Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Tracts -- Tract 11 (Follow Me!)
This page in: -- Armenian -- Baoule? -- Burmese -- Chinese -- Dagbani? -- Dioula? -- English -- French? -- German -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Japanese -- Korean? -- Lingala? -- Maranao -- Nepali? -- Peul? -- Somali -- Spanish -- Sundanese -- TELUGU -- Thai? -- Turkish? -- Twi? -- Uzbek -- Yoruba

Previous Tract

చిన్న పత్రికలు - పంచడము కొరకు బైబిల్ వాక్యములు

చిన్న పత్రిక 11 -- నన్ను వెంబడించు! (మత్తయి 9:9)


మనము ఒక దేశమునించి మరొక దేశానికి విమానంలో ప్రయాణించినప్పుడు మనము చేరవలసిన గమ్యము రాగానే విమానం ల్యాండ్ అవగానే మనకొరకు చాలా వాహనాలు ఎయిర్పోర్ట్ బయట ఎదురుచూస్తుంటాయి , వాటిలో మనము గమనిస్తే, "నన్ను వెంబడించు" అని మనం చూడగలము.

"నన్ను వెంబడించు" అన్న మాట మనకు 2000 సం రాల క్రితం క్రీస్తు , అనగా మరియా కుమారుడు పలికిన మాట. నజరేతు పర్వతము మీద నుంచి వచ్చి జోర్డాన్ నది తీరుముదాకా పలికిన మాట. కపెర్నహూము అను స్థలములో క్రీస్తు స్థానము చేసుకొని తన దగ్గరకు వచ్చు ప్రతి రోగిని స్వస్థతపరచెను.అలాగే మారుమనస్సు పొంది పాపక్షమాపణ పొందుడని అక్కడున్న వారికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించెను. కనుక చాలామంది స్వస్థత కొరకు , హృదయ శాంతి కొరకు రక రకాల ప్రదేశములనుంచి రావడం జరిగింది. కనుక వారికి కావలసిన జీవము గల మాటలు క్రీస్తు దగ్గర కనుగొన్నారు.

మత్తయి అను సుంకపు గుత్తదారుడు ఇదే పట్టణమందు నివసించి, అక్కడున్న వారందరితో సుంకము తీసుకొని, అలాగే రోమీయులనుండి , అలాగే అక్కడకు వచ్చు ప్రతి వారినుంచి సుంకము తీసుకోవడము జరిగింది . తన సొంత ప్రజలే అతని యెడల బహు కోపము కలిగి ఉండిరి ఎందుకంటే తన సొంత ప్రజల దగ్గర కూడా తనకు తోచినంత సొమ్మును తీసుకోవడము జరిగింది కనుక. అయితే అక్కడున్న ప్రజలు సుంకము కట్టుటకు ఇష్టపడలేదు అయితే మత్తయి తన తెలివి చేత అనుభవము చేత వారిచే సుంకము తీసుకొన్నాడు.

అయితే మత్తయి వీఈటన్నిటిని బట్టి తన మనసు ఎంతో కలతచెందెను , వీటిని బట్టి క్షమాపణ పొంది , మనుషుల ద్వేషమునుంచి కాపాడుకొనబడి , సమాధాన హృదయము కలిగి ఉండాలని కోరుకొనెను.

క్రీస్తు ఇదే పట్టణములో ఉన్నాడు అని మత్తయికి తెలిసినప్పుడు అతనిని చూడాలని , తనం కలుసోకోవాలని , అతని ద్వారా సహాయము పొందగోరెను, ఎందుకంటే దేవుని దగ్గర మరియు మనుషులదగ్గర మత్తయి సమాధానము కలిగిఉండాలని కోరుకొనెను. అయితే తన వృత్తి రీత్యా నజరేయుడైన క్రీస్తుని కలవలేకపోయెను. ఎయితే క్రీస్తు గురించి విన్న తరువాత క్రీస్తుని ఏకాంతముగా కలవాలని ఆశపడెను.

హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు క్రీస్తు. మత్తయి యొక్క హృదయములో తనను చూడాలనే తపన ఉండడము క్రీస్తు గమనించి, ఒక దినము మత్తయి ఉన్నప్రాంతమునకు వచ్చెను అప్పుడు మత్తయి యొక్క హృదయము పశ్చాత్తాపముతో ఉండుటచూచి, "నన్ను వెంబడించు!" అని ఒక్క మాటలో మట్టియిని పిలిచాడు.

మత్తయికి ఎప్పటినుంచో దేవుని స్వరము వినాలని ఆశ ఉన్నది, కనుక ఎప్పుడైతే క్రీస్తు మత్తయిని పిలిచాడో అప్పుడు తనను తానూ మార్చుకొని క్రీస్తుని కలుసుకోవాలని ఆశపడెను. క్రీస్తు మత్తయిని పిలిచినప్పుడు మత్తయి క్రీస్తు ఖశ్చితంగా తనను స్వీకరిస్తాడు అని నమ్మి తనను ద్వేషించినా సమాజమును బట్టి ఆలోచించక క్రీస్తు తనను తనను వెంబడించువారిలో ఒకనిగా తనను చేర్చుకొంటాడు అని నమ్మకము కలిగి ఉండెను. ఈ అవకాశమును తప్పక ఉపయోగించుకోవాలని మత్తయి తలంచి తన పనిని వదిలి క్రీస్తును వెంబడించడము ప్రారంభించెను. అప్పుడు క్రీస్తును వెంబడించిన వారందరు ఈ సంఘటనను చూసి చాలా విస్మయమునొందిరి. ఈ మనిషి క్రీస్తును అంగీకరించడము వారెవ్వరికీ ఇష్టములేకపోయెను కనుక క్రీస్తు వారికి ఈ మాటలు చెప్పెను.

"అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్ను తానూ ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును".(మత్తయి 16:24-25)

క్రీస్తు తన శిష్యులకు అర్థమగునట్లు 7 రహస్య విషయములను చెప్పెను :

  1. న్యాయమైన కోరిక: దేవుని రాజ్యములోనికి వచ్చ్చు ప్రతివారినీ క్రీస్తు స్వాగతిస్తున్నారు. అయితే తనను పూర్తిగా వెంబడించుమని ఎవ్వరిని క్రీస్తు పిలువడములేదు, అయితే వారంతటికి వారు నిర్ణయము చేసికొని తనను వెంబడించుమని కోరుచున్నాడు. ఎవరైతే క్రీస్తుని వెంబడించే సమయములో కలుగు శోధనలు, కష్టాలు జయించి ఉండేదరూ వారే క్రీస్తు ద్వారా పిలువబడినవారు.
  2. నిన్ను నీవు తిరస్కరించుకొని క్రీస్తు కొరకు జీవించు: క్రీస్తును వెంబడించు వారికి ప్రారంభములోనే మిమ్ములను మీరు తిరస్కరికిన్చుకోమని క్రీస్తు వారికి ఆజ్ఞాపించెను. ఇతరులకంటే వారే ఎక్కువ అని ఎంచవద్దని వారికి తెలియపరచెను. లోకములో కలుగు ప్రతి సమస్యను బట్టి ప్రతి శ్రమను బట్టి చింతించువాడు అని చెప్పెను. కనుక ప్రియా దేవుని గొర్రెపిల్లను వెంబడించు ప్రతి వారు తమను తాము తిరస్కరించి క్రీస్తుని వెంబడించిరి.కాబట్టి క్రీస్తు కొరకు జీవించడము కొరకు మనలను మనమే తిరస్కరించుకోవాలి.
  3. నిన్ను నీవే పరిశీలించుకో: క్రీస్తు తనను వెంబడించువారికి, మీరు నీతిమంతులని, న్యాయవంతులని మిమ్ములను మీరు తీర్పు తీర్చుకొనవాడు అని బోధించెను. అయితే దానికి వేరుగా దేవుని ఎదుట పరిశీలించుకోమని వారికి చెప్పెను. క్రీస్తు తన సిలువను మోయమని మనలను ఆజ్ఞాపించలేదు అయితే మన సిలువను మనమే మోయమని చెప్పెను. దాని అర్థమేమనగా ప్రతి పాపికూడా వారి పాపమును బట్టి క్రీస్తుద్వారా తీర్పు తీర్చబడి, దేవుని పరిశుద్ధతలో పశ్చాత్తాపపడుమని వారికి ఆజ్ఞాపించెను. అపోస్తులుడైన పౌలు ఈ విధముగా వ్రాస్తున్నాడు "నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు". (గలతి 2:20).
  4. క్రీస్తు లా ఉండు : ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో వారు ఆయన స్వరము విని ఆయనయందు విశ్వాసముంచెదరు.అతను క్రీస్తు లా ఉండును. ఎవరైతే క్రీస్తును వెంబడించెదరో ఆయనను కనుగొని ఆయన ప్రణాళికలను తెలుసుకొని ఆయన శక్తితో నింపబడును. కనుక క్రీస్తును వెంబడించు వారు సంