Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Acts - 011 (Peter’s Sermon at Pentecost)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

6. పెంతేకొస్తు దినమందు పేతురు యొక్క ప్రసంగము (అపొస్తలుల 2:14-36)


అపొస్తలుల 2:14-21
14 అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెనుయూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాట 15 మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు. 16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా 17 అంత్య దినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ ¸°వనులకు దర్శనములు కలుగును మీ వృద్ధుల 18 ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. 19 పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. 20 ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపుసూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారు దురు. 21 అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. 

భాషలలో మాట్లాడుటకంటె ఎక్కువగా ప్రవచించడము ముఖ్యము. భాషలలో మాట్లాడుట అనునది పరిశుద్దాత్ముని వరము, దాని ద్వారానే మనిషి సంపూర్ణముగా దేవుని వైపు తిరుగును, మరియు అతనిని ఘనపరచి, ఆరాధించి, మహిమపరచుటకు మరియు ప్రార్థించుటకు అవకాశము కలదు. నిజమైన ప్రవచనము హృదయములో నిజమైన పశ్చ్చత్తాపమును కలిగించును, మరియు దేవుని సన్నిధిలో నిలువబడుటకు కారణముగా ఉండును.

యూదులు ఆశ్చర్యము పొందినతరువాత అపొస్తలులు దేవునిని ఘనపరచుట వినిరి, పేతురు నోటినుంచి వచ్చిన పరిశుద్దాత్మ ప్రసంగము వారి హృదయములను పొడిచెను. దేవుని ఆత్మ కనపడినదని అపొస్తలులు స్పష్టముగా చెప్పిరి, మరియు అతని రాకడను గూర్చి కూడా బయలుపరచిరి.

పేతురు ఆ గుంపు ముందర ఒంటిరిగా వినువారికి వాగ్ధాటిగా ఆకర్షించి ఉండలేదు. అయితే, పన్నెండుమంది శిష్యులందరు కూడా కలిసి వచ్చి ప్రార్థన చేసే ఒక గుంపుగా ఉండిరి, మరియు మాట్లాడువారికి చుట్టూ ఉండిరి. పేతురును ఆ గుంపుతో మాటలాడుటకు ఇబ్బంది కలిగెను, ఎందుకంటె అతను ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండలేదు కనుక. అయినప్పటికీ సత్యమైన ఆత్మ అతని ఆలోచనలను అతని హృదయములో ఉత్తేజపరచెను, అనగా వారితో అతను కొన్ని దినములు ఉండలేదు అన్నట్లుగా. పరిశుద్దాత్మ మాటలు వారు హృదయములలో నిలబడెను, మరియు దేవుడు అపొస్తలుల ద్వారా మాట్లాడేను. పేతురు వినువారి ఎదురుగా ఆశ్చర్యముగా పడలేదు, అయితే వారి ఎదుట మౌనముగా గౌరవంగా నిలువబడి మాట్లాడేను.

మొదటగా ఎగతాళి చేయువారికి పేతురు క్లుప్తముగా చెప్పెను, అదేదనగా మతపరమైన పట్టణములో కూడా ఉదయము 9 గంటలకే త్రాగుతారని. అయితే పొరుగు వారు దానిని ఓర్చుకోలేరు. అయితే ఆ లాంటి వానికి తగిన శిక్ష తప్పదు.

రెండవడిగా, చేపలు పట్టు వారు అతని బోధనలకు తమ హృదయములను తెరచిరి. వారు వినుటకు చెవులు తెరువుమని అడిగెను, అప్పుడు దేవుని ఆత్మ వారిలోనికి వచ్చునట్లు. పేతురు ఆ గుంపుకు కన్నీళ్లతో, సున్నితముగా,మానసికంగా, బోధించలేదు, మరియు మనుషుల ఇష్టములను బట్టి తీర్పు చేయుమని బలవంతపెట్టలేదు. అయితే, అతను పాత నిబంధన ప్రవచనములను చూపి, తగిన సమయములో వాటిని నెరవేర్చుమని చెప్పెను. పరిశుద్ధ బైబిల్ గ్రంథమునుండి వారి కన్నుల ఎదుట ఏమి సంఘవించినదో అని వారికి వివరించెను. అయితే వారికి ఇచ్చిన పరిశుద్ధాత్మను దేవుని వాగ్దానములను నెరవేర్చునట్లుగా వారిని ఒక సాక్షులుగా చేసెను.

అపొస్తలులలో ఉన్న నాయకునికి యూదులకు సంబంధించిన ఒక ప్రకటనను ఉపయోగించుకొనుటకు ధైర్యము కలిగెను: "యవేలు ప్రవక్త మాట్లాడినది." ప్రవచనము నెరవేర్చబడి బయలుపరచబడినది. పరిశుద్ధాత్ముడు ఈ లోకములో నివాసము కలిగి ఉన్నాడు. కనుక మనము అతను క్రిందకు రావాలని అడగకూడదు, అయితే అతనిని పొందుకోవాలి, ఒక పిల్లవాడు తన తండ్రిని పొందుకున్నట్లు. మనము అతనిని బట్టి ప్రభువుకు కృతజ్ఞత చెప్పాలి. ఆత్మ వాక్యములనుంచి మన కన్నులలోనికి వచ్చును, అదే విధముగా క్రీస్తు సువార్త కూడా మన మనసులను మార్చును. మన ఉపవాసము, వృత్తి, మరియు తీవ్రమైన శరీరము పొర్లు మంచి ఆత్మను చేయదు. అయినప్పటికీ దైవత్వము కలిగిన వ్యక్తి త్రిత్వములో ఉన్నప్పటికీ మన హృదయములు అతని కొరకు తెరచునట్లు చేయును. ఆనందముతో కృతజ్ఞతతో యేసు యొక్క మాటలను అతని శిష్యులనుండి నేర్చుకోవాలి: "పరిశుద్ధాత్మను పొందుకో".

ప్రవక్త అయినా యవేలు చెప్పినట్లు, పురుషులు, మరియు స్త్రీలు, యవ్వనస్తులు, మరియు వృద్దులు, దేవుని ఆత్మను పొందుకొనెదరు. యూదులు మాత్రమే యేసు వాగ్దానములను పొందుకొనువారు కాదు. ఈ ప్రవచనము యూదులకు ఒక గొప్ప అద్బుతమును ఏర్పరుస్తుంది, ఆత్మీయముగా మనము గమనించుకుంటే, ఇది పురుషులకు మరియు స్త్రీలకూ, తండ్రులకు మరియు పిల్లలకు, మరియు బానిసలకు యూదులకు మరియు అన్యులకు ఒక వ్యత్యాసమును కలిగించును. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళవచ్చు. అతని ఆనందము ఈ లోకమంతటిలో ఉన్నది కనుక నలిగినా హృదయము కూడా గ్రహించును, కనుక ఎవరైతే అతనిని అందరూ విశ్వసిస్తారు.

యవేలు ప్రవక్త ద్వారా మరియు అపొస్తలుడైన పేతురు ద్వారా దేవుడు మాట్లాడినట్టు ఈ లోక ముగింపులో అందరు కూడా పరిశుద్దాత్మ సూచనలను ఇచ్చాడు. దేవుడు చెడ్డవారిని ఎన్నో సంవత్సరములనుంచి సహనంతో తట్టుకొన్నాడు. అయితే దేవుని కుమారుడు మన పాపములన్నిటినీ ఆ సిలువలో క్షమించాడు. కనుక, ఆత్మ ఏవిధమైన ఆటంకము లేక శక్తి కలిగి వచ్చును. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు, దేవునిని తెలుసుకొంటారు, అతనిని ఘనపరుస్తారు, మరియు క్రీస్తును మహిమపరుస్తారు. అయితే ఎవరైతే పరిశుద్దాత్ముడ్ని పొందుకొనలేరో వారు తీర్పులోనికి వచ్చెదరు. ఇది ఎప్పుడైతే పరిశుద్దాత్మ వారి మీదికి వచ్చును. ఎవరైతే నిత్యా జీవమును పొందాక పోవునో అతను ఖండించబడును, అయితే ఎవరైతే దేవుని ఆత్మను అనుభవించునో వారు అతని నిత్యా జీవమును పొందుకొనును. అతను దేవుడిని గుర్తించి అతని జ్ఞానముకలిగిన చిత్తములో ఎదుగును. అయితే, ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు నివాసము కలిగి ఉండునో వారు పరిశుద్ధ దేవునికి కుమారునిగా ఉండును.

