Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- John - 045 (Jesus offers people the choice)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
B - యేసు జీవాహారము (యోహాను 6:1-71)

4. అంగీకరించు లేదా తిరస్కరించు " అనే అవకాశమును యేసు వారికి కల్పించెను !" (యోహాను 6:22-59)


యోహాను 6:51
51 పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును;మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను.

నీవు రొట్టె ముక్క మాట్లాడతాము లేదా కదలటం చూసావా? ఎందుకంటె క్రీస్తు తనను తాను జీవాహారము అని పిలవబడ్డాడు కాబట్టి-అతను ఈ లోక ఆహారమును బట్టి మాట్లాడతాము లేదు అయితే ఆత్మీయ ఆహారమును బట్టి మాట్లాడి ఉన్నాడు.అతని అర్థము మనము అతని శరీరమును తినుమని కాదు మరియు మనము మనిషి మాంసము తినేవారు కూడా కాదు.

యేసు తన మృతిని గూర్చి కూడా మాట్లాడాడు. మనిషిని విడిపించినది ఆత్మీయముగా కాదు అయితే అతని అవతారము ద్వారా మనిషిని విడిపించాడు. అతను మన పాపములకొరకు తనను తానూ ఇచ్చుకున్నాడు. అయితే అక్కడున్నవారికి అతను ఒక సామాన్యమైన మనిషిగానే కనపడినాడు. ఒకవేళ దేవదూతలు పరలోకమునుంచి వచ్చునట్లు యేసు కూడా వచ్చినట్లైతే అప్పుడు వారు అతనిని విశ్వసించియుండిరి. అదేవిధముగా యేసు తన మహిమ ద్వారా మనుషులను విమోచించలేదు అయితే తన శరీరము ఏదైతే మనుషులకొరకు నాలుగగొట్ట బడినదో అదే వారిని విమోచించినది.

యోహాను 6:52-56
52 యూదులు- ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. 53 "కావున యేసు ఇట్లనెను -''మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని,మీలో మీరు జీవము గలవారు కారు." 54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు;అంత్యదినమున నేను వానిని లేపుదును. 55 నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. 56 "నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును,నేను వానియందును నిలిచియుందుము."

యూదులలో క్రీస్తును అంగీకరించువారు ఉన్నారు మరియు ఆయనను తిరస్కరించువారు కూడా ఉన్నారు. ఆ రెండు గుంపులు వాదించుకొనిరి. అక్కడ ఉన్న వారు క్రీస్తు శరీరమును మరియు అతని రక్తమును తిని త్రాగుటలో అర్థము చేసికొనక ఉండిరి. అతను మొదటి గుంపు యొక్క ప్రేమను విశదపరచి దానిని అందరికి చూపించెను. అందుకే, " మీరు నిజముగా నా శరీరమును, మరియు నా రక్తమును తిని త్రాగితేనే కానీ మీకు నిత్యా జీవము రాదు. నీవు నా లో నిలిచిఉంది పక్షంలో నీవు నీ పాపములో ఎప్పటికీ మరణించినవాడిగానే ఉందువు" ఈ మాటలు వారి చెవులలో గట్టిగా వినపడెను. యేసు వారి దగ్గరకు వచ్చినట్లు, " నన్ను చంపి తినండి, నేనే ఒక అద్భుతము. నా శరీరము ఒక రొట్టెగా మీ కొరకు చేయబడినది," అప్పుడు వారి రక్తము మరిగించబడినది. అయితే వారిలో ఎవరైతే ఈ మాటలను విశ్వసించి ఉన్నారో వారు రక్షింపబడి మంచి మనసులు కలిగిన వారుగా మార్చబడిఉన్నారు. ఒక వేళా వారు పస్కా పండుగ సమయములోనే దీనిని గమనించినట్లయితే అప్పుడే క్రీస్తును వారు తెలుసుకొనినవారుగా ఉండెదరు. అయితే ఆ సమయములో అక్కడున్న ప్రతి యూదుడు కూడా పస్కా పండుగలో పాలుపంచుకొని బాలి ఇయ్యబడిన జంతు మాంసములను తిని వాటి రక్తమును త్రాగిరి. ఇది దేవుని ఉగ్రతను వారు కోరి తెచ్చుకొన్నట్లుగా ఉండెను. అందుకే యేసు తాను నిజమైన దేవుని గొర్రెపిల్ల , ఈ లోక పాపములు మోసుకొనిపోవుచున్నవాడు అని క్లుప్తముగా చెప్పెను.

ఈ దినాలలో క్రీస్తు శరీరమును మనము రొట్టె ద్వారా సాదృశ్యముగా చేసుకొని సేవించుచున్నాము, మరియు అతని రక్తమునకు సాదృశ్యముగా ఉన్న పానీయమును మనము జీవిస్తున్నాము ఇది మనలను కడుగుతున్నాడు. కనుక మనము అతని కృపను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ సమయములో అక్కడున్న గలీలాయులకు ఈ మాటలకు అర్థము తెలియదు. యేసు ఆ సమయములో వారి విశ్వాసములను పరీక్షించుచున్నాడు.

