Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- John - 079 (The Father glorified amid the tumult)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
A - పరిశుద్ధ వారము ప్రరంభము (యోహాను 11:55 – 12:50)

4. అల్లరి మధ్యన తండ్రి మహిమపరచబడుట ( యోహాను 12: 27-36)


యోహాను 12:27-28
27 ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నే నేమందును?తండ్రీ, యీ గడియ తటస్థింపకుండనన్ను తప్పించుము; అయి నను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని; 28 తండ్రీ, నీ నామము మహిమపరచు మని చెప్పెను. అంతటనేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.

యేసు తనను తాను కనపరచుకొనెను. అతను జీవమునకు కారకుడైనప్పటికీ కూడా మరణమును అతనిని మ్రింగునట్లు తనను తాను తగ్గించుకొనెను. అతను ప్రభువులకు ప్రభువైనప్పటికీ దెయ్యము అతనిని అధికారము చేయునట్లు చేసెను. యేసు మనకు బదులుగా ఆ ఉగ్రతను క్రీస్తు ద్వారా తప్పించుకొనబడ్డాము, ఎందుకంటె అతను ఇష్టపూర్వకంగానే మన కొరకు చనిపోయెను. అతను దేవుని కుమారుడు కనుక ప్రారంభమునుంచి అతను తండ్రిదగ్గరనే ఉన్నాడు. మనము రక్షణ పొందునట్లు తండ్రి అతని కుమారుని వదిలిపెట్టను అప్పుడు మనము తండ్రితో కృపాకలిగిన బంధమును కలిగి ఉండునట్లు. కనుక ఎవ్వరు కూడ తండ్రి మరియు కుమారుల నొప్పిని కనుగొనలేరు. మన విమోచనకొరకు త్రిత్వము యొక్క ఐక్యత గొప్ప నొప్పితో ఉన్నది.

ఈ విధమైన నొప్పిని క్రీస్తు శరీరము వత్తిడిని చేయలేదు. అందుకే , " తండ్రి , ఈ ఘడియ నుంచి నన్ను రక్షించు " అని అరిచాడు. అప్పుడు ఆత్మ స్పందించడము అతని హృదయములో విన్నాడు ," నీవు ఈ ఘడియ కొరకు జన్మించి యున్నావు, ఎందుకంటె ఈ ఘడియ యొక్క ఉద్దేశము నిత్యజీవము ఇచ్చుటకు. తండ్రితో ఈ సృష్టి అంత కూడా ఈ సమయము కొరకు ఎదురుచూచేను, కనుక మనిషి దేవునితో అనుకూలముగా ఉండుటకు. కనుక ఈ సమయములో సృష్టి యొక్క ప్రణాళిక నెరవేర్చబడును. "

అప్పుడు యేసు ," తండ్రి నీ నామము మహిమపరచబడును గాక" అని అనెను. కుమారుడు శరీరమునకు సంబంధించిన స్వరమును బట్టి జాగ్రత్త కలిగి లేడు. అతను పరిశుద్ధాత్మతో కలిసి ప్రేమతో ప్రార్థించెను, " నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అప్పుడు ఈ లోకము నీవు భయంకరమైన దేవుడు కాదని తెలుసుకొనుము, మరియు ప్రేమ కలిగిన తండ్రి, తన కుమారుని కొరకు తన స్వస్థమునే ఇచ్చిన వాడు మరియు ఈ లోక మనుషులను రక్షించే వాడవు ."

దేవుడు తన కుమారుడు చేసిన మానవుని వ్యతిరేకించలేదు. అందుకే అతను పరలోకమునుంచి, " నా నామమును నీ యందు మహిమపరచుకొన్నాను. నీవు నా తగ్గింపు మరియు లోబడి కుమారుడవు. ఎవరైతే నిన్ను చూస్తారో వారు నన్ను కూడా చూసెదరు. నీవు నా ప్రేమకలిగిన కుమారుడవు నేను నీద్వారా ఘనత పొందుకున్నాను. నీవు సిలువను మోయుట కంటే నాకు ఇక ఏ ఆనందము కూడా లెదు.ప్రత్యామ్నాయముగా ఉండే నీ మరణముతో నా కృపను కష్టములలో మరియు శ్రమలలో ఉంచుదును. సిలువమీద నీవు కృపను గూర్చి సత్యమును గూర్చి మరియు పరిశుద్దతను గూర్చి వివరించియున్నావు. కనుక ఇది ప్రేమకంటే మరియు త్యాగముకంటె మరియు కష్టము కంటే గొప్పదైనది కాదు.”

పరలోక స్వరము ఆలాగుననే మాట్లాడేను, " నీవు సమాధి నుంచి తిరిగి లేచి నా దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి నేను నా నామము మహిమపరచుదును, మరియు నీవు మహిమతో కూర్చొని, నీవు ప్రేమించువారి మీదికి నా మహిమను కుమ్మరించెదను. అప్పుడు నూతన జన్మముచేత నా తండ్రి మహిమపరచబడి పరిశుద్దాత్మ ద్వారా నూతన జీవితమును పొందుకోగలము. వారి సన్నిది నన్ను ఘనపరచును. సిలువ మీద నీ మరణము దేవుని పిల్లలకు నూతన జన్మమునకు కారణము. మరియు నీవు దేవునితో మా మానవులను బట్టి అడుగుట సంఘాలు బలపరచబడుటకు ఒక కారణము. నీలో మాత్రమే తండ్రి ఘనత మరియు మహిమ పొందుకొనును."

యోహాను 12:29-33
29 కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహముఉరిమెను అనిరి. మరికొందరుదేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి. 30 అందుకు యేసు ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను. 31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును; 32 నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. 33 తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.

అక్కడున్న గుంపుకు యేసు స్వరము దేవునితో మాటలాడుట అర్థము కాలేదు అయితే ఏదో ఒక శబ్దము ఉఉండని అనుకొనిరి. వారు దేవుడు ప్రేమ అయి ఉన్నాడని వివరించలేకపోయిరి, మరియు అతని దాయకలిగిన స్వరమును కూడా వినలేదు, మరియు కుమారుని ద్వారా దేవుని మహిమ ఈ లోకమునకు తీర్పు తీర్చుట ప్రారంభమైనది తెలుసుకొనలేదు.

క్రీస్తు తన మరణమును మన కొరకు ఇచ్చిన తరువాత సాతాను శక్తులు పనిచేయలేదు ఎందుకంటె క్రీస్తు మృతి వాటన్నిటి మీద జయము పొందెను కనుక. కుమారుడు తనను తాను తండ్రికి సమర్పణ కలిగిన దానికి ఆ సాతానునికి అందకుండా పోయెను. క్రీస్తు సాతానును ఈ లోక రాజు అని పిలిచెను,ఎందుకంటె ఈ లోక మంథా కూడా అతని బందములో ఉన్నది కనుక. ఈ విధమైన నొప్పితో మరియు చెడైనా సమయములో కూడా క్రీస్తు ఎవ్వరిని కూడా వ్యతిరేకించలేదు అయితే సాతానుని అతని నీటి అను ఖడ్గముతో పట్టుకొనెను. కనుక మనము ఇప్పుడు యేసు ద్వారా విడిపింపబడినవారము.

సాతానుడు క్రీస్తు భూమి మీద కానీ మరియు పరిపాల కానీ చనిపోవాలని ఉద్దేశించలేదు అయితే సిలువ మీద సిగ్గుతో చనిపోవాలని ఉద్దేశించెను. అరణ్యములో మోషే ఏ విధముగా అయితే సర్పమును పైకి ఎట్టాడో అదేవిధముగా విశ్వాసులకొరకు కొరకు శిక్షకలిగి చనిపోవాలని అనుకొన్నాడు. సిలువ మరణమును చూసిన వారిని దేవుడు ఎప్పుడు కూడా ఖండించలేదు. మన విశ్వాసము క్రీస్తు పైన అతనితో కూడా సిలువవేయబడినట్లుగా మరియు అతని మరణముతో ఐక్యత కలిగి నట్లుగా ఉండును. కనుక మనము చనిపోయినది నీతిగా జీవించుటకు.

క్రీస్తుతో మన ఐక్యత మనకు తన శక్తిని మరియు మహిమను ఇచ్చును. అతను ఏవిధముగా అయితే పాపమును తన పరిశుద్ధతతో జయించిఉన్నదో ఆలాగున, కనుక మనలను అతని వెనుకకు మనలను నడిపించి అతని మహిమను మనము పొందునట్లు చేయును. ఎవరైతే అతనిని విశ్వసిస్తారో వారు నశింపక నిత్యజీవమును పొందుకొనెదరు.

యోహాను 12:34
34 జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.

యూదులు యేసును చెరపట్టుకొని పోయి, అతనిని రుజువులు లేకుండా అతని మంచితనమును అడుగుటకు చెరపట్టుకొని పోవాలని అనుకొనిరి. వారికి దైవత్వము కలిగిన దానియేలు గ్రంధము యొక్క అర్థములను తెలుసుకొనిరి, 7 అధ్యయము, అక్కడ మెస్సయ్య మనుష్య కుమారుడని పేరు పెట్టబడి ఈ లోకమునకు తీర్పు తీర్చును అని. అయితే వారు ఇంకనూ అతని కుమారత్వమును వినాలని ఆశించిరి. అయితే వారు అనుకున్నట్లుగా కాక యేసు తనను తాను ఎలా ఉండగలదు దానినే వారికి కనపరచెను. అయితే కొంతమంది అతనిని ఎలాగైనా పట్టుకోవాలని అతని నుంచి వచ్చు ప్రతి మాట కూడా ద్వేషించునదిగా ఎంచుటకు ప్రయత్నించిరి. అప్పుడు యేసును మనుష్య కుమారుడని చెప్పిరి. యేసు తనను తాను తన కొరకు వెతుకువారికి కనపరచుకొనలేదు, దానికి బదులుగా తనను సామాన్యమైన విశ్వాసులు ఏవిధముగా విశ్వాసము కలిగి ఉంటారో వారికి దేవుని కుమారుడే మనుష్య కుమారుడని నిరూపించెను.

యోహాను 12:35
35 అందుకు యేసుఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడ

యేసు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు కనుక వెలుగును గూర్చి వివరించుట అవసరము లెదు. అయితే ఇది వివరించబడింది,ఎప్పుడంటే సామాన్యమైన ప్రజలు ఈ వెలుగును చీకటితో పోల్చుకున్నప్పుడు. పగలు ఒకడు ఎంతో దూరమైనా నడవగలడు, అయితే చీకటిలో నడవలేడు. సూర్యుడు ప్రకాశించునప్పుడే ఒకడు పని చేయగలడు. యేసు యూదులతో మీకు కొద్దీ సమయము మాత్రమే మిగిలివుంది కనుక వెలుగులోనికి ప్రవేశించుడని చెప్పెను. కనుక ఆ సమయమునకు , సమర్పణ, నిర్ణయము మరియు స్థిరత్వమూ అవసరము.

ఏదేమైనప్పటికీ, ఒకరు ఈ వెలుగును తిరస్కరించినట్లైతే వాడు చీకటిలోనే ఉంది అతని మార్గమును కనుగొనలేక పోవును. అందుకే యేసు యూదులను బట్టి మీరు ఒక వేళా ఈ వెలుగును తెలుసుకొనలేక పోతే అరణ్యములో ఎక్కడికి వెళ్లాలో తెలియక అక్కడికీ ఇక్కడికి వెళ్లి నిరీక్షణ లేని వారీగా ఉందురు అనెను. ఈ చీకటి మనలను తారుమారు చేసి మనము అబద్ధము చెప్పుటలో నడిపించును. అయితే మనలో చీకటి ఉన్నప్పుడు మనము దురాత్మా చేత నింపబడినవారముగా ఉండడము. కనుక ఎప్పుడైతే మనము పరిశుద్దాత్మ చేత నింపబడి ఉంటామో అప్పుడు మనము ఎప్పుడు ప్రకాశించు వారీగా ఉంటాము. కనుక ఎవరైతే క్రీస్తు కొరకు ఆశ కలిగి ఉండరో వారు ఈ చీకటిలో ఉండెదరు. కొందరు " క్రైస్తవులు " అని పిలువబడుచున్న దేశాలు చీకటిలో ఎందుకు ఉన్నాయో నీకు తెలుసా ? ప్రతి ఒక్కరు " క్రైస్తవునిగా " క్రీస్తు కొరకు ఆశకలిగి ఉండుటకు పుట్టలేదు. అయితే ఎవరైతే తిరిగి జన్మించారో వారు మాత్రమే క్రీస్తు కొరకు ఆశకలిగి ఉండెదరు. ఎవరైతే వెలుగులోనికి ప్రవేశించరో వారు చీకటిలోనే ఉండెదరు. కనుక నీవు నీ పితరుల ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకొనలేవు. కనుక క్రీస్తుకు సమర్పించుకొనుట మరియు ఆశకలిగి ఉండుట నీ ఇష్టమే .

యోహాను 12:36
36 మీరు వెలుగు సంబంధు లగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాస ముంచుడని వారితో చెప్పెను.

నీవు క్రీస్తుతో సంబంధము కలిగి ఉన్నప్పుడు అది నిన్ను పూర్తిగా మార్చును. కనుకనే సువార్తలలో మనము చదువునట్లైతే దేవుని మహిమ శక్తి కలిగి అందరికి ఉండును. అయితే న్యూక్లియర్ దేశములను నాశనము చేస్తా క్రీస్తు శక్తి మనకు నిత్యా జీవమును ఇచ్చును, అప్పుడు విశ్వాసి వెలుగుగా ఉంది అందరికి వెలుగునిచ్చు వాడుగా ఉండును. క్రీస్తు ప్రేమలో , సత్యములో మరియు పరిశుద్ధతలోనికి ప్రవేశించావా ? క్రీస్తు నిన్ను తన వెలుగులోనికి వచ్చి పరిశుద్ధత కలిగి ఉండుమని పిలుచుచున్నాడు.

ఈ విధముగా యేసు తన ప్రసంగములను యెరూషలేములోని ప్రేవేశించక మునుపు చేసెను, రోమీయులకు కానీ హేరోదుకు కానీ తన శక్తిని బలవంతముగా చూపలేదు. అయితే ఈ లోక తీర్పు మరియు అతని యుద్ధము సమీపముగా ఉండెను. వెలుగు చీకటిలో ప్రకాశించును ; అప్పుడు విశ్వాసులు రక్షించ బడుదురు అయితే అవిశ్వాసులు తప్పిపోవుదురు. కనుక పరలోకమునకు మరియు భూమికి గల గమ్యము దగ్గరకు వచ్చెను. దేవుడు మనుషులను విశ్వసించుమని బలవంతము చేయదు. కనుక నీవు వెలుగు కుమారుడుగా ఉన్నావా లేక చీకటికి దాసుడుగానే ఉన్నావా ?

ప్రార్థన: నిన్ను నీవు ఈ లోకమునకు వెలుగుగా మాకు కనపరచు కొన్నందుకు నీకు కృతజ్ఞతలు. నీ కృప దగ్గరకు మమ్ములను నడిపించు, మమ్ములను దాయకలిగిన వారీగా మార్చు. ధనము నుంచి అధికారము నుంచి మరియు ఈ లోక విజయములు నుంచి కాపాడు, అప్పుడు మిమ్ములను వెంబడించి మీ వెలుగులో నడుచువారిగా చేయుము.

ప్రశ్న:

  1. వెలుగు కుమారులకు గల అర్థము ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:32 AM | powered by PmWiki (pmwiki-2.3.3)