Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Armenian -- Baoule? -- Burmese -- Chinese -- Dagbani? -- Dioula? -- English -- French? -- German -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Japanese -- Korean? -- Lingala? -- Maranao -- Nepali? -- Peul? -- Somali -- Spanish -- Sundanese -- TELUGU -- Thai? -- Turkish? -- Twi? -- Uzbek -- Yoruba
చిన్న పత్రికలు - పంచడము కొరకు బైబిల్ వాక్యములు
చిన్న పత్రిక 11 -- నన్ను వెంబడించు! (మత్తయి 9:9)మనము ఒక దేశమునించి మరొక దేశానికి విమానంలో ప్రయాణించినప్పుడు మనము చేరవలసిన గమ్యము రాగానే విమానం ల్యాండ్ అవగానే మనకొరకు చాలా వాహనాలు ఎయిర్పోర్ట్ బయట ఎదురుచూస్తుంటాయి , వాటిలో మనము గమనిస్తే, "నన్ను వెంబడించు" అని మనం చూడగలము. "నన్ను వెంబడించు" అన్న మాట మనకు 2000 సం రాల క్రితం క్రీస్తు , అనగా మరియా కుమారుడు పలికిన మాట. నజరేతు పర్వతము మీద నుంచి వచ్చి జోర్డాన్ నది తీరుముదాకా పలికిన మాట. కపెర్నహూము అను స్థలములో క్రీస్తు స్థానము చేసుకొని తన దగ్గరకు వచ్చు ప్రతి రోగిని స్వస్థతపరచెను.అలాగే మారుమనస్సు పొంది పాపక్షమాపణ పొందుడని అక్కడున్న వారికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించెను. కనుక చాలామంది స్వస్థత కొరకు , హృదయ శాంతి కొరకు రక రకాల ప్రదేశములనుంచి రావడం జరిగింది. కనుక వారికి కావలసిన జీవము గల మాటలు క్రీస్తు దగ్గర కనుగొన్నారు. మత్తయి అను సుంకపు గుత్తదారుడు ఇదే పట్టణమందు నివసించి, అక్కడున్న వారందరితో సుంకము తీసుకొని, అలాగే రోమీయులనుండి , అలాగే అక్కడకు వచ్చు ప్రతి వారినుంచి సుంకము తీసుకోవడము జరిగింది . తన సొంత ప్రజలే అతని యెడల బహు కోపము కలిగి ఉండిరి ఎందుకంటే తన సొంత ప్రజల దగ్గర కూడా తనకు తోచినంత సొమ్మును తీసుకోవడము జరిగింది కనుక. అయితే అక్కడున్న ప్రజలు సుంకము కట్టుటకు ఇష్టపడలేదు అయితే మత్తయి తన తెలివి చేత అనుభవము చేత వారిచే సుంకము తీసుకొన్నాడు. అయితే మత్తయి వీఈటన్నిటిని బట్టి తన మనసు ఎంతో కలతచెందెను , వీటిని బట్టి క్షమాపణ పొంది , మనుషుల ద్వేషమునుంచి కాపాడుకొనబడి , సమాధాన హృదయము కలిగి ఉండాలని కోరుకొనెను. క్రీస్తు ఇదే పట్టణములో ఉన్నాడు అని మత్తయికి తెలిసినప్పుడు అతనిని చూడాలని , తనం కలుసోకోవాలని , అతని ద్వారా సహాయము పొందగోరెను, ఎందుకంటే దేవుని దగ్గర మరియు మనుషులదగ్గర మత్తయి సమాధానము కలిగిఉండాలని కోరుకొనెను. అయితే తన వృత్తి రీత్యా నజరేయుడైన క్రీస్తుని కలవలేకపోయెను. ఎయితే క్రీస్తు గురించి విన్న తరువాత క్రీస్తుని ఏకాంతముగా కలవాలని ఆశపడెను. హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు క్రీస్తు. మత్తయి యొక్క హృదయములో తనను చూడాలనే తపన ఉండడము క్రీస్తు గమనించి, ఒక దినము మత్తయి ఉన్నప్రాంతమునకు వచ్చెను అప్పుడు మత్తయి యొక్క హృదయము పశ్చాత్తాపముతో ఉండుటచూచి, "నన్ను వెంబడించు!" అని ఒక్క మాటలో మట్టియిని పిలిచాడు. మత్తయికి ఎప్పటినుంచో దేవుని స్వరము వినాలని ఆశ ఉన్నది, కనుక ఎప్పుడైతే క్రీస్తు మత్తయిని పిలిచాడో అప్పుడు తనను తానూ మార్చుకొని క్రీస్తుని కలుసుకోవాలని ఆశపడెను. క్రీస్తు మత్తయిని పిలిచినప్పుడు మత్తయి క్రీస్తు ఖశ్చితంగా తనను స్వీకరిస్తాడు అని నమ్మి తనను ద్వేషించినా సమాజమును బట్టి ఆలోచించక క్రీస్తు తనను తనను వెంబడించువారిలో ఒకనిగా తనను చేర్చుకొంటాడు అని నమ్మకము కలిగి ఉండెను. ఈ అవకాశమును తప్పక ఉపయోగించుకోవాలని మత్తయి తలంచి తన పనిని వదిలి క్రీస్తును వెంబడించడము ప్రారంభించెను. అప్పుడు క్రీస్తును వెంబడించిన వారందరు ఈ సంఘటనను చూసి చాలా విస్మయమునొందిరి. ఈ మనిషి క్రీస్తును అంగీకరించడము వారెవ్వరికీ ఇష్టములేకపోయెను కనుక క్రీస్తు వారికి ఈ మాటలు చెప్పెను. "అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్ను తానూ ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును".(మత్తయి 16:24-25) క్రీస్తు తన శిష్యులకు అర్థమగునట్లు 7 రహస్య విషయములను చెప్పెను :
మత్తయి వీటినన్నిటిని తన జీవితములో అనుభవించి వీటినిబట్టి తన జీవితములో అవలంభించుకొని , క్రీస్తు యొక్క ఆజ్ఞలన్నిటిని తన హృదయములో వ్రాసుకొనెను. (మత్త 5 :1 - 7:29 ). వేరే అపొస్తలులు కూడా తనను అభిషేకించి క్రీస్తు మాటలు దాచుకొనిరి .( లూకా 1:2 ). మత్తయి అందరికంటే పెద్ద సువార్తను వ్రాసెను. తన స్వంత మాటలను వ్రాయక క్రీస్తు తన హృదయములో దేనిని ఉద్దేశించెనో వాటినే తన సువార్త పత్రికలో క్రీస్తు యొక్క కార్యములను, అతని మాటలను వ్రాసెను. మత్తయి చాల నమ్మకముగల క్రీస్తు సాక్షి అని చెప్పబడెను. ప్రకటనగ్రంధములో క్రీస్తు యోహాను దగ్గర మత్తయి పరలోకములో క్రొత్త యెరూషలేమునకు ఒక ముఖ్యమైన విలువగల రాయి అని చెప్పెను (ప్రకటన 21:14,19,20) మత్తయి తన సంపాదనను మరియు తన పనిని వదిలి క్రీస్తును వెంబడించడము ప్రారంభించెను. క్రీస్తుతో ప్రయాణము చేయడము అతనికి సులువు కాదు అయినప్పటికీ క్రీస్తు కొరకు తాను పొందిన దానిలో తృప్తి పది అతనిని వెంబడించెను. ఒకప్పుడు సుంకపు గుత్తదారుడుగా ఉన్నప్పటికినీ తాను దానివిషయమై ఆలోచించక, ఇతరుల వాలే క్రీస్తు పట్టుబడిన సమయము వరకు అతనిని వెంబడించెను. ఒకప్పుడు మత్తయి తనతో పాటు పనిచేస్తున్నవారందరికి నాయకుడుగా ఉన్నాడు, అయితే క్రీస్తును వెంబడించడం ప్రారంభించినప్పు తగ్గింపు స్వభావము కలిగిన వాడు గా మారెను. ఈ లోకపు ఆశలన్నిటిని వదిలి క్రీస్తు ఇచ్చు తృప్తిని బట్టి అతిశయించెను. రోమీయులతో పాటు చేస్తున్న పనిని విడిచిపెట్టి క్రీస్తు యొక్క పరిచారకులతో ఒకడిగా మెలగెను. క్రీస్తు తన పాపములన్నిటిని కడిగి పరిశుద్దతను అతనికి దయచేసెను. ఒంటరి జీవితమును వదిలి పరిశుద్ధాత్ముడు, దేవుని కుమారుడును అయినా క్రీస్తు ఇచ్చు శక్తిని పొందియున్నాడు. క్రీస్తు "నన్ను వెంబడించు" అని మత్తయికి చెప్పెను , అనగా ఒక రాజకీయ పార్టీని వెంబడించు అని కాదు అయితే దేవుని యొక్క జీవముగల వాక్యమును వెంబడించు అని చెప్పెను. క్రీస్తు మాత్రమే తన మంచి భవిష్యత్తు అని నిజాము తెలుసుకొనెను కనుకనే క్రీస్తు అతనికి రక్షకుడు,స్వస్థపరచువాడు,విమోచించువాడు,విడిపించువాడు మరియు తన శక్తి అయి యుండెను. క్రీస్తు మత్తయికి బదులుగా తీరూపుదినమందు చనిపోయెను అందుకే మత్తయి ఆయన యెడల విశ్వాసము కలిగి ఈ విధముగా పేతురు కు వ్రాసెను "అందుకు సీమోను పేతురు నీయవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను".(మత్తయి 16:16) ప్రియా చదువరి. మా చిరునామా Internet: www.waters-of-life.net |