Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba
Previous Lesson -- Next Lesson యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
D - పైటప్పుడు గెత్సేమనే కు వెళ్ళేటం (యోహాను 15:1 – 16:33)
4. చరిత్ర యొక్క ఎదుగుదలను పరిశుద్దాత్మ బయలుపరచుట (యోహాను 16:4-15)యోహాను 16:4-7 మొదటగా , యేసు తన శిష్యులతో శ్రమల, కష్టముల గురించి చర్చించలేదు, అయితే దానికి బదులుగా పరలోకము తెరువబడుట మరియు దూతలు మనుష్య కుమారుని పైకి క్రిందకు వచ్చివెళ్ళుట వారికి తెలియపరచెను. క్రీస్తులో దేవుని కార్యములు జరిగించుటను బట్టి వారు చాల ఆనందముకలిగి ఉండిరి. అయితే మతఛాందసవాదులు అతని ప్రవర్తనను బట్టి వ్యతిరేకించిరి, మరియు ఆ గుంపు వారికి యూదులను బట్టి భయము కలిగినట్లు చేసిరి. కనుక శిష్యులు తప్ప అందరు అతనిని విడిచిరి, అప్పుడు అతను తన పరలోకమునకు వెళ్ళుటకు సిద్దపడెను. అపుడు అతను వారితో తన శ్రమలను బట్టి మరియు మరణమును బట్టి మాట్లాడేను. అది వారికే భ్యవిస్యత్తు ప్రోత్సాహము అని ఎందుకోలేదు. అయితే అతను తన బాధను మా దగ్గర పంచుకోలేదని గమనించిరి. అయితే అతను తన తండ్రి దగ్గరకు వెళ్ళుటకు మాత్రమే వారికి వివరించెను. అందుకు వారు , " ఎక్కడికి వెళ్తున్నావు ?" అని అడిగిరి. అతను పరలోకమునకు వెళ్ళుట వారు చూచుట ఇష్టము లేకపోయెను. అయితే క్రీస్తు వారికి తాను వెళ్ళుట అవసరమని చెప్పెను, ఎందుకంటె సిలువ లేనిదే పరిశుద్దాత్మ ఇవ్వబడదు కనుక. కేవలము పాప క్షమాపణ మరియు దేవుని గొర్రెపిల్ల యొక్క మరణము వారిని దేవుని శక్తిలోనికి నడిపించును. దేవుని ప్రేమ మరియు జీవము పొందుకొనులాగున యేసు తన నీటినంతటినీ బయలుపరచెను. క్రీస్తు మరణము నూతన నిబంధనకు ఒక మార్గము, మరియు అది దేవునితో మంచి సంబంధమును కలిగించును. కనుక పరిశుద్ధాత్ముడు దీనిని కలిగి ఉండును, అది దేవుడు నీలో ఉన్నాడని ధైర్యపరచును. యోహాను 16:8-11 ఆత్మా శిష్యులను ఓదార్చును, అది విశ్వాసుల దృష్టిని తెరచి వారి హృదయములను బట్టి తీర్పు తీర్చి అవిశ్వాసులను దీనిని బట్టి నడిపించును. ఆత్మ మనకు పాపము యొక్క అర్థమును బట్టి వివరించును. క్రీస్తు రాకడ అనునది పాపము ధర్మశాస్త్రము నుంచి విడిపించి దేవుని చిత్తములోనికి నిడిపించుట. ఇది వ్యతిరేకమునకు, మరియు తక్కువ నమ్మకమునకు ప్రేమకు సాదృశ్యముగా ఉండి, దేవుడు లేని జీవితమును వివరించెను. ఎందుకంటె అన్ని పాపములు దేవుని ఘనతకు వ్యతిరేకమే, అయితే సిలువ తరువాత దీని అర్థము మనిషి చేయు పాపమునకు మరియు క్రీస్తు వ్యతిరేకమునకు మరియు అతను రక్షకుడని మరియి దేవుని కృపను వ్యతిరేకించుట. ఎవరైతే యేసు ఉచిత క్షమాపణము తిరస్కరిస్తారో వారు పరిశుద్ధాత్మాను దూషించువారు,మరియు ఎవరైతే దేవుడిని తండ్రి అని యేసును అతని కుమారుడని ఒప్పుకొనరో వారు పరిశుద్దాత్మునికి షత్రువు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక ఎవరైతే ఆ ప్రేమను వ్యతిరేకిస్తారో వారు క్రీస్తు రక్షణనుంచి వేరుపరచబడతారు. సిలువ మీద క్రీస్తు రక్షణ కార్యమును సంపూర్ణముగా చేసియున్నాడు. అతను తిరిగి చనిపోవుట అవసరము లేదు, అతను ప్రహి ఒక్కరి పాపములను క్షమించి ఉన్నాడు. అందరు క్రీస్తు రక్తములో నిర్దోషులుగా చేయబడ్డారు. అతను గొప్ప యాజకునికి సాదృశ్యముగా ఉన్నాడు;అతని సేవ మూడు దశలలో చెప్పబడినది : మొదటిది , అందరికొరకు బలియైనది. రెండవది, రక్తము చిందించుట అనునది పరిశుద్ధాత్మను దేవుని యొద్దకు నడిపించుట. మూడవది, విశ్వాసుల ఆశీర్వాదములను గురించి ఎదురుచూచుట. ఇవన్నీ యేసు చేసి ఉన్నాడు. దీని ద్వారా పరిశుద్ధాత్ముడు తన ఆశీర్వాదమును నీతిమంతులకు ఇచ్చి ఉన్నాడు. కనుక క్రీస్తు పునరుతానము మరియు అతని విమోచనము సిలువలో చేయబడినది. యేసు ఈ లోక తీర్పును బట్టి అవిశ్వాసులను నిత్యా నరకములోనికి వేయలేదు, అయితే సాతానును మరియు అతనిని వెంబడించు వారిని మరియు అతని బానిసత్వములో ఉండువారిని తీర్పు తీర్చును. అతను దేవుని సహవాసము నుంచి అతని ప్రేమనుంచి మనుషులను వేరుపరచు వాడు. అతను వారిని ద్వేషము అను గొలుసులతో కట్టి వారిని సాతాను పిల్లలుగా చేసియున్నాడు. యేసు ఒక సత్వేఏకము కలిగిన వానిగా మోసపుచ్చువానిని గర్వము కలిగిన వానిని ఖండించెను. కుమారుని ప్రేమనుంచి సాతానును వేరుపరచును. ఎప్పుడైతే క్రీస్తు తన ఆత్మను తన తండ్రికి అప్పగించెనో అతను సాతానును జయించెను. అతని నమ్మకమైన సిలువమరణము సాతాను మీద ఒక జయము. కనుక మనము విజయము అనునది ఎప్పుడు కలుగుతుందో అక్కడ మనము ఉందుము. కనుక మనము తండ్రికి ప్రార్థన చేసి, " మమ్ములను శోధనలోక్ నడిపింపక, సాతాను నుంచి విడిపించుము", అప్పుడు మనము క్రీస్తు విజయమును అనుభవించెదము. ప్రార్థన: ప్రభువా నీవు మంచి పోరాటమును పోరాడినందుకు నీకు కృతజ్ఞతలు, నీవు సత్వేయకుడవు ప్రేమ స్వరూపి మరియు నిరీక్షణకు కర్త. నీవు మాకొరకు తండ్రి యొద్దకు వెళ్లి మమ్ములను దోషముయ్ లేని వారీగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు. నీ పరిశుద్దాత్మ ద్వారా ఆశీర్వాదములను మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. నీ నీటిలో మమ్ములను నిలువబెట్టుము, అప్పుడు శత్రువు మమ్ములను ముట్టడు. నీ నామము ఘనపరచబడులాగున మమ్ములను సాతాను నుంచి విడిపింపుము. ప్రశ్న:
|