Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba
Previous Lesson -- Next Lesson యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
B - ప్రభువు భోజనమునకు సంభవించు కార్యములు (యోహాను 13:1-38)
2. ద్రోహి చూపి భంగపడ్డాడు (యోహాను13:18-32)యోహాను 13:21-22 యేసు తన శిష్యులకు ప్రేమను గూర్చి వివరించెను. అతను సాధ్వెకమునకు మరియు ప్రేమకు మరియుబలహీనతలో బలమునకు సాదృశ్యముగా ఉన్నాడని వారికి చూపెను. అందును బట్టి యేసు యూదాను గురించి మరియు అతని మోసమును గూర్చి వారికి తెలిపెను, దీనిద్వారా యూదా అతని సొంత ఆలోచన చేత యేసు పాటించాడని చెప్పక పరలోకమందు ఈ కార్యమును బట్టి ప్రణాళిక కలిగినట్లు గా చెప్పెను. యేసు తన శిష్యులకు మీలో ఒకరు నన్ను ఈ యూదుల సంఘమునకు పట్టిస్తారని ముందుగానే చెప్పెను. ఈ విషయాన్నీ అతను ఒక పండుగలో చెప్పెను. యేసు తనకు తానుగా ఈ సత్యమును వారికి చెప్పలేదు అయితే లాజరు సమాధి దగ్గర అతని ఆత్మ శ్రమపడెను కనుక వారికి ఈ విషయాన్నీ బట్టి చెప్పెను. తన తండ్రి తనను వదులుతున్నప్పుడు ఈ ఆలోచనలను బట్టి ఎంతగానో దుఃఖము కలిగి ఉండెను. యేసు యూదాను ఎన్నుకొని అతనిని కూడా ప్రేమించెను; ఎందుకంటె ఒకరు వారి కొరకు ఎన్నుకొనబడినవారు మోసము చేయుట చాలా అసంభవం. అయితే బైబిల్ లో ఇది , కీర్తన 41 :9 , " ఎవరైతే నా శరీరమును తింటారో వారు తన మాడిమను నాకు వ్యతిరేకముగా ఎత్తును." దానికి, శిష్యులు ఈ విధముగా ఆలోచన చేసిరి, " అతను ద్రోహ?" ఎందుకంటె ఇది ఎవరినానై పట్టించుటకు అవకాశము కలుగును కాబట్టి. వారిలో ప్రతి ఒక్కరు యేసును పట్టుకున్నప్పుడు అందరు అతనిని వదిలి వేస్తారని వారి మనసులలో అనుకొనిరి. అయితే యేసు ముందర వారు తనము తాము మంచిగా కనపరచుకొనిరి, కనుక వెలుగైనా యేసుతో వారు తమను తాము కనపరచుకొనుటకు సిగ్గుపడిరి. యోహాను 13:23-30 ఈ కలత చెందిన సమయములోనే యేసును పట్టించుట జరిగెను, మనము ఒకరిని ఒకరు ప్రేమించుమనే ఒక మంచి సాక్ష్యమును చదివి ఉన్నాము. యోహాను యేసు వైపు విశ్రాంతి కలిగి ఉన్నాడు. యోహాను తన పేరును ఈ సువార్త పత్రికలలో ఒక్కసారే జ్ఞాపకము చేయలేదు అయితే తనకు తాను క్రీస్తుకు దగ్గర కలిగి ఉండుట చూపించెను, మరియు ప్రేమ కలిగి ఉండెను. అతనికి యేసు ప్రేమను పొందుకొనుటకంటె ఎక్కువైనది ఏది కూడా లేదు. కనుక తన పేరును ఎక్కువగా చూపించక యేసును ఘనపరచెను. పేతురు యేసును ఎవరు ఆ విధముగా పట్టిస్తారా అని అడుగుటకు సిగ్గుపడెను అయితే అతని నరము ఉండలేకపోయెను. అందుకు అతను యోహానును ఆ మనిషి ఎవరై ఉంటారని సైగ చేసెను. అప్పుడు యోహాను వంగి " ఎవరు అది " అని అడిగెను ? అప్పుడు యేసు ఈ ప్రసన్నకు నిశ్శబ్దముగా సమాధానము చెప్పెను, ఆ మోసగాడి పేరుచెప్పక, అయితే ఒక సూచన చేసెను. యేసు ఈ సమయములో అతని పేరును బహిరంగముగా చెప్పుటకు ఇష్టపడలేదు. ఎందుకంటె ఆ సమయములో యూదా అక్కడ కనికరించబడెను. అయితే యేసు రొట్టెను విరిచి తన శిష్యులతో బంధము కలిగి ఉండునట్లు దానిని యూదాకు ఇచ్చెను. ఈ కార్యమునకు గల బలము యేదనగా వారిని నిత్యజీవమునకు బలవంతులుగా చేయుట అయితే యూదా పట్టించుటకు ప్రణాళిక కలిగి ఉండెను కనుక ఇది అక్కడ జరగలేదు. అతని హృదయము క్రీస్తుకు దగ్గరగా ఉండెను అయితే సాతానుడు అతనిని మోసము చేసెను. అయితే యేసు తన చిత్తమును బట్టి తన హృదయమును కఠిన పరచుకొనెను. కనుకనే ఎప్పుడైతే యేసు యూదాకు రొట్టెను ఇచ్చాడో అప్పుడు సాతానుడు అతని ఆలోచనలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ రొట్టెను స్వీకరించాడో అప్పుడు చేదు అతని నుంచి వెళ్లెను. అయితే