Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba
Previous Lesson -- Next Lesson యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)
1. పస్కా పండుగలో జరిగిన కార్యములు (ఈస్టర్) (యోహాను 20:1-10)
b) పేతురు మరియు యోహాను సమాధి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళుట (యోహాను 20:3-10)యోహాను 20:6-8 యోహాను సమాధి బయటే నిలబడి పేతురు కొరకు ఎదురుచూసేను, ఎందుకంటె అపొస్తలులలో పేతురు పెద్దవాడు కాబట్టి, పెద్దవారు మొదట చూడాలనే ఉద్దేశమై చేత యోహాను పేతురు కొరకు ఎదురుచూసేను. ఆ యవ్వనస్తుడైన యోహాను ఆ సమాధికి ఉంచబడిన రాయి దొర్లించుట మరియు యేసు శరీరము లేకుండుట అతనే మొదట చూసేను. ఎందుకంటె ఆ సమాధి వస్త్రములు కూడా జార్గ్రత్తగా ఉంచబడినాయి. అప్పుడు అతని మనసులో అనేక ఆలోచనలు కలిగెను;అప్పుడు అతను క్రీస్తు నుంచి వెలుగు పొందుటకు ప్రార్థించెను ఎందుకంటె అక్కడ ఏమి జరిగేనా అని తెలుసుకొనుటకు. ఎప్పుడైతే పేతురు ఆ సమాధి దగ్గరకు వచ్చెనో అప్పుడు నేరుగా లోపలి వెళ్లి; యేసు మోహమునకు చుట్టిన గుడ్డ లేకుండుట చూసి అది వేరే స్థలములో ఉండుటయే చూసేను. దీని అర్థము ఏమనగా యేసు శరీరము ఎవ్వరు దొంగలించలేదు మరియు అతని కార్యము క్రమము ప్రకారము జరిగెనని అర్థము చేసుకొనెను. పేతురు ఒక అధికారిగా నేరుగా లోపలి వెళ్లెను అయితే ఆ గుర్తుకు ఏవిధమైన అర్థమును తెలుసుకొనలేకపోయెను. అప్పుడు యోహాను కనిపెట్టుకొని ప్రార్థన చేసెను. ఎప్పుడైతే పేతురు పిలువబడెనో అప్పుడు అతను యేసు పునరుత్థానమును విశ్వసించుట ప్రారంభించెను. అతను పునరుత్థానుడైన వాడిని చూసి విశ్వసించలేదు అయితే ఖాళీ సమాధి మరియు చుట్టబడిన గుడ్డలు అతని విశ్వాసమును బలపరచెను. యోహాను 20:9-10 యేసు జ్ఞానులవలె, ప్రవక్తల వాలే, మరియు పాపుల వాలే సమాధిలోనే ఉండలేదు అయితే ఒకడు వస్త్రములను ఏవిధముగా విడుచునో అలానే అతను కూడా మరణమును విడిచెను. కనుక పరిశుద్ధుడు పాపములేని వాడుగా ఉండెను. కనుక మరణమునకు అతని మీద ఏ అధికారము లేదు. దేవుని ప్రేమ నిత్యమూ ఉండును. యేసు శత్రువులు అతని శరీరము ఆ సమాధిలో లేదు కనుక శిథిలమై పోయినదని అనుకొనలేదు. ఎందుకంటె క్రీస్తు ఎక్కడికీ పారిపోలేదు మరియు క్రమ బద్దీకరముగా లేదు అయితే యోహాను దానికి ఒక సాక్షిగా ఉండెను. అయితే క్రీస్తు తన పయనమును ఒక తొట్టెలోనుంచి ప్రారంభించెను. కనుక పునరుత్థానము ద్వారా ఒక క్రొత్త అధ్యాయమును పరలోకమందు చేయబడెను. అతను ఇంకనూ సహజమైన మనిషిగా ఉండెను. ఈ విధమైన ఆలోచనలు యోహానును ఆ సమాధి నుంచి బయటకు వచ్చునప్పుడు కలిగెను. అతను అప్పటికే యేసు పునరుత్థానమును విన్న మొదటి వాడిగా ఉన్నప్పటికీ అతనిలో ఏవిధమైన అహంభావం లేకపోయెను, అయితే వాక్యంలో వ్రాయబడినట్లు జరిగెనని విస్వసించెను. యెషయా 53 లో చెప్పబడినట్లు అతని కన్నులు మూయబడెను కనుక అతను దేవుని విజయమును చూడలేకపోయెను అని. మరియు దావీదు ప్రవచనమును కూడా స్వీకరించలేదు (లూకా 24:44-48; అపొస్తలుల 2:25-32; కీర్తన 16:8-11). ఆ పండుగ అయిపాయినా తరువాత ఆ ఇద్దరు శిష్యులు వారి ఇండ్లకు తిరిగి వెళ్లి , వారి మనసులు ఇబ్బంది చేసినను నిరీక్షణకలిగి ఉంది, ఎన్నో సందేహములు ఉన్ననూ విశ్వసించి, యేసుకు అనగా ఆ సమాధిని వాడాలి వెళ్లిన వానికి ప్రార్థన చేసిరి. ప్రార్థన: ప్రభువా నీ పునరుత్థానమందు మేము నమ్మకము కలిగి ఉండులాగున మమ్ములను నీ శిష్యులుగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు మాకు ఒక గొప్ప నిరీక్షణకు దయచేసి ఉన్నావు. మేము నీ కృప ద్వారా పరిశుద్ధులముగా చేయబడ్డాము కనుక నిన్ను మేము మహిమ పరచుచున్నాము. ,ఆ స్నేహితులు వారి పాపములో చనిపోతున్నారు కనుక దయచేసి వారిని కూడా నీ త్యాగములో విడిపించుము. ప్రశ్న:
|