Previous Lesson -- Next Lesson
4. చరిత్ర యొక్క ఎదుగుదలను పరిశుద్దాత్మ బయలుపరచుట (యోహాను 16:4-15)
యోహాను 16:12-13
12 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు. 13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభ
క్రీస్తుకు సమస్తము తెలుసు కనుక తన ప్రియమైన వారికి పరలోక ప్రతి రహస్యములను మరియు భవిష్యత్తును వారికి తెలియపరచును, అయితే ప్రాణము మరియు మనసు ఈ సత్యములను తెలుసుకొనవు. కనుక మనము క్రీస్తు పరలోకమందు దేవుని కుడి పార్శ్యమున కూర్చుండుట మనకు తెలియదు , అదేసమయములో అతను మన హృదయములలో ఉండెను. అయితే సహజముగా దేవుడు ముగ్గురు గా ఉన్నాడని మనము కనుగొనలేము. కనుక మనిషి మనసు దీనిని గ్రహించలేదు, అయితే ఆత్మ మన తరంగములకు వీటిని తెలియపరచును. అతను తన రహస్యములను మరియు భవిష్యత్తును గూర్చిన దాచబడిన వాటిని మన హృదయములను బయలు పరచును, కనుక అతనికి మాత్రమే త్రిత్వమును గూర్చిని రహస్యము తెలిసెను.
సత్యమైన ఆత్మ వచ్చి సత్యములోనికి నడిపించునని క్రీస్తు ముందుగానే చెప్పియున్నాడు. సత్యము అనగా ఏమి ? అయితే క్రీస్తు " నేనే సత్యము " అని సెలవిచ్చి యున్నాడు. ఆత్మ వచ్చు ప్రకటన అనునది క్రీస్తు సంపూర్ణతను బయలుపరచుట అని అర్థము. క్రీస్తు ఒక సామాన్యమైన మనిషి కాదు అయితే తండ్రి అయినా దేవుడు అతనిలో ఉన్నాడు, అదేవిధముగా అతను తండ్రితో ఉన్నాడు. కనుక నడిపించుట అనునది మనము తండ్రితో ఉండి అతని ప్రేమలో నిలిచి ఉండి నిత్యములోనికి వెళ్ళుట. " సత్యము " అను మాట అనునది కేవలము సత్యముగా లేకుండా అయితే సత్యమైన మార్గములో నడిపించుటని అర్థము. కనుక మనము ఎప్పుడైతే సత్యములోనికి నడిపించబడతామో అప్పుడు దేవునిని మరియు త్రిత్వమును తెలుసుకొని అతని అద్బుతములలో అనుభవము కలిగి ఉంటాము.
ఇవన్నిటిని బట్టి పరిశుద్దాత్మ ఒంటరిగా ఉండెను, మాట్లాడుట, వినుట మరియు అదేసమయములో తండ్రి చిత్తమును తెలుసుకొనుట. అతను ఒక ప్రత్యేకమైన ఆలోచనలచేత రాలేదు అయితే తండ్రి ఏమి చెప్పాడో దానినే చెప్పెను. త్రిత్వములో ఒకరికి ఒకరు అర్థము చేసుకొనుటయే తెలుసు. అతను మాత్రమే నమ్మకమైన వాడు కనుక దేవుని కుమారుని నుంచి మార్చబడినాడు. కనుకనే అతను సంఘమునంతటిని క్రీస్తు శరీరములో కట్టబడునట్లు మరియు సంఘము పెళ్లికుమారుని కొరకు ఎదురు చూచునట్లు నేర్పించెను.
యోహాను 16:14-15
14 ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును. 15 తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.
పరిశుద్దాత్ముని కార్యము యేదనగా క్రీస్తును మహిమపరచడమే. యేసు తనను తాను ఏవిధముగా అయితే తృణీకరించుకొని తన తండ్రి అయినా దేవుడిని ఎలా ఘనపరచాడో అదేవిధముగా పరిశుద్ధాత్ముడు కూడా తేనెను తాను తృణీకరించుకొని యేసును మహిమపరచాడు. ఇది మనకు యేమని నేర్పిస్తుంది అంటే మన అనుభవము కొరకు మాట్లాడక కార్యముల కొరకు చెప్పక కేవలము క్రీస్తును మాత్రమే మహిమపరచవలెను. మన మార్పు ప్రాముఖ్యమైనది కాదు అయితే మన పాపముల కొరకు తన రక్తమును కార్చిన యేసే మనకు ప్రాముఖ్యమైన వాడు. ఆత్మకు శక్తికి ఉద్దశమునకు ఒకే ఒక గమ్యము ఉన్నది, మరియు తనకొరకు మనలను తన రక్తము చేత కొన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరైతే క్రీస్తు సిలువ మరణమును మరియు అతని పునరుత్థానమును విశ్వసించాడో వారి జీవితములో ఇది పనిచేస్తుంది.
పరిశుద్ధాత్ముడు తనకు సొంతముగా ఏ పని కూడా చేయడు, అయితే యేసు ఏది చెప్పాడో ఏది మాట్లాడాడో దానినే చేస్తాడు. అతను క్రీస్తు శిష్యులతో ఉంది వారిలో నిత్యజీవమును ఇచ్చును. అది వారిని క్రీస్తు ఆజ్ఞలలో ఉండునట్లు మరియు రక్షకుని చేరునట్లు నడిపించును. కనుక మనము త్రిత్వములో వ్యత్యాస కార్యములను చూడవచ్చు. కనుక ఒక మనిషి తన జీవితములో తనకు తాను మహిమ తెచ్చుకొన్నాడు అయితే ఇతరుల మహిమ కొరకు జీవించును.
యేసు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు, " తండ్రి నా కంటే గొప్పవాడు", అని మరియు అతని చివరి ఘడియలలో, " పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇవ్వబడినది", అని చెప్పెను, ఎందుకంటె అందరు తండ్రితో సహవాసము కలిగి ఉండుటకు చేయబడ్డారు. ప్రతి బిడ్డకు తన తండ్రి ఏవిధముగా సొంతమో అదేవిధముగా క్రీస్తుకు కూడా తండ్రి అతని సొంతమై ఉన్నాడు.
ప్రార్థన: ప్రభువైన యేసు మా పాపములకొరకు ఆ కలువారి సిలువలో నీ రక్తమును కార్చినందుకు నీకు కృతజ్ఞతలు. నీ ప్రేమను బట్టి వందనాలు , నీ ఆత్మచేత మమ్ములను నింపుము, అప్పుడు మా జీవితమంతా నిన్ను మహిమపరచి నీ త్యాగమును బట్టి నీ పునరుత్థానమును బట్టి నేనూ ఘనపరచెదము. మా గర్వము నుండి మా ఈర్ష్య నుండి మమ్ములను కాపాడు, అప్పుడు మేము నీ సత్యములో ఉండునట్లు చేయుము.
ప్రశ్న:
- ఈ లోక ఎదుగుదలలో పరిశుద్దాత్మ ఏవిధముగా పనిచేస్తుంది ?