Previous Lesson -- Next Lesson
c) లాజరును లేపుట (యోహాను 11:34-44)
యోహాను 11:34-35
34 వారుప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. 35 యేసు కన్నీళ్లు విడిచెను.
యేసు మాటచేత సమాధానము చెప్పలేదు. ఎందుకంటె ఏడ్చువారికి చర్చ అనవసరం కాబట్టి. ఇలాంటి సందర్భాలలో క్రయములు ఎంతో అవసరము. అక్కడున్న వారిని భక్తి లోనికి నడిపించుమని చెప్పెను. వారు , " వచ్చి చూడుము ". ఈ మాటలచేతనే యేసు తన ప్రారంభపు సువార్త దినాలలో తన శిష్యులకు నేర్పించింది. వారిని జీవితమును చూడమని పిలిచెను ; అయితే ఈ ప్రజలు మరణమును చూడమని అతడిని పిలుస్తున్నారు . కనుక వారు అర్థము చేసుకొనుటలో మరియు నమ్ముటలో వారి విశ్వాసములో విఫలమైనారని అతను యేడ్చెను. మరియు అతని నమ్మకమైన శిష్యులు కూడా అతని నిజమైన విశ్వాసమును కలిగి ఉండలేదు. ఎందుకంటె శరీరమునకు తెలియదు మరియు ప్రాణమునకు విశ్వాసము కొరతగా ఉన్నది. అప్పటికి పరిశుద్దాత్మ వారిమీదకు ఇంకా రాలేదు. కనుక దేవుని కుమారుడు వారి అంగలార్పును బట్టి ఆ సమయములో ఏడ్చువాడిగా ఉండెను .
యేసు నిజమైన మనిషి అయి ఉన్నాడు, ఎందుకంటె ఏడ్చువారితో ఏడ్చి మరియు ఆనందము కలిగి ఉన్నవారితో ఆనందము కలిగి ఉన్నాడు కనుక. అయితే అతని ఆత్మా ఇబ్బంది పడెను. అతని ప్రాణము జీవము కలిగిన దేవునిదై ఉన్నది. కనుక యేసు ఈ దినాలలో సంఘములో ఉన్న వారిని బట్టి ఏడుస్తున్నాడు మరియు నశించిపోతున్నవారిని బట్టి కూడా ఎంతో అంగలారుస్తున్నాడు.
యోహాను 11:36-38
36 కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. 37 వారిలో కొందరుఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి. 38 యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.
యేసు యేడ్చుట మరియు లాజరును బట్టి వారికి వివరించుట చూసిరి. ప్రేమ అనునది ఏ ఒక్కరి భావనను చూపదు అయితే అందరి మనోభావాలను కూడా అది మార్చుతుంది. క్రీస్తు ప్రేమ మనందరి అర్థము చేసుకొనే భావన కంటే ఎంతో గొప్పది మరియు ఇది మరణమునకు ఎంతో దూరముగా ఉన్నది. అతను ముద్ర వేయబడినట్టి లాజరు సమాధిని చూసి అతని మరణమును బట్టి యేడ్చెను . అయితే అతని ఆత్మ యందు అతడు పిలువబడ్డాడని అందుకు సిద్ధమయ్యాడని అనుకొనెను .
అక్కడున్న వారు క్రీస్తు అధికారమును బట్టి మరియు అతని చర్చలను బట్టి వెక్కిరించిరి .అందుకు యేసు కోపపడెను. ఎందుకంటె అవిశ్వాసము నిరీక్షణ లేని మనసు దేవుని ఉగ్రతకు కారణమగును. యేసు మనము విడిపింపబడి ఆయన మీద విశ్వాసము కలిగి మరియు అతని ప్రేమలో ఉండునట్లు మరియు అతను ఇచ్చు జీవమును పండుకొని ఉండునట్లు ఉద్దేశించెను. ఎందుకంటె ఏ మనిషి కూడా అతని సామర్థ్యమును బట్టి ఉండక కేవలము క్రీస్తు మీద భారముగా కలిగి ఉండమని చెప్పెను కనుక. పాపములో చచ్చిన వారిని తిరిగి లేపవలెనని అతడు ఉద్దేశించెను. దేవుడు నీ అవిశ్వాసమును బట్టి ఇబ్బంది పడ్డాడా లేక నీవు అతని ప్రేమను బట్టి ఆనందముగా ఉన్నవని ఆనందించవా ?
ప్రార్థన: ప్రభువా నాకు కలిగిన సమయములను నేను సద్వినియోగము చేసుకొనలేదు కనుక నన్ను క్షమించుము. నా అవిశ్వాసమును బట్టి క్షమించు . నీ యందు నిరీక్షణ కలిగి ఉండునట్లు మరియు ఎల్లప్పుడూ నీతో ఉండునట్లు నన్ను నడిపించుము .
ప్రశ్న:
- యేసు ఎందుకు ఇబ్బంది పడి ఎందుకు యేడ్చెను ?