Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba
Previous Lesson -- Next Lesson యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
1. ప్రత్యక్ష గుడారపు పండుగలో క్రీస్తు మాట్లాడుట (యోహాను 7:1 - 8:59)
d) యేసు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు (యోహాను 8:12-29)యోహాను 8:21-22 యేసుకు తాను ఆ దేవాలయములో కావలి వారి ద్వారా చుట్టూ చేయబడ్డానని తెలుసు. అందుకే అతను లోతైన భవిష్యత్ మర్మమును తెలియపరచి ఉన్నాడు, " నా మరణ సమయము సమీపమై ఉన్నది. అప్పుడు నేను ఈ లోకమును విడిచినప్పుడు నీవు నన్ను కనుగొనలేవు. మీ స్వంత ప్రణాళికలతో నన్ను చంపువారు మీరు కాదు. అయితే నా సమయమును విడుచుటకు నేనే నిరణయించుకొన్నాను." " అయితే నేను సమాధి నుంచి మరియు అడ్డుగా చేయబడిన రాళ్లు మరియు తలుపు నుంచి తిరిగి లేచెదను. నీవు నన్ను వ్యర్థముగా వెతికెదవు అయితే నన్ను కనుగొనలేవు. నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళుట నీకు తెలియకపోయెను. నీవు నన్ను తిరస్కరించి దేవుని గొర్రెపిల్లను కూడా తిరస్కరించియున్నావు, ఎందుకంటె నేనే మనుష్యులను తప్పించువాడను కాబట్టి. నీవు నీ పాపములో నశించిపోయెదవు." " నీవు నీ పాపములో చనిపోయెదవు " అని యేసు చెప్పలేదు. మన బాహ్యసంబంధమైన పాపములు మనకు కనబడవచ్చు అయితే అంతరంగమందు చేయబడిన పాపములు కనబడవు కనుక దేవుని దృష్టిలో మనము అపనమ్మకం కలిగి ఉండకూడదు. ఏయూదులు యేసు తన చివరి దినపు మాటలు మాట్లాడుతున్నాడని తెలుసుకొన్నారు, అయితే అతను తిరిగి తన తండ్రి దగ్గరకు వెళ్తాడు అనే సాక్ష్యమును తెలుసుకొనలేకపోయిరి. అయితే పరిశయ్యులను బట్టి మరియు యాజకులను బట్టి క్రీస్తు తన శక్తి చేత వచ్చి నాడని అనుకొనిరి. ఒకడు ఆత్మహత్య చేసుకొంటే నరకము ఆయనను మింగునా? ఎందుకంటె యూదులు వారి నీతినిబట్టి దీని విషయములో ఆలోచనకలిగి లేరు. ఎందుకంటె 70 వ రోమా సామ్రాజ్యములో ఎంతో మంది ఆత్మహత్య చేసుకొన్నారు కాబట్టి. యోహాను 8:23-24 దేవుని రాజ్యము ఈ కీడు చేయు లోకము నందు సత్యమైనదిగా ఉన్నాడని యేసుకు తెలిసెను. మనమందరము కూడా మట్టి నుంచి వచ్చినవారము, మరియు చేదు ఆలోచనలు కలిగి ఉన్నాము. ఎందుకంటె సాతాను విత్తనము అదే విధమైన విత్తనమును తీసుకొనివస్తున్నది. సామాన్యమైన మనిషి దేవుని చిత్తమును తెలుసుకొనలేదు అయితే అతని సన్నిధిని మాత్రమూ తెలుసుకొనును. క్రీస్తు ఈ లోక వాసి కాదు ; అతని ప్రాణము తండ్రి నుంచి వచ్చినది. అతను తన తండ్రి రాజ్యమును ఎంతో ఎత్తులో ఉంచెను. కనుక మనము ఎంతో తగ్గింపు కలిగి ఉంటామో అప్పుడు ఎంతో ఎత్తుకు వెళ్ళెదము, కనుక అదేవిధముగా మన పాపముల నుంచి మనము విడిపింపబడాలంటే మనము దేవునికి చాల దగ్గర బంధమును కలిగి ఉండాలి. మన ఈ లోకము మనకు ఒక బంధికాణముగా ఉన్నది కనుక మనము విడిపింపబడలేము. మనము దేవుని ప్రేమకు సమర్పించబడకుండా ఈ లోక పరిస్థితులలో బందీలుగా ఉన్నాము. ఎందుకంటె మన జీవితాలు పాపములచేత నింపబడి ఉన్నాయి. అందుకే యేసు " పాపము" అని చెప్పియున్నాడు. ఎందుకంటె మనము దేవునికి వ్యతిరేకముగా ఉన్నాము కాబట్టి పాపమును చేయుచున్నాము. మనము పాపము చేయబడ్డాము కనుక మనము చనిపోతాము, పాపము అనగా ఏమి ? అపనమ్మకమే, అయితే ఎవరైతే క్రీస్తుతో కలిసి ఉంటారో వారు పాపమును విడిచెదరు. ఎందుకంటె యేసు రక్తము మన ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులనుగా చేయును. అతని శక్తి మన మనసులను బలపరచి తన ఆలోచనలచేత నింపును. అయితే ఎవరైతే క్రీస్తుకు దూరముగా ఉంటారో వారు మరణమును ఎన్నుకొనువారుగా ఉంటారు, వారు తీర్పుకొరకు ఎదురుచూచువారుగా ఉంటారు. కేవలము క్రీస్తు మీద విశ్వాసము మాత్రమే మనలను దేవుని ఉగ్రత నుంచి కాపాడును. ఒక మనిషిలో విశ్వాసమును అంగీకరించుటకు క్రీస్తు ఎవరు ? అందుకే అతను ఈ విధముగా "నేను నేనే" (యోహాను 6:20; మరియు 8:24). అప్పుడు అతను అందరి సాక్ష్యములను నేర్చుకొనెను. అందుకే తనను తాను ప్రభువు సత్యము అని పిలవబడ్డాడు, జీవము కలిగిన దేవుడు, మోషేకు కూడా మండుచున్న అగ్ని పొదలో కనబడిన దేవుడు ఆయనే " నేనే" (నిర్గమ 3:14; యెషయా 43:1-12) . కనుక మనకు వేరే ఇతరుల ద్వారా రక్షణ లేదు. ఈ విషయమును బట్టి ప్రతి యూదునికి ఈ సత్యము తెలుసు అయితే ఎవ్వరు కూడా దేవుని నామమును వ్యర్థముగా పలుకుటకు ధైర్యము చేయలేకపోయిరి. అయితే యేసు వారిని బహిరంగముగా పిలిచెను. అతను కేవలము దేవుని కుమారుడైన క్రీస్తు మాత్రమే కాదు అయితే ఎహ్వెహ్ మరియు దేవుని సత్యమై ఉన్నాడు. అతను సువార్త సంక్షేమమే ఉన్నాడు. క్రీస్తు శరీరములో దేవుడై ఉన్నాడు. కనుక ఎవరైతే అతని యందు విశ్వాసముంచుదురో వారు జీవించబడెదరు . అయితే ఎవరైతే అతనిని వ్యతిరేకించెదరో వారు అతని క్షమాపణను పొందుకొనలేరు. కనుక విశ్వాసము అవిశ్వాసము మనిషి గమ్యమును నిర్దేశించును. ప్రశ్న:
|