Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba
Previous Lesson -- Next Lesson యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
3. యేసు మంచి కాపరి (యోహాను 10:1-39)
d) తండ్రి మరియు కుమారునితో మనకున్న ఐక్యత (యోహాను 10:22-30)యోహాను 10:22-26 515 బి సి ముందు బబులోనులో దేవాలయపు ప్రారంభములో అక్కడున్న వారు ఎంతగానో ఆనందించిరి. అయితే మెక్కబీస్ అను వారు 165 బి సి లో వ్యతిరేకించారు. ఇది డిసెంబర్లో అనగా చలికి మరియు వర్షాకాలానికి ముంచు యెరూషలేములో 750 లో జరిగినది . ఈ కార్యములో, యేసును హింసించి దేవాలయమును వ్యతిరేకించారు, సోలమన్ మాటలను ఆ దేవాలయములో చెప్పబడి అక్కడున్న వారు విను ఉన్నారు. ఆపోస్టుల 3:11; 5:12 లో మనము చూడవచ్చు. ఈ విషయములో యూదులు క్రీస్తును పట్టుకోవాలని చూసారు. ఎందుకంటె అతను బహిరంగముగానే ఎదురుచూస్తున్న మెస్సయ్య లేదా అని వారు అడుగుతున్నారు. అయితే అతను వారికి మిస్సయ్యాను బట్టి వారు ఏవిధముగా అయితే అనుకున్నారో దాని కంటే ఎక్కువగా ఇంకా ఎక్కువైనా కార్యాలు చేసియున్నాడు. ఎందుకంటె యేసు వారు ఊహలకంటే ఎక్కువగా చేసియున్నాడు కనుక. అయితే అందులోని కొందరు యేసును మెస్సయ్య కంటే ఇంకా గొప్పవాడని నమ్మిరి, ఎందుకంటె అతని కార్యములు మరియు అతని అధికారము ఆవిధముగా కనబడినది కనుక. అయితే వారు జాతీయ క్రైస్తవ పిలుపును బట్టి ఆలోచనకలిగినవారుగా ఉండిరి. ఇదంతా జరిగిన తరువాత పండుగ ఒక జ్ఞాపకార్థముగా ఉండెను. వారు అతనిని గూర్చి వారి ప్రదేశమునకు ఒక రాజుగా భావించిరి. వారు అతనిని వెంబడించి యుద్ధమును పారద్రోలుటకు సిద్దపడిరి. యేసుకు వేరే ప్రణాళికలు కూడా కలవు; తగ్గింపు, ప్రేమ మరియు మనసును మార్చుట. అతను యూదులకు మెస్సయా అని చెప్పలేదు, అయితే సమరయ స్త్రీకి కార్యము చేసియున్నాడు. మరియు అతని సామర్థ్యమును గ్రుడ్డివాని విషయములో కూడా చేసియున్నాడు. యూదులు తమ మిస్సయ్యాను ఒక రాజకీయ నాయకుడిగా మరియు అన్ని కలిగిన ఘనమైనవానిగా యెంచిరి; అయితే యేసు ఆత్మీయ విమోచకుడై, అందరి యెడల దాయకలిగిన వాడుగా ఉండెను. ప్రజలు అధికారమును బట్టి , స్వతంత్రయమును బట్టి మరియు ఘనతను బట్టి ఆశకలిగి ఉండిరి. అయితే యేసు వచ్చినది తగ్గిపు కలిగి ఉండుటకు. అతను అతని గొప్పతనమును తెలియపరచుటకు వచ్చెను అయితే వారు దానిని కనుగొనలేకపోయిరి. వారు క్రీస్తు కొరకు వారి హృదయములను తెరువకపోరి, అయితెహ్ అతను తండ్రి నామములో కార్యములను చేసెను. యూదులు తండ్రిని బట్టి కుమారుని బట్టి అసహ్యపడిరి. వారు గొడవలచేత వచ్చు ధనమును ఈ దినము వరకు ఆశిస్తున్నారు. యోహాను 10:27-28 యేసు సత్వేఏకమైన దేవుని గొర్రెపిల్ల ; అతను తనను వెంబడించువారిని గొర్రెలుగా పిలుచుచున్నాడు. వారి మొదటి గుణము ఏమిటంటే, వినుట. ఎందుకంటె పరిశుద్దాత్మ దేవుడు వారి మనసులను మరియు హృదయములను తెరచియున్నాడు కనుక, యేసు స్వరాలు వారి హృదయ లోతులను తెరుచును, వారిని క్రొత్త వారీగా మార్చుతున్నది. శిష్యరికం చేయుటకు వినుట మొదటి పని. క్రీస్తుకు ఎవరు అతను వాక్యమును వ్యక్తిగతముగా వింటారో తెలుసు; అతను వారిని ప్రేమించి, వారి రహస్యములను చూచును. మరియు వారిని ఏ రూపములోనికి మార్చాలో చూచును. కనుక నిజమైన క్రైస్తవులు గురికాలిగి ఉన్నవారుగా ఉండెదరు. వారు అందరికి తెలియబడినవారుగా ఉంది వారి పేర్లు పరలోకములో వ్రాయబడినట్లుగా ఉందును. ప్రతి ఒక్కరు దేవుని అద్భుతముగా ఉంది నూతన సృష్టిగా పిలువబడుదురు. యేసు