Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- John - 044 (Jesus offers people the choice)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
B - యేసు జీవాహారము (యోహాను 6:1-71)

4. అంగీకరించు లేదా తిరస్కరించు " అనే అవకాశమును యేసు వారికి కల్పించెను !" (యోహాను 6:22-59)


యోహాను 6:41-42
41 కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగు కొనుచు - 42 ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదుము గదా?-నేను పరలోకము నుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.

యోహాను గాలీలయాలోని యూదులను వీరు గుంపులో ఉన్నవారు కాకున్నప్పటికీ పిలిచారు, అయితే వారు క్రీస్తును వ్యతిరేకించారు కాబట్టి యూదులకంటే వారు గొప్పవారు కాదు మరియు వారు దక్షిణమున నివాసమున్నవారు కారు.

అయితే అక్కడున్న అనేకులు ఇంకా వేరే కారణాలను కూడా తెలియపరిచారు, ఎందుకంటె వారు ఇంకనూ ధర్మశాస్త్ర ప్రకారంగానే అర్థము చేసుకొనుచున్నారు కనుక. అయితే వారు యేసును మాత్రమూ ప్రేమించారు ఎందుకంటె అతని తండ్రి వారి గుంపులోనుంచి జన్మించినవాడు కాబట్టి. మరియు అతని తల్లియైన మరియా కూడా వారు గుంపులోనుంచే వచ్చినది కాబట్టి. అందుకే ఎవన్నిటిని బట్టి ఆ గాలీలల యేసును పరలోకమునుండి వచ్చినవాడని నమ్మక పోయిరి.

యోహాను 6:43-46
43 అందుకు యేసు - ''మీలో మీరు సణుగుకొనకుడి; 44 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. 45 వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును. 46 దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి యుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నాడు.

క్రీస్తు తనను తిరస్కరించినవారికి తన జన్మ రహస్యములను వారికి తెలియపరచలేదు. మరియు మనకు కూడా క్రీస్తు అవతారమును క్లుప్తముగా తెలియదు, అయితే కేవలము పరిశుద్దాత్మ మహిమవలన మాత్రమే. ఎవరైతే అతని దగ్గరకు విశ్వాసముచేత వస్తారో వారు అతనిని చూస్తారు.

యేసు ఎవరైతే ప్రకటనను తిరస్కరించారో వారిని దూరము చేసాడు. అయితే రాతి లాంటి గుండె కలిగిన వారు దేవుని రాజ్యము గురించి తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఎవరైతే అతనిని అంగీకరించి అతనిని తమ జీవితములోనికి ఆహ్వానిస్తారో వారు దేవుని ప్రేమను తెలుసుకోగలరు.

దేవుడు ప్రేమలో క్రీస్తు యేసు దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు, వారికి బోధించి మరియు వ్యక్తిగతమైన సంబంధమును గూర్చి తెలియపరచిరి. యిర్మీయా 31:3 లో మనము చదువగలము. అయితే క్రొత్తనిబంధనలో విశ్వాసము అనునది మనిషి ఇష్టమును బట్టి లేదా చిత్తమును బట్టి వచ్చునది కాదు; అయితే ఇది కేవలము పరిశుద్దాత్మ ద్వారానే వచ్చునది తప్ప మరి దీనిద్వారా వచ్చినది కాదు. మరియు ఆ పరిశుద్దాత్మ దేవుడు మనకు తండ్రి అయిన దేవుడే మన రక్షకుడని కూడా తెలియపరచుచున్నది. అతను తన పిల్లలకు నేర్పించి మరియు వారికి సరియైన మార్గమును చూపును. మరియు మన హృదయములో విశ్వాసమును సృష్టించి ఆత్మ యందు మనము నింపబడువారుగా చేయును. కనుక నీవు ఈ విధమైన పిలుపును ఊహించావా? దేవుని ప్రేమ కొరకు నీవు నీ హృదయమును తెరిచావా?

తండ్రి అయిన దేవుడు మనలను యేసు దగ్గరకు నడిపించును. మనము యేసును కలిసేంతవరకు మరియు ఆయన ప్రేమలో ఉందువరకు మనము ఆయన కొరకు ఆశకలిగినట్లు మనలను నడిపించును.

మరియు యేసుకు , తిరిగి నానించిన విశ్వాసికి గల మధ్యన వ్యతాసాము ఉన్నది. ఎందుకంటె కుమారుడు తప్ప దేవుడిని ఎవ్వరు చూడలేదు. ఎందుకంటె క్రీస్తు ప్రారంభమునుంచి తండ్రి దగ్గర ఉన్నాడు కనుక అతనికి తండ్రి గురించి తెలుసు. మరియి కుమారుడు తండ్రి వేరు కాదు. కనుక యేసు సమాధానమును మరియు దేవుని లక్షణములు కలిగి ఉన్నవాడు.

యోహాను 6:47-50
47 విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. 48 జీవాహారము నేనే. 49 మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. 50 దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే.

త్రిత్వమునకు సంబంధించిన మాటలను యేసు ప్రకటించిన తరువాత తిరిగి వారు అతని పట్ల విశ్వాసము కలిగిఉండునట్లు వారికి బోధించెను. క్రైస్తవ సిద్ధాంతములను వారికి క్లుప్తముగా వివరించెను; ఎవరైతే యేసును నమ్ముతారో వారు జీవించబడతారు. ఈ నమ్మకమును దేవుడు వారికి చెప్పెను.

యేసు ఈ లోకమునకు దేవునిద్వారా ఒక రొట్టెగా ఉన్నాడు. రొట్టె ముక్క తనంతటి తానే ఏవిధముగా క్రీస్తు చేతులనుంచి వెళ్ళలేదు అదేవిధముగా అవసరము ఉన్నవారికి యేసు కూడా దేవుని నుంచి వచ్చినవాడు. ఎందుకంటె యేసు ఐదు వేళా మందికి రొట్టెలను పంచెను కనుక. ఆయనలోనే దేవుని సంపూర్ణము ఉన్నది. మరియు అతని ద్వారానే నీకు నిరీక్షణ, ఆనందము మరియు ఆశీర్వాదము కలుగుతున్నది. వేరేవిధముగా మనము ఆలోచన చేస్తే దేవుడే ఈలోకమునకు ఒక జీవమై ఉన్నాడు అయితే ఈ లోకమే తనను తిరస్కరిస్తున్నది.

అరణ్యములో వచ్చిన మంన దేవుని ద్వారానే వచ్చినది; ఈ ఆహారము కొద్దిసేపు మాత్రమే ఉన్నది. ఎవరైతే దీనిని తిన్నారో వారు చనిపోయారు. మనము చూసినట్లయితే కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో కొన్ని సార్లు మాత్రమే ఇతరులకేజు సహాయము చేస్తారు కానీ ఎప్పుడు చేయరు. మరణము అను వ్యాధికి సంపూర్ణ స్వస్థత లేదు అయితే ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారా వారు మరణము పొందారు. క్రీస్తు నీలోనికి వచ్చి నీలో ఉండుట ఇది దేవుని ఉద్దేశము. అతను వ్యక్తిగతముగా నీలో నివసించాలని అనుకున్నాడు, అప్పుడు ఏ ఆత్మ కూడా నీలో ఉండదు కాబట్టి. అప్పుడు నీలో ఉన్న ప్రతి విధమైన భయమును తీసివేసి నిన్ను బలపరచును. మరియు నీ బలహీనతలను తీసివేసి నీకు తన బలమును ఇచ్చును. అతను దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన రొట్టెగా ఉన్నాడు. కనుక వేరే ఇతరులు నశించినట్లుగా నీవు దేవుని ఆహారమును తినుము.

ప్రశ్న:

  1. సణుగుచున్న వారికి క్రీస్తు ఏవిధముగా స్పందించాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:50 AM | powered by PmWiki (pmwiki-2.3.3)