Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba
Previous Lesson -- Next Lesson యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 – 21:25)
5. చెరువు దగ్గర యేసు ప్రత్యక్షమగుట (యోహాను21:1-25)
b) పేతురు తన పరిచర్యను ఖచిత్తము చేయుట (యోహాను 21:15-19)యోహాను 21:18-19 యేసు పేతురు మరియు అతని శిష్యుల హృదయములను వారి ఆవేశములను అర్థము చేసుకొనెను. ఈ విధమైన అనుభవమును మనము యెవ్వనస్తులలో అప్పుడప్పుడు క్రీస్తు పైన వారికి ఉన్న విశ్వాసముతో చూసెదము. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇతరులను రక్షించుటకు పరిగెత్తుకుని వెళ్తారు. అయితే ఎక్కువసార్లు వారు మనుషులను మెప్పించుటకు చేస్తారు కానీ యేసు నడిపింపుతో చేయరు, ఎందుకంటె అది నిజమైనది మరియు శక్తి కలిగినది కనుక. అయితే పేతురు తన పరిచర్యను పరిశుద్ధాత్మచేత నింపబడి తనకు తాను క్రీస్తుకు సంపూర్ణముగా సమర్పించుకొని ప్రేమచేత మరియు క్రీసు చిత్తప్రకారముగా ప్రకటిస్తాడని ముందే యేసు ప్రవచించెను. పేతురు అన్యులదగ్గరకు వెళ్ళాక యెరూషలేములోనే ఉండెను. అక్కడ అతను ఎన్నోసార్లు బంధించబడి కొట్టబడెను; అయితే ప్రభువు దూత అతనిని విడిపిస్తూ వచ్చెను. పేతురు పరిశుద్ధాత్మచేత శతాధిపతి అయినా కొర్నెలి ఇంటికి నడిపించబడెను ఎందుకంటె అతను ఇంతకు ముందు అపవిత్రుడుగా ఉండెను. తరువాత సువార్త కార్యముచేత అతను ఈ లోకమంతట క్రీస్తు కొరకు సంచారము చేసెను. అతను హేరోదు బంధికానం నుంచి విడిపించబడినతరువాత పౌలు బంధించబడినప్పు నూతన సంఘములను దర్శిస్తూ ఉండెను. అప్పుడు ప్రధాన అపొస్తలులు తండ్రి వాక్యములను ఆ క్రైస్తవులకు వివరిస్టు ఉండిరి. అయితే రోమా ఆచారప్రకారముగా అతను నీరో సమయములో హింసించబడి చెనిపోయెనని వ్రాయబడెను. మరియు వారు అతనిని కాళ్ళు పైకి తల క్రిందకు వ్రేలాడదీసి సిలువ వేయమని చెప్పిరి. అందుకే యేసు పేతురును గురించి , అతను తన మరణము చేత దేవుని ఘనపరచును అని చెప్పెను. పేతురు ముందు కూడా తన జీవితమును క్రీస్తు కొరకు త్యాగము చేస్తానని చెప్పెను. అందుకు యేసు, " నీవు నన్ను ఇప్పుడు వెంబడించవు, అయితే నీవు చివరి ఘడియలలో ఉన్నావు" ( యోహాను 13 :36 ) . యేసు తన శిష్యులతో తన సొంత శక్తిచేత ఉంది తన తండ్రిని మరియు పరిశుద్దాత్ముడ్ని మహిమపరచి ఉండెను. కనుక మహిమపరచు దేవునికి మనము సంపూర్ణ విలువ ఇవ్వాలి ఎందుకంటె అతను మనకొరకు ఆ సిలువలో తనకు తాను బలిగా అర్పించుకొన్నాడు కనుక. కనుక పేతురు దేవుడిని తన సొంత కార్యములచేత ఘనపరచలేదు కనుకనే అతను క్రీస్తును మూఢ మారులు తిరస్కరించి తరువాత తన మరణముచేత యేసును ఘనపరచెను. అప్పుడు యేసు పేతురును ఒక ఆజ్ఞ ఇచ్చెను, " నన్ను వెంబడించు!" . ఎప్పుడైతే మనము అతడిని చివరివరకు వెంబడిస్తామో అప్పుడు మనము అతని ప్రేమ కలిగిన ఫలములను పండుకొని తన తండ్రి నామమును మహిమపరచెదము. ప్రార్థన: ప్రభువా పేతురు నిన్ను మూడు సార్లు తిరస్కరించినను అతడిని విడువక నీ మహిమకొరకు అతనిని పిలిచి త్రిత్వమును బట్టి జీవమును బట్టి మరియు మరణమును బట్టి ఘనత కలుగునట్లు చేసినందుకు నీకు కృతజ్ఞతలు. కనుక మా జీవితములను కూడా నీ చెంతకు తీసుకొని నీ సన్నిధిలో నీ చిత్తానుసారముగా నీ నడిపింపులో ఉంచుకొని నీకు మహిమ కారముగా మా జీవితములు ఉండులాగున నీ చెంతకు మమ్ములను స్వీకరించుము. ప్రశ్న:
|