ఒక మంచి కాపరి; అతని గొర్రెలు అతని స్వరమును విని యేసుకు సంపూర్ణముగా సమర్పించుకొని వెంబడించును. వారికి దేనిని బట్టి ఆశకలిగి ఉండరు అయితే వాటి కాపరిని వెంబడిస్తారు. వారి ఆలోచనలన్నీ వారి హృదయములో స్థానము లేదు; ఎందుకంటె వారు సత్వేఏకమైన గొర్రెలు. క్రీస్తు కార్యము వారిలో కలిగినది కనుక ఈ మార్పు వారిలో కలిగినది. వారికి దేవుని ప్రేమను మరియు శక్తిని ఇచ్చి మరణమును మరియు పాపమును జయించుమని చెప్పెను. వారు మరణించారు అయితే నిత్యమూ జీవముకలిగి ఉంటారు, ఎందుకంటె వారికి అతని జీవము ఉంటుంది కనుక, అదే నిత్యజీవమిచ్చు బహుమానము. వారు తీర్పు నుంచి మరియు నిత్యా మరణము నుంచి స్వాతంత్రము కలిగిన వారుగా ఉన్నారు. మరియు క్రీస్తు రక్తములో విముక్తి కలిగిన వారుగా ఉన్నారు. క్రీస్తు రక్తము చేత కొనబడిన ఏ గొర్రెపిల్ల కూడా నశించిపోదు. ఎందుకంటె అతను మనుషులను కాపాడుటకు పరలోకమునే వదిలి వచ్చెను, మరియు వారికి జీవమును ఇచ్చుటకు శ్రమ పొందెను. అతను వారిని అన్ని విధాలుగా సంరక్షించువాడుగా ఉన్నాడు. నీవు నీ ప్రభువైన క్రీస్తు హస్తములో నమ్మకము కలిగి ఉన్నావా ? నీవు క్రీస్తు శక్తిని మరియు అతని సమర్థతను ఎన్నుకొన్నావా ? నీవు ఈ లోకములో పాపముచేత ఉన్నావా లేక దేవుని బిడ్డగా అతని ద్వారా నీవు పరిశుద్ధాత్మలో దత్తత తీసుకొన్నావు. మన దేవుని పోషణ మన పని కంటే గొప్పది, ఇది మన జ్ఞానముకంటె ఇది ఎంతో గొప్పది మరియు మనము జయము వైపు ఉన్నాము. యోహాను 10:29-30 అక్కడున్న కొంతమంది విశ్వాసులకు ఈ యవ్వనస్తుడైన క్రీస్తు వారిని సాతాను నుంచి మరియు మరణము నుంచి కాపాడుతాడని చెప్పిన ఆలోచనలను వారు నమ్ముటకు అనుమానిస్తున్నారు. కనుకనే యేసు తన శిష్యులను తన తండ్రికి చూపియున్నాడు. ప్రతి ఒక్కరు తనని వెంబడించుమని అతనే వారిని ఎన్నుకొనియున్నాడు. కనుక క్రీస్తును వెంబడించు వారు వారికి వారు ఎన్నుకొని వెంబడించింది కాదు అయితే దేవుడే వారిని ఎన్నుకొని యున్నాడు. తండ్రి అయినా దేవుడే తన కుమారుడిని వెంబడించువారికి అన్ని విధములైన బాధ్యతకలిగిన వాడుగా ఉంటాడు. తండ్రి గొప్పవాడు మరియు శక్తి కలిగిన వాడు. క్రీస్తు తనను తాను ఘనపరచుకొనలేదు అయితే తన తండ్రికి పూర్తిగా సమర్పించుకున్నాడు. కనుక ఈ విధమైన స్వభావము క్రీస్తు కలిగి ఉండగా అతని నామమునకు సంపూర్ణ మహిమ కలిగినది. వారిలో కొంత మంది క్రీస్తు తన తండ్రికి అనుకూలముగా ఉన్నాడని అణుకోరిని. అయితే పరిశుద్ధాత్ముడు చెప్పినట్టు ఎవరైతే తనను తాను తగ్గించుకొంటే హెచ్చించబడతాడని, మరియు తనను తాను హెచ్చించబడితే తగ్గించబడతాడని చెప్పెను. ఎందుకంటె క్రీసు తన ప్రతి ఘనత తన తండ్రికే ఇచ్చెను. అందుకే , " నేను నా తండ్రి ఒకటై ఉన్నాము " అని చెప్పెను. ఇది ఎవరైతే మేము వేరే దేవునికి సంబంధించిన వారము అని చెప్పువారికి ఒక చెంప పెట్టు లాంటిది గా ఉన్నది. మనము ముగ్గురు దేవుళ్లను కొలచడము లేదు అయితే ఒకే దేవుడిని ఆరాధిస్తున్నాము. ప్రార్థన: ప్రభువైన యేసు నీవు మంచి కాపరివి. నీవు నీ జీవితమును నీ గొఱ్ఱెలకొరకు త్యాగము చేసియున్నావు. నీవు జీవితమును ఇచ్చావు కనుక మేము ఇక మృతిచెందము. నీవు మమ్ములను మరణము నుంచి తప్పించినందుకు కృతజ్ఞతలు. మమ్ములను ఎవ్వరు కూడా నీ చేతులలో నుంచి తీసుకొనరు. మాకు సాత్వికము నేర్పించుము అప్పుడు మేము నీలో తండ్రిని చూసెదము. మరియు నీ శక్తి తో మమ్ములను నింపుము అప్పుడు మేము బలహీనతతో బలము కలిగినవారముగా ఉండెదము. ప్రశ్న:
|