ఈ అనుగ్రహము యొక్క సువార్త భయముతో కూడిన వ్యక్తులతో కూడి ఉంటుంది. వొస్వం యొక్క దూరముగా ఉన్న వాతావరణం, ఇక్కడ వాతావరణం మన భూగోళంలో వాయువులు మరియు ధూళి ద్వారా చీకటి కలుగుతుంది. ప్రపంచ యుద్ధాల్లో రక్తం నదులను చింపివేయబడుతుంటాయి, భూమిని వేరుగా నలిగి పోతుంది భూకంపాలు, వినాశకరమైన పొగవంటి దెబ్బలు పగిలి పోతాయి అనగా క్రీస్తు ఆత్మతో ముదిరింపబడని వారందరినీ శోధించబడుతుంది.

అప్పుడు దేవుని దినము చివరి ఘడియ యందు వచ్చును, అక్కడ క్రీస్తు మేఘముల మీద చీకటిలో మెరిసే ఒక వెలుగువలె కనపడును. అప్పుడు ఈ భూమి ఆయన రాకడను బట్టి భయము కలిగి ఉండును. నరకములో ఉండు సాతాను సమూహము పడిపోవుటకు చివరిగా యుద్ధమునకు సిద్దపడును. నూతన నిబంధన సమాచారమును మరియు దేవుని తీర్పు దినమును మరియు చివరి యుద్ధమును బట్టి జ్ఞానము కలిగి తెలుసుకొనుట మంచిది.

అయినప్పటికీ దేవుని ఆత్మ ఎవరిలో ఉండునో వారు పరలోకమును దాటేదారు, మరియు అతని మహిమశరీరములో దేవుని జీవము కలిగి ఉండెదరు. అతను సమాధానమును పొందు ప్రార్థనను చేయవచ్చు, ఎందుకంటె పరిశుద్ధాత్ముడు ప్రార్థించే ఆత్మ కాబట్టి, కనుక ఎవరైతే యేసు నామమును వారి నాలుకలమీద ఉంచుకుందురో వారు అతని నామమును పిలిచెదరు. అప్పుడు అతను వారి ప్రార్థనలను ఆలకించును. ఎవరైతే పరిశుద్దాత్మ శక్తి చేత ప్రార్థిస్తారో వారి యెడల అతని రక్తము చిలకాయించబడును. క్రీస్తు చివరి తీర్పు దినమందు తన రక్షణను చూపి, దేవుని దహించు ఉగ్రత నుంచి వారిని కాపాడును.

ప్రార్థన: ఈ దోషపు లోకములో నీ పరిశుద్ధాత్మను నీవు ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు. నీ రక్తము చేత పరిశుద్ధ పరచబడిన హృదయములలో అతను ఉండును. నీ నిర్యాజీవమును మాకు నీవు ఇచ్చినందుకు నిన్ను మేము ఆరాధించెదము. మా స్నేహితుల హృదయములను తెరచి వారిలో నీ శక్తిని నింపుము, అప్పుడు వారు నీ స్వరమును విని నీ కార్యములను ఆనందముతో చేయుదురు.

ప్రశ్న:

  1. పేతురు యొక్క మొదటి ప్రసంగము యొక్క ముఖ్య మైన అంశములు ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:44 PM | powered by PmWiki (pmwiki-2.3.3)