Previous Lesson -- Next Lesson
b) యేసును గూర్చిన రకరకాల పుకారులు (యోహాను 7:14-53)
యోహాను 7:14-18
14 సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. 15 యూదులు అందుకు ఆశ్చర్య పడిచదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి. 16 అందుకు యేసునేను చేయు బోధ నాది కాదు;నన్ను పంపినవానిదే. 17 ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల,ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించు చున్నానో, వాడు తెలిసికొనును. 18 తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహి మను వెదకువాడు సత్యవంతుడు,ఆయన యందు ఏ దుర్నీతియులేదు.
యేసు మృతిని బట్టి భయపడలేదు . అయితే యెరూషలేములో ప్రతి ఒక్కరితో కూడా మంచి స్వభావము కలిగి తన తండ్రి అయితే దేవుడిని ఘనపరచుచు వెళ్లెను. అక్కడ అతను ఓరికెనే ఉండక దేవాలయములోనికి ప్రవేశించి దేవుని గూర్చిన సువార్తను ప్రకటించి వాక్యములను బోధించెను. అప్పుడు అక్కడున్న వారు దేవుడే నేరుగా వారితో మాట్లాడుతున్నాడని భావించిరి. అనుదుకే వారు ఒకరికి ఒకరు ప్రశ్నలు వేసుకొనిరి: ఎక్కడి నుంచి ఈ యెవ్వనస్తుడికి ఈ విధమైన ఆలోచనలు వచ్చాయి ? అతను ఏ గొప్ప ఉపాధ్యాయునితో కూడా తర్ఫీదు పొందలేదు. కనుక ఏవిధముగా ఒక కట్టేపని చేయు కుమారుడు ఈ విధముగా దేవుని గురించి చెప్పేగలడు ?
యేసు సమాధానము చెప్తూ , " నిజముగా నేను ఒక బోధకుడినే. దానికంటే ఎక్కువగా నేను దేవుని వాక్యమై ఉన్నాను. ప్రతి ఆలోచన ఇష్టము దేవునిదే నాలో ఉన్నది. నా బోధ నాగురించినది కాదు అయితే నేను దేవుని స్వరమును, ఆటను నాలో ఉన్నాడు, నా తండ్రి నాకు నేర్పించువాడు. నా సొంత ఆలోచనలచేత రాలేదు, అయితే దేవుని ఆలోచనలే నాలో ఉన్నాయి. నేనే ప్రకటనను పూర్తిగా నెరవేర్చాను ".
ఆ విధముగా యేసు తన తండ్రిని ఘనపరచి తనను తాను ఆయనకు సమర్పించుకొనెను; దేవుని అపొస్తలుడు అని పిలవబడ్డాడు. ఆటను తనకు తాను గా పంపబడలేదు, అయితే అతను తండ్రి నామములో ప్రతి అధికారము కలిగి వచ్చియున్నాడు. కనుక యేసు దేవుని కుమారుడై ఉండి మరియు అతను ఒక అపొస్తలుడుగా కూడా ఉన్నాడు, మనము దేవునికి ఏవిధముగా ఆరాధనను , విశ్వాసము కలిగి ఉంటామో అదేవిధముగా యేసును బట్టి కూడా అలాగే కలిగి ఉండాలి.
యూదులకు అర్థము అగునట్లుగా యేసు కొన్ని సూచనలు చేసెను అనగా అతని బోధనలు దేవుని చిత్తమునకు సంబందించినవాని వారు తెలుసుకొనుటకు వారికి కొన్ని కార్యములను చూపెను. కనుక యేసు యొక్క బోధనా మనిషిని ఎలా మోసము చేయగలడు ? అందుకే , " నా సువార్తాలను సారముగా నీవు నడుచుకున్నట్లైతే అప్పుడు నీవు నా గొప్ప తనమును తెలుసుకుంటావు. క్రీస్తు వాక్యములను వచనముల ప్రకారము నీజీవితములో ఉంచుకో, అప్పుడు అతని మాటలు మనిషికి ఉపయోగకరమైనవని తెలుసుకుంటావు."
క్రీస్తు బోధనలు నీ జీవితములో అవలంబించుకోవాలనే మొదటగా నిన్ను నీవు అతనికి సమర్పించుకోవాలి. అతను ఏమి అనుకొన్నాడు అదే నీవు కూడా అనుకున్నావా? దీని ద్వారా కాక నీవు దేవుని నుంచి ఏమి కూడా పొందుకోలేవు. నీ చిత్తమైనది ప్రభువుకే చెందినది, అప్పుడు నీ ప్రతి చిత్తము కూడా క్రొత్తదిగా ఉండును అప్పుడు నీవు దేవుడు ఎవరో క్లుప్తముగా తెలుసుకుంటావు.
