Previous Lesson -- Next Lesson
b) యేసును గూర్చిన రకరకాల పుకారులు (యోహాను 7:14-53)
యోహాను 7:45-49
45 ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరి సయ్యులయొద్దకును వచ్చినప్పుడువారుఎందుకు మీ రాయ నను తీసికొని రాలేదని అడుగగా 46 ఆ బంట్రౌతులుఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట లాడలేదనిరి. 47 అందుకు పరిసయ్యులుమీరుకూడ మోస పోతిరా? 48 అధి కారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? 49 అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి.
యేసు క్రీస్తు దేవాలయములో ప్రసంగిస్తున్నప్పుడు అక్కడున్న పరిసయ్యులు వారి సేవకులు యేసును పట్టుకొని వస్తారేమో అని ఎదురుచూచుచుండిరి. యాజకులు కూడా గౌరవంగా అక్కడ పిలువబడలేదు ఎందుకంటె ఆ దినాలలో యాజకులు చాల గౌరవప్రదమైన స్థానములో ఉండెడివారు. అయితే రోమా సామ్రాజ్యము వారు యాజకులను ప్రతి సారి మార్చుచు ఉండిరి. అందుకే రోమా సామ్రాజ్య సమయములో పెద్ద యాజక కుటుంబములు ఉండేవి. వీరు సద్దూకయ్యులు మరియు పరిసయ్యులును గురించిన ఆలోచన లేనివారు.
పరిసయ్యులు ఆ సమయములో సంఘాలలో కూర్చొని ఉండిరి. మరియు గ్రీకు దేశస్తులు ధర్మశాస్త్ర సిద్ధాంతమును వదిలి కేవలము విశ్వాసము మాత్రమే దేవుడి దగ్గరకు చేర్చునని మరియు పనుల ద్వారా ఏదియు కలుగదని యెంచిరి.
పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు యేసు విషయములో అతనిని పట్టుకొనుటలో విఫలము చెందినాము అని కోపము కలిగి ఉండిరి. అక్కడున్న శిష్యులు అడ్డురాలేదు మరియు ప్రజలు కూడా యేసును పట్టుకొను విషయములో అడ్డురాలేదు అయితే అతని మాటలు అందరిని ఆకట్టుకొనెను, కనుకనే యేసును పట్టుకొనుటకు వారు సాహసించకపోయిరి. ఎందుకంటె వారు దేవుని శక్తిని తెలియక పోయిరి.
ఆ సమయములో అక్కడున్న పరిసయ్యులు ఆ దేవాలయములో ఉన్న భటులను బట్టి గట్టిగ కేకలు వేసిరి, " మీరు కూడా ఈ మోసగాడితో చేతులు కలిపారా ? ఎందుకంటె సంఘములో ఉన్న ఏ ఒక్కరు కూడా అతనిని విశ్వసించలేదు. మరియు ఏ గలిలయులు కూడా అతనిని వెంబడించలేదు.”
అక్కడున్న చాలా మంది యేసును ప్రేమించి న వారు, అయితే వారు చాల సామాన్యమైన ప్రజలు మరియు తిరస్కరించబడిన వారు. వారిని యేసు బల్ల మీద కూర్చొని తన సన్నిధి ద్వారా వారిని గౌరవించెను. అయితే భక్తిగల వారుని వారు దూషించిరి. ఇది యేసును విశ్వసించువారికి నిజమైన సందర్భముగా ఉండెను. వారిలో కొందరు బాప్తీస్మమిచ్చు యోహాను దగ్గర తమ పాపములను ఒప్పుకొనిరి; అయితే వారిలో అనేకులు వారి నాయకులను తిరస్కరించి వారి భాషలను తిరస్కరించిరి.
యోహాను 7:50-53
50 అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు. 51 అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును,వాడు చేసినది తెలిసికొనక మునుపును,మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా 52 వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. 53 అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.
అక్కడున్న వారిలో కొందరు సంఘమును బట్టి సమస్యకలిగిఉన్నారు. రాత్రిసమయములో నీకొదేమను రహస్యముగా యేసు దగ్గరకు వచ్చాడు. అప్ప్డుడు క్రీస్తు నూతన జన్మమును గూర్చిన అవసరమును అతనికి తెలిపెను. ఈ మనిషి ఇంకనూ క్రీస్తు స్వాధీనములో ఉంది అతనికి బదులుగా యేసుదగ్గర ఉండెను. అతను ధర్మశాస్త్రమును వాడుకొనుట తిరస్కరించి తీర్పును పట్ల గమనించేవాడుగా ఉండెను.
తీర్పు తీర్చువాడు ఈ మనిషిని బట్టి నవ్వేను. ఎందుకంటె సభలో సహజముగా ఉండినను కూడా ఒక కృత్రిమమైన మోసము చేయుటకు అడుగులు పడుచుండెను. అయితే అక్కడున్న వారు యేసును బట్టి అబద్దపు ప్రవక్త అను చెప్పిరి ఎందుకంటె అతను గాలీలయుడు కనుక ప్రవక్త కాదు అని ఆనిరి . అయితే వాక్యంలో కానీ లేదా ప్రవచనంలో గానీ చివరి దినాలలో మెస్సయ్య వస్తాడని చెప్పలేదు. అయితే పరిసయ్యులు అతనిని అబద్ధికుడని చెప్పిరి, అందుకే వారు నీకొదేమనును వెక్కిరించిరియెందుకంటే అతను క్రీస్తును వెంబడించుటకు ఇష్టపడెను , యేసు నీకొదేమనును ఇంతకూ ముందే మర్చి యున్నాడు కనుక .
ప్రశ్న:
- సామాన్య మనుషులను పరిసయ్యులు మరియు యాజకులు ఎందుకు తృణీకరించి ఉన్నారు?