మనకు ప్రభురాత్రి భోజనమునకు సంబంధించిన విధానమును వివరించిన యేసుకు మనము కృతజ్ఞతకలిగి ఉండాలి, మరియు అతను మనలోకి ఆత్మ ద్వారా విశ్వాసమును ఇచ్చిన దానిని బట్టి కూడా అతనికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మన పాపములను మనము ఖచ్చితముగా ఒప్పుకొన్నవారమని అనుటకు అతని ద్వారా మనకు సంపూర్ణ క్షమాపణ దొరుకుననియే. అతని యందు విశ్వాసము మనకు అతని మహిమ కలిగిన పునరుత్థానమును ఇచ్చును. దేవుని గొర్రెపిల్ల మనలను విడిపించినందుకు మనము అతనికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము కూడా యేసు మాదిరి సిలువ వేయబడుట అతని ఉద్దేశము కాదు అయితే అతనిని మనము సంపూర్ణముగా మన జీవితాలలోని ఆహ్వానించాలని అతని ఉద్దేశముగా ఉన్నది.

యోహాను 6:57-59
57 జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. 58 ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము;పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు;ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను''అనెను 59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను.

క్రీస్తు మనకు మహిమ కలిగిన తండ్రి అయినా దేవుడిని తెలియపరచుచున్నాడు. అతను నిత్యమూ లోనుంచి నిత్యములోనికి ఉన్నటువంటి అందరి తండ్రి అయి ఉన్నాడు. క్రీస్తు అతని తండ్రితో ఉన్నాడు కనుక తన కొరకు జీవించక కేవలము తన తండ్రి కొరకు జీవించు వాడుగా ఉన్నాడు. అతని జీవితము దేవునికి త్యాగము ద్వారా ఘనపరచలేదు కానీ లోబడి స్వభావము ద్వారా తన తండ్రికి అతను ఘనత కలిగించాడు. కుమారుడు తన తండ్రి కొరకు సేవ చేస్తున్నప్పుడు , తండ్రి కూడా కుమారుని ద్వారా తన ప్రతి చిత్తమును నెరవేరుస్తున్నారు.

యేసు తన తండ్రి దగ్గర తనకు కలిగిన ఐక్యతను గూర్చి అక్కడున్న వ్యతిరేకుల ముందు బయలుపరచి ఉన్నాడు. వారికి అతను ప్రకటనను ఇచ్చాడు, " నేను నాతండ్రి కొరకు జీవించి అతనిలో ఎలాగ ఉన్నానో , అదేవిధముగా నేను కూడా మీలో ఉంది మీ ఇష్టములను కూడా నెరవేర్చుటకు ఇష్టపడుతున్నాను. అప్పుడు మీరు కూడా నా కొరకు జీవిచు వారుగా ఉంటారు,". ప్రియా సహోదరుడా ఈ విధమైన క్రీస్తు బంధాన్ని కలిగి ఉండగలవు ? నీవు నీ ప్రతి విషయములో కూడా అతని యందు లోబడి అతనికే సమస్తమును సమర్పించుకొని ఉండెదవా లేకే నీ ఇష్టప్రకారముగా ఉండెదవా ? నీ కొరకు చనిపోవుటకు సిద్ధపడెదవా లేక నీలో క్రీస్తు జీవించులాగున క్రీస్తు కొరకు జీవించెదవా ?

క్రీస్తు ఈ లోకమునకు ఏదో ఊరికినే రాలేదు, మరియు మనకు ఆర్థిక స్తోమతలను ఇచ్చుటకు రాలేదు . మరియు గ్రామములను బట్టి ప్రణాళికలతో రాలేదు. అయితే అతను మనుషుల హృదయములను మరిచి వారు దైవీకము కలిగిన వారై క్రీస్తుతో కలిసి జీవించులాగున వచ్చియున్నాడు. అతని మహిమ ద్వారా విశ్వాసులకు అతను గొప్ప బహుమానములను దయచేసి ఉన్నాడు. అందుకే అతను మనిషిగా కనబడుచున్న యేసును అందరి కొరకు జీవించుటకు , త్యాగము చేయుటకు మరియు వారిని ప్రేమించుటకు దేవుడు యేసును ఈ లోకమునకు పంపియున్నాడు.

"తండ్రి", "జీవము" మరియు "పునరుత్థానము" అనే పదములు 6 వ అధ్యాయములో మనము ఎన్నోసార్లు వ్రాయబడుట చూడవచ్చు. అప్పుడు నీవు యోహాను సువార్తను అర్థము చేసుకొనెదవు.క్రీస్తులో ఉన్న విశ్వాసి దేవుని ఆత్మలో ఉంది పునరుత్థానమునకు నడుచువాడుగా ఉండును.

ప్రార్థన: యేసు మా జీవిహములోనికి వచ్చి తండ్రి యొక్క ఆనందమును మరియు సంతోషమును దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు . మా పాపములను క్షమించుము అప్పుడు మేము నిన్ను హృదయపూర్వకముగా ఘనపరచి నీ కొరకు జీవించువారినిగా చేయుము.

ప్రశ్న:

  1. యేసు తన శరీరమును మరియు తన రక్తమును తిని త్రాగమని ఎందుకు వింటున్నవారికి చెప్పెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:51 AM | powered by PmWiki (pmwiki-2.3.3)