ఎవరైతే తండ్రి యొక్క చిత్తమును నేర్చుకొనునో వారి యేసు చిత్తమును కూడా తెలుసుకొని దేవుని సువార్తకు మరియు ధర్మశాస్త్రమునకు గల తేడాను తెలుసుకొనుము. మన ప్రభువు మన భుజములమీద ఒక బరువైన కాడిని మోయుమని ఉంచలేదు, అయితే అదే సమయములో మనము దానిని మోయుటకు కావలసిన శక్తిని మనకు దయచేయును. అప్పుడు నీవు అతని చిత్తమును సంతోషముగా మోయుటకు ఇష్టపడెదవు. ఎవరైతే యేసు ఆజ్ఞను పొందుకుంటారో వారు బతుకుటకు దేవుని ప్రేమను పొందుకుంటారు. అతని బోధన మనలను ఓడిపోవునట్లు చేయదు, మోషే ధర్మశాస్త్రములో చేయబడినట్లు, అయితే దేవుని సంపూర్ణ కృపచేత నింపబడునట్లు చేయును. ఎవరైతే దేవుని చిత్తమును వారి జీవితములో ఉంచుకోవాలని అనుకుంటారో వారు క్రీస్తు బోధనలను విని దేవునితో వ్యక్తిగతమైన సంబంధముకలిగి ఉండి యేసు కేవలము ఒక మనిషి మాత్రమే కాదని అయితే ఓకే గొప్ప బోధకుడని తెలుసుకొని అతను దేవుని అవతారమై ఉన్నాడని తెలుసుకుంటారు. అతను వట్టిచేతులతో రాలేదు అయితే పాప క్షమాపణ కలిగిన దేవుని గొప్ప శక్తితో వచ్చినాడు.
యోహాను 7:19-20
19 మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా?అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు;మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను. 20 అందుకు జనసమూహమునీవు దయ్యము పట్టినవాడవు,ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా
యూదులకు యేసు ఈ విధముగా చెప్పెను, " మీకు ధర్మశాత్రము వచ్చినప్పటికీ మీలో ఎవ్వరు దాని ప్రకారముగా నడవలేదు" ఈ మాటలు అక్కడున్న యూదుల హృదయములను గొచ్చినట్లుగా ఉన్నది, ఎందుకంటె అక్కడున్న ఏఒక్కరూ కూడా పాత నిబంధన గ్రంథ ధర్మ శాత్ర ప్రకారముగా నడుచుకొనలేదు కాబట్టి. ఎవరైతే ఏ చిన్న పాపము చేసినా కూడా దేవుని ఆజ్ఞకు విరుద్ధముగా ఉంది దేవుని ఉగ్రతను పొందుకొన్నవారిగా ఉన్నారు. ఈ మాట ద్వారా యేసు యూదుల కసి నీతినిబట్టి మోసము చేయువారుగా ఉండిరి.
యేసు వారి నాయకుల ఆశలను తెలుసుకొనెను , వారి ఆశలు నాశనము చేసేవిగా ఉన్నవి. కనుక యేసు నుంచి ఏదీ కూడా మరుగై ఉండదు . మరియు అతనిని వెంబడించువారికి ఒక ఆశకలిగి ఉండుమని వారిని ఆజ్ఞాపించెను.
మరియు అతను అదేప్రకారముగా, " మీరు నానన్నెందుకు చంపాలని అనుకున్నారు ?"
అక్కడున్న గుంపు యేసు మాటలను వెనక్కి తీసుకొన్నారు, మరియు అక్కడున్న వారిలో ఎవ్వరు కూడా నీతిమంతులు లేరని కూడా చెప్పెను. అయితే వారి సమాధానము " లేదు, ఎవరు నిన్ను చంపాలనుకున్నారు ?" దేవుడు నిషేధించెను! " కొంతమంది చెడ్డ ఆత్మా అతనిని కమ్మెను అని కూడా చెప్పిరి. వారి ద్వేషములో వారు గ్రుడ్డిగా ఉండిరి, మరియు పరిశుద్ధాత్మను మరియు చెడు ఆత్మకు గల మధ్య తేడాను కూడా కనుగొనలేక పోయిరి. వారు దేవుని ప్రేమకు సంబందించిన జ్ఞానమునకు దూరమాయిరి.
ప్రశ్న:
- సువార్త దేవుని ద్వారా వచ్చినది అని ఏ విధముగా పరీక్ష చేయబడినది ?