క్రెస్టు తీర్పును బట్టి అతను సాతాను నుంచి విమోచింపబడెను. అనుకోకుండా కబలము తీసుకొని పోతున్నప్పుడు యూదా చూపబడ్డాడు. అప్పుడు యేసు ఆజ్ఞ అతని మనసులో కట్టబడినది, " నీ చేదు కార్యములను చేయుటకు ఆలస్యము చేయకు ఎందుకంటె ఆ కార్యముల ద్వారా నీకు మంచిది బయటకు వస్తుంది". యేసు యూదా గురించి చెప్పుట శిష్యులు అర్థము చేసుకోలేకపోయిరి. ఎందుకంటె అతనితో ఉన్నవారికి అతను ఆహారమును కొనమని చెప్తారు. యోహాను యూదాను బట్టి క్రీస్తు వెలుగులోనుంచి తిరిగి చీకటిలోకి వెళ్ళుట తన పత్రికలో వ్రాయుట మరచిపోలేదు. యోహాను 13:31-32 అవిశ్వాసఘాతకము ద్వారా యేసు ఏవిధముగా మహిమపరచబడ్డాడు ? చేదు కార్యముల ద్వారా మంచి ఫలము ఏవిధముగా వచ్చును ? ఆయన ఎన్నుకున్న శిష్యులు ఆయనను వదిలినప్పుడు యేసు యేడ్చెను. ప్రేమ కలిగి ఉండు వాడు అతని చెడునుంచి వచ్చును. అయితే యూదా ఇది జరిగిన తరువాత ఆ యూదులు సంఘమునొద్దకు వెళ్లెను. రాజకీయము చేసే మిస్సయ్యాను యేసు దూరంచేశాడు, ఏలాగనగా యూదాను క్రీస్తు ఆ పట్టుకొనిపోవు వారు వచ్చినప్పుడు. అతను దేవుని గొర్రెపిల్ల మాదిరి చనిపోవుటకు ఇష్టపడెను, మనుషులను సాత్వికము ద్వారా మరియు మంచి మనసు ద్వారా విడిపించుటకు, అతని మరణముద్వారా త్యాగమైన మృతి అతని మహిమను చూపును అని. యేసు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత మహిమను చూడలేదు, అయితే మరణము వరకు తన తండ్రి మహిమను వెతికాడు. అతని తండ్రి నశించిపోతున్నవారిని వెతికి రక్షించుటకు ఈ లోకమునకు పంపి ఉన్నాడు. కనుక కుమారుడు కూడా మనుషుల నశించిపోతున్నప్పుడు తన తండ్రి రూపమును వారికి తెలియపరచియున్నాడు. దీని ద్వారా కుమారుడైన యేసు తన తండ్రి యొక్క మంచితనమును మరియు అతని తండ్రి మహిమను చూపియున్నాడు. ఒంటరిగా తర్ఫీదు పొందుట చాలదు అయితే దేవునికి మరియు అతని పిల్లలకు సంబంధమును బలపరచాలి. మనకు మరియు దేవునికి మధ్యన ఉన్న వ్యత్యాసము చనిపోవాలి అప్పుడు క్రీస్తు దీని కొరకు మరణించును. అప్పుడు నీటికి కావలసిన అర్హతలు పొందగలము. క్రీస్తు యొక్క మరణము దేవుని మహిమకు ఒక తాళపు చెవిలాంటిది. ఆ మరణము లేడుందా నిజమైన దేవుని జ్ఞానము మనకు కలగదు. ఎప్పుడైతే క్రీస్తు తనను తాను నిరాకృతుడయ్యాడు, అతని మృతి ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది, మరియు అతను చెప్పినట్టు అతని తండ్రి అతని మీద తన కృపను ఉంచునని, కనుక అతను అన్నిటి విషయములకు ఒక బహుమానంగా కృప అయి ఉన్నాడు. క్రీస్తు ఎప్పుడైతే పట్టుబడ్డాడా అప్పుడు అతను తన భవిష్యత్తును మరియు సింహాసనము మీద కూర్చుండుట ముందే చూసేను. కనుక క్రీస్తు తన మహిమలోనికి ప్రవేశించాలంటే అతను మరణించవలసి ఉన్నది. ఎవరైతే క్రీస్తు శ్రమలను మరియు మరణమును ఖండిస్తారో, మరియు వారు బలహీనులని వ్హావించి ఉంటారో వారు సిలువ మరణమును దేవుని చిత్తమని తెలుసుకొనలేరు, మరియు కుమారుని పరిశుద్ధత కూడా తెలుసుకొనలేరు. కనుక అతను ఎక్కడైతే మరణించాడా అక్కడనే తన మహిమను వారికి చూపెను, కనుక ఎవరైతే అతనిని విశ్వసిస్తారో వారు నిర్దోషమైన వారుగా ఉంటారు. ప్రార్థన: తండ్రి , కుమారా, పరిశుద్ధాత్ముడా, నీ రక్షణను బట్టి ఘనపరచుచున్నాము, వినయము శ్రమకలిగినది, నీ మరణము మరియు పునరుత్తనము. మేము క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడినామని విశ్వసిస్తున్నాను. మేము ఆత్మ శక్తిచేత నీకు మహిమ ఇస్తున్నాము. నీవు మా అపాయములలోనుంచి కాపాడినావు. నీవు మాకు దయచేయబోతున్న జీవితము నిత్యమైనది. మీ కుమారుడు త్వరలో మహిమతో కనబడునని విశ్వసిస్తున్నాము. ఆమెన్ . ప్రశ్న:
|