Previous Lesson -- Next Lesson
2. క్రీస్తు పరలోకమునకు ఆరోహణమగుట (అపొస్తలుల 1:9-12)
అపొస్తలుల 1:9-12
9 ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను. 10 ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచు చుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి 11 గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచు చున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ ం 12 అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది,
క్రీస్తు జీవించిఉన్నదని శిష్యులకు తెలిసెను, కనుకనే అతనికి సహజమైన ధర్మశాస్త్రమును పాటించ లేకుండుటకు ఆత్మీయ శరీరము అతనికి ఉండెను. అతని నిజమైన మనిషి మరియు దేవుడు. పాత నిబంధన గ్రంథ ప్రవచనాలు ద్వారా వారు వెలిగించబడుటకు అతను పరలోకమునకు వెల్లువరకు నలభై దినములు వారితో ఉండెను, ముఖ్యముగా అతని మరణమును మరియు పునరుత్తనమును బట్టి. చివరిగా తన బోధనలద్వారా తన వాగ్దానాలను ఆత్మ ద్వారా వారికి కుమ్మరించెను, అక్కడనే అపొస్తలులు దేవుని శక్తిచేత నింపబడినారు కనుక.
క్రీస్తు ఈ భూమిని గురించి చివరి నిర్ణయము. పరిశుద్ధాత్ముడు క్రీస్తు కార్యములను ముగించాడు కనుక ఇక ఏది కూడా అవసరమై లేవు. కనుక అతను తన తండ్రి యొద్దకు వెళ్ళుటకు సిద్ధముగా ఉండెను. అతను రహస్యముగా అదృశ్యమవలేదు లేదా ఆశ్చర్యముగా విడువలేదు, ఎందుకంటె నలభై దినముల సమయములో ఆలాగున చేసెను కనుక, ఎందుకంటె ద్వారముల గుండా మరియు గోడల గుండా యేసు ప్రవేశించెను కనుక. శిష్య్లల కన్నుల ఎదుట అతను మరణము నుండి మహిమకరముగా లేచి పరలోకమునకు వెళ్లెను. ఆయన ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ ను వెలుగుకరమైన గాలి వాలే జయించెను. అతను తన తండ్రి యొద్దకు శక్తిచేత నడిపించబడినాడు. పరిశుద్ధత చేత మరియు మహిమచేత దేవుడు తన కార్యమును సాగించెను. క్రీస్తు తన కార్యమును ముగించి మనిషి రాజ్యమును విడిచి మహిమకరమైన దేవుని యొద్దకు ప్రవేశించెను.
నిత్యుడగు సృష్టికర్త కేవలము పరలోకములోనే ఉండలేదు, ఎందుకంటె మన భూగోళం చుట్టూ తిరుగుతులు ఉన్నది కనుక, ఎందుకంటె పరలోకము కొన్నిసార్లు పైకి మరియు కొన్నిసార్లు క్రిందికి వచ్చును. సూర్యుడు కూడా మన మీద లేదు అయితే ఒక పెద్ద బంతిలాగా ఉండి, అన్నిచోట్ల ఒక్కో విధముగా ఉండును. అయితే దేవుడు ఎక్కడ? క్రీస్తు ఎక్కడ? మన ప్రభువు ఈ ముందున్న ప్రశ్నను బట్టి నిర్ణయాత్మక సమాధానమును యిచ్చియున్నాడు: " చివరి వరకు నేను మీతో కూడా ఉన్నాను".
దేవుడు పైన లేదా క్రింద కాదా ప్రతి చోట మనచొట్టూ ఉన్నాడు. అతను సమయమును బట్టి లేదా స్థలమును బట్టి లేదు. ఏ మనిషి కూడా అతని గొప్ప మహిమను గ్రహించలేరు. క్రీస్తు తన శిష్యులు పెట్టుకుంటారని గ్రహించాడు. అతను పరలోకమునకు వెళ్ళుట అందరికీ కనపడినది కనుక పరలోకము పైన ఉన్నాడని తెలిసినది. కనుక క్రీస్తు తనను వెంబడించువారికి అర్థమగు రీతిలో చెప్పియున్నాడు. కనుక ఇప్పుడు వారిని తన తండ్రి యొద్దకు వెళ్లునట్లు వదిలివేసాడు, అతను కుడి పార్శ్యమున కూర్చుంది నిత్యా రాజ్యము చేయుటకు. క్రీస్తు మరియు తండ్రి ఇద్దరు ఒకటే. కుమారుడు తండ్రితో ఏవిధముగా అయితే ఉన్నదో అదేవిధముగా తండ్రి కూడా కుమారునితో ఉన్నాడు. కనుక ఎవరైతే క్రీస్తును చూస్తారో వారు దేవునిని కూడా చూసినట్లే. మనము తండ్రి, కుమారా మరియు పరిశుద్దాత్మ ఒకే దేవుడని విశ్వసిస్తాము. తంగినంతగా ఎవ్వరు కూడా ఈ రహస్య ఐక్యత వ్యక్తిత్వమును స్పష్టము చేయలేరు. సువార్త చెప్పినట్లు క్రీస్తు మృతినుంచి పునరుత్తానుడైన తరువాత నలభై దినములు భూమి మీద ఉంది ఆహారోహణము అయినదని చెప్పబడినది, అప్పుడు మానవునిగా ఉంది పరలోకమునకు అనగా విశ్వం అయినా దేవుని దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అతను తన తండ్రి కుడిపార్శ్యమున కూర్చుంది, సమస్త మహిమ, ప్రేమ మరియు అధికారము కలిగి ఉండెను.
యేసు పరలోకమునకు వెళ్ళుట తన శిష్యుల జీవితములో ఒక గొప్ప మార్పును మరియు వారి జీవితములో ఒక చరిత్రను తీసుకొచ్చేనని అనుకొనెను. కనుక వారు పైన ఉన్న మేఘములవైపు మాత్రమే ప్రభువు దాగుకొన్నాడని చూసిరి. క్రీస్తు తండ్రితో ఉన్నాడు కనుక మనము కూడా పైనఉన్నవాటిని బట్టి చూడాలి. మన నడిపింపు పరలోకమునకు వెళ్ళాలి, ఎందుకంటె మన ఇల్లు తండ్రి అయినా దేవునితో ఉన్నది కనుక.
జీవము కలిగిన ప్రభువు తన శిష్యులను పరలోకమునకు మరియు ముందు జీవితమునకు సంబంధించిన విషయములను బట్టి స్థిరముగా ఉండాలని అనుకొనలేదు, ఎందుకంటె వారందరూ మతమును బట్టి మూగవారై ఉండిరి. అయితే వారు ఈ భూమి మీద స్థిరముగా ఉండాలని అనుకొన్నాడు. కనుకనే అతను ఇద్దరు దూతలను ఈ లోకమునకు పంపి వారు గొప్పగా కనపడిన తరువాత, యేసు నిజముగా పరలోకమునకు కొనిపోబడెను అని శిష్యులకు చెప్పెను. అతని కొనిపోబడుట ఒక బ్రతిని కలిగించునది కాదు, అయితే సత్యమును పునాది వేసినది.
అదేసమయములో క్రీస్తు దూతలు విశ్వాసుల నిరీక్షణ ముగింపు కాలేదని చెప్పిరి, ఎందుకంటె ఎలాగైతే క్రీస్తు మేఘములలోనికి వెళ్లేనా, అదేవిధముగా తిరిగి వస్తాడని అనుకొనిరి. ఈ లోక చరిత్ర ఒకే ఒక్క సమాచారంతో కేంద్రియకృతమైనది - ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి వస్తాడు! క్రైస్తవులు ఈ విధమైన విశ్వాసమును నిత్యమూ కలిగి ఉంటారు. మన ప్రభువు జీవము కలిగి ఉన్నాడు కనుక తిరిగి వస్తాడు, ఎందుకంటె అతను నిన్ను ప్రేమించి నీకొరకు ఆశకలిగి ఉన్నాడు. అతను ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు అయితే అతను తప్పక వస్తాడు. నీవు యేసు కొరకు ఎదురుచూస్తున్నావా? నీ ఆలోచనలకూ అతను కేంద్రముగా ఉన్నాడా? నీవు క్రీస్తును ప్రేమిస్తున్నావా? అతని గురించి రోజు ఆలోచిస్తున్నావు? అతని వైపు నీ ప్రార్థనలను ఉంచుకున్నావా? అతని రాకడ కొరకు ఎదురుచూస్తున్నావా? ప్రభువు కొరకు ముందు జాగ్రత్త కలిగిన వారు తప్ప మరి ఎవరూ కూడా జ్ఞానము కలిగి ఉండలేరు.
శిష్యులు గొప్ప ఆనందముతో కిద్రోను నది దగ్గరకు హృదయ పూర్వకముగా వెళ్లిరి. వారు యెరూషలేములో ఎక్కడైతే ప్రభువుతో నిలబడి ఉందిరా అక్కడకే తిరిగి వెళ్లిరి, ఒలీవ పర్వతముల మీద గెత్సేమనే తోటలో. అక్కడే వారు దేవుని ఉగ్రతను పొందుటకు నిద్రమత్తులై ఉండిరి. చివరిగా అతను సంకెళ్లతో బంధించబడెను. ఇప్పుడు వారు ఈ సంఘటనను బట్టి చింతించక, క్రీస్తు ఆనందముతో విజయము కలిగి ఉండిరి. ఒక పెద్ద గంట వాలే దూతలు వారి హృదయములను మోగించిరి: ప్రభువు వస్తున్నాడు. అతను త్వరగా వస్తున్నాడు.
ప్రార్థన: ఓ ప్రభువైన యేసు క్రీస్తు నీవు జీవము కలిగి ఉంటివి కనుక నీ అవరోహణమును నీ శత్రువులకు తెలుసు. నీవు దేవునిలో ఉన్న విజయము కలిగిన వాడివి, మరియు నీవు తిరిగి వస్తున్నావు. నీ ఆనందకరమైన విజయమును బట్టి మాకు బోధించు, నీ వాక్యము కొరకు మా మనసులు మరియు హృదయములు కదలనిమ్ము, అప్పుడు నీవు తిరిగి వచ్చు వరకు పనిలో ఉండెదము.
ప్రశ్న:
- దూతలు ఇచ్చిన సమాచారం ప్రకారముగా క్రీస్తు ఎలా వస్తాడు?