకుని కుటుంబములో చేర్చబడిరి, వీరు యేసు విషయములో గొప్ప వ్యతిరేకస్తులుగా ఉండిరి. వారు వ్యక్తిగతముగా అతని దైవదూషణను బట్టి చంపమని చెప్పిరి, ఎందుకంటె ఇప్పటి నుంచి దేవుని కుమారుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చుండునని వారికి చెప్పెను. ఈ శక్తి ఇక్కడ ఇద్దరి ఆపోస్టులలో కార్యము చేయబడినది.
పేతురు మరియు యోహాను ద్వారా ఖైపాస్ ముందు నిలబడినప్పుడు, మరియు ఆన్నస్ అధికారంలో, యేసు తనను ఇబ్బందిపెట్టినవారికి మరియు తీర్పుచెప్పినవారికి పచ్చాత్తాపము పొందుటకు అవకాశమును ఇచ్చెను. ఈ విషయము అపొస్తలులకు ప్రాముఖ్యముగా ఉండలేదు అయితే న్యాయాధిపతులను ప్రాముఖ్యముగా ఉండెను. వారు క్రీస్తు నందు నమ్మకము కలిగి ఉండుటకు మరియు విశ్వసించుటకు ఇంకా అవకాశము ఉండెను.
సమాజమందిరములో వారివిషయములో పరిచయమును బట్టి ప్రశ్నలు నిదానముగా వేయలేదు, అయితే సంఘటనను బట్టి నేరుగా ప్రశ్నలు వేసిరి. వారిని ఎవరు పంపారో అని శిష్యులను అడిగిరి, మరియు ఏవిధమైన శక్తి వారిలో కార్యము చేయుచున్నదని. ఈ ప్రశ్ననే వారు బాప్తీస్మమిచ్చు యోహానును మరియు యేసును కూడా అడిగిరి. వారు దేవుని శక్తిని చూసి అతని అద్భుతములను చూసిరి,అయితే పరిశుద్దాత్ముని కార్యములను అర్థము చేసుకొనలేకపోయిరి. వారు ప్రభువు స్వరమును బట్టి కఠిన హృదయము కలిగి ఉండిరి కనుక దేవుని శక్తి కలిగిన మాటను బట్టి అర్థము చేసుకొనకపోయిరి. వారి హృదయములను గర్వమునకు ఇచ్చిఉండిరి కనుక ధర్మశాస్త్రమును బట్టి కఠినముగా ఉండిరి.
ప్రార్థన: ఓ ప్రభువా నా హృదయమును తెరచి నీ ఆత్మచేత నా మనసులో నింపుము. నీ వాక్యమును ప్రేమించునట్లు, నీ ప్రకటన యందు నమ్మకము కలిగి ఉండునట్లు, మరియు నీ ఆజ్ఞలను గైకొనునట్లు మరియు నీ ప్రేమను వ్యతిరేకించకుండునట్లు ఉండులాగున నన్ను వెలిగించుము. మా దేశములో ఉండు వారు యేసే రక్షకుడని, మరియు అతనియందు విశ్వాసముంచి నిత్యజీవము పొందునట్లు మా దేశపౌరులను వెలిగించు.
ప్రశ్న:
- ప్రధాన సమాజముతో మరియు ఇద్దరి అపొస్తలులతో జరిగిన సమావేశము ఏమిటి?