Waters of LifeBiblical Studies in Multiple Languages |
|
Home Bible Treasures Afrikaans |
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba
Previous Lesson -- Next Lesson యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
A - క్రీస్తు లో శరీరధారియైన దేవుని వాక్యము (యోహాను 1:1-18)
3. క్రీస్తులో దేవుని అవతారము (యోహాను 1:14-18)యోహాను 1:17-18 పాత నిబంధనకు క్రొత్తనిబంధనకు మధ్య తేడా ఏ విధముగా ఉన్నదంటే, పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా పిలువబడ్డారు, అయితే క్రొత్తనిబంధన ప్రకారము నీటి అనునది దేవుని కృప ద్వారా కలుగుతుంది. దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ఇచ్చి వాటి ద్వారా త్యాగమైన జీవితమును దయచేసియున్నాడు. కనుక ఎవరైతే వీటిని పాటించకపోతే వారు మరణమునకు పాత్రులుగా ఉండెదరు. దీని ప్రకారముగా ధర్మశాస్త్ర ప్రకారము వారికి మరణము వచ్చినది, ఎందుకంటె ఏ మనిషి కూడా కరెక్టుగా లేదు కనుక. ఎవరైతే వీటిని తెలుసుకొని ఉంటారో తమ జీవితాలలో మార్పుకలిగి ఉంటారు, మరియు ఎవరైతే వీటి ప్రకారముగా లేక ఉంటారో వారు మార్పు లేక ఉంది ఉగ్రతకు దగ్గర కలిగి ఉంటారు. ఎందుకంటె వారు ప్రేమ కలిగి లేక గర్వముతో కూడి ఉంటారు. ఖచ్చితముగా ధర్మశాస్త్రముకూడా పరిశుద్ధముగా ఉంది దేవునికి అది ప్రతిరూపముగా ఉంటుంది. అయితే దీని ముందు ప్రతి మనిషి చెడ్డగా కనపడి మరణమునకు దగ్గరగా ఉంటారు. అందుకే మొదటగానే యోహాను తన సువార్తలో యేసు క్రీస్తు మరణమునకు వెళ్లువారికి రక్షణను దయచేసి తన వెలుగును వారికి ప్రకాశించుటకు సిద్ధముగా ఉన్నాడని వ్రాసియున్నాడు. ఎందుకంటె వాగ్దాన నజరేయుడైన క్రీస్తు మెస్సయ్య గా ఉంది పరిశుద్ధాత్మచేత నింపబడి దేవుని ఉగ్రతనుండి తప్పిచువాడుగా ఉన్నాడు. ఆటను రాజులకు రాజుగా, దేవుని వాక్యముగా మరియు ఒక గొప్ప యాజకుడుగా ఉన్నాడు. కనుక ఆయన ప్రతి విధమైన రక్షణకు నిరీక్షణ గలవాడై ఉన్నాడు. క్రీస్తు ఒక వస్తువు మాదిరిగా రాలేదు అయితే ధర్మశాస్త్రము యొక్క శాపమును తొలగించుటకు వచ్చియున్నాడు. అందుకే మనకు ప్రతిగా ప్రతి కార్యమును జయించియున్నాడు. మన పాపములను భరించి మరియు ఈ లోక తీర్పు నుంచి తప్పించి మనలని దేవునికి డాగారగా చేసియున్నాడు. దేవుడు మన పాపములను బట్టి మనకు శత్రువుగా లేదు అయితే యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు సమాధానమును దయచేసియున్నాడు. మానవుని స్వరూపమును ధరించిన క్రీస్తు పరలోకమునకు వెళ్లి తన పరిశుద్ధాత్మను మనకొరకు పంపియున్నాడు. ధర్మశాస్త్రమును మన హృదయాలలో ఉంచి మన హృదయాలను సత్యముచేత మరియు పరిశుద్ధత చేత నింపి మంచి గౌరవమైన ఆలోచనలచేత నింపియున్నాడు. కనుక మనము ఇక ధర్మశాస్త్రప్రకారముగా ఉండక క్రీస్తు మనలో నివాసము చేసియున్నాడు. ఈ విధముగా దేవుడు మన ప్రతి అవసరమును తీర్చుటకు తన శక్తి చేత ప్రేమ చేత మనలను నింపియున్నాడు. క్రీస్తు రాకడ ద్వారా తన కృప కూడా ప్రారంభమైనది కాబట్టి మనము అందులో నివసిస్తున్నాము. దేవుడు మన నుంచి కానుకలు, సేవ, లేదా త్యాగమును అడగక, మన కొరకు తన అడ్వెతీయ కుమారుడిని పంపి మనలను తన నీటిద్వారా నడిపించుచున్నాడు. కనుక ఎవరైతే తన యందు సంపూర్ణ నమ్మకము ఉంచుతున్నారో వారు సమర్దిన్చుకుంటారు. కనుకనే మనము అతనిని ప్రేమించి మన జీవముకలిగిన త్యాగమును అతనికి చెల్లించగలము. క్రీస్తు రాకడ ద్వారా తన కృప కూడా ప్రారంభమైనది కాబట్టి మనము అందులో నివసిస్తున్నాము. దేవుడు మన నుంచి కానుకలు, సేవ, లేదా త్యాగమును అడగక, మన కొరకు తన అడ్వెతీయ కుమారుడిని పంపి మనలను తన నీటిద్వారా నడిపించుచున్నాడు. కనుక ఎవరైతే తన యందు సంపూర్ణ నమ్మకము ఉంచుతున్నారో వారు సమర్దిన్చుకుంటారు. కనుకనే మనము అతనిని ప్రేమించి మన జీవముకలిగిన త్యాగమును అతనికి చెల్లించగలము. కృప అనునది పరిశుద్ధాత్మలో ఒక విధమైన భావన కాదు. అయితే ఇది ఒక విధమైన హక్కుగా ఉన్నది. దేవుడు తనకు ఇష్టమైన వారికి క్షమాపణ ఇవ్వదు అయితే మరణమునకు దగ్గరగా ఉన్నవారికి తన క్షమాపణ ఇస్తాడు. ఏది ఏమైనా క్రీస్తు మన పాపములకు బదులుగా తన సిలువ మరణమును మనకు నీతిగా చేసియున్నాడు. కనుకనే కృప అనునది మన హక్కుగా మరియు జాలి అనునది దేవుని నిజస్వరూపముగా ఉన్నది. క్రీస్తు యొక్క కృప మనకు దేవునిలో హక్కుగా ఉన్నది. నీవు అడుగు : ఈ దేవుడు ఎవరు, పని చేయుటకు స్వాతంత్రము కలిగి అయినా కట్టుబడిఉన్నావా ? మేము సమాధానము చెపుతాము : చాలా కులాల వాళ్ళు దేవునిని అర్థము చేసుకొనుటకు ఇబ్బందిపడుతున్నారు. అయితే వారు భూమి మీద నుంచి పరలోకమునకు వేయబడిన నిచ్చెనవలె ఉండి ఏ మనిషి కూడా సృష్టికర్తను చూడలేదు, ఎందుకంటె మన పాపములు మనలను పరిశుద్ధునికి దూరముచేసియున్నాయి. దేవుని గురించిన వఙ్గమూలము అనిచ్ఛయముగా ఉన్నది. అయితే క్రీస్తు తన తండ్రి అయినా దేవునితో నిత్యుడై త్రిత్వమునకు ఒకడై ఉన్నాడు. అందుకే తండ్రి ఎవరో కుమారునికి తెలుసు. అయితే క్రీస్తు దేవుని వాక్యమై సత్యమునకు పాత్రుడుగా ఉన్నాడు. క్రీస్తు సమాచారమునకు కీలకము ఏమి ?మనము ప్రార్థన ఈ విధముగా చేయాలనీ నేర్పించాడు, " పరలోకమందున్న మా తండ్రి" ఈ విధముగా మనము పిలుచునప్పుడు దేవుని యొక్క పితృత్వము తెలియపరుస్తున్నది. దేవుడు అధికారి, జయించినవాడు, మరియు నాశనము చేయువాడు కాదు. అయితే మన తండ్రి మనలను ఏవిధముగా చూసుకొనుచున్నాడో అదేవిధముగా చూసుకొంటున్నాడు. తండ్రి ఒక వేళా కుమారుడు మట్టిలో పడితే, పైకి లేపి, మట్టిని తుడిచి ఈ లోకములో పడిపోవుటకు ఎలాంటి అవకాశము ఇవ్వడు. దేవుడు మన తండ్రి అని మనకు తెలిసిన తరువాత మన పాపములు కనబడుచున్నవి. మనము తిరిగి మన తండ్రి దగ్గరకు వెళ్ళుటప్పుడు మన పాపములను ఆయన కడుగును. కనుక మనము దేవునితో ఎల్లప్పుడూ జీవించెదము. క్రీస్తు ఈ లోకమునకు రాక మునుపు తన తండ్రి దగ్గర ఉన్నాడు. దీని ద్వారా మనకు తండ్రి అయినా దేవునికి కుమారుడైన క్రీస్తు కు గల సంబంధమును తెలుసుకోవచ్చు. దేవుని కుడి పార్శ్వమున మాత్రమే కూర్చోక దేవుని రొమ్మున ఉన్నవాడుగా ఉన్నాడు. దీని అర్థమే ఎవరితో ఉన్నదో ఆయన ఈయన అని. కనుక క్రీస్తు దేవుని గురించి చెప్పు ప్రతి మాట కూడా సత్యమే. కనుక తండ్రి ఎవరో కుమారుడు కూడా ఆయనే అదేవిధముగా కుమారుడు ఎవరో తండ్రి కూడా ఆయనే. ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి నిన్ను ఘనపరచి నిన్ను స్తుతిస్తున్నాము, ఎందుకంటె నీ అద్వితీయ కుమారుడైన క్రీస్తును మా కొరకు పంపినందుకు. మమ్ములను నీ సత్యమైన నీటిలోకి పిలిచినందుకు నీకు కృతఙ్ఞతలు. ప్రతి అవకాశమును దయచేసి మీ పితృత్వమును మాకు దయచేసినందుకు నీకు కృతఙ్ఞతలు. ప్రశ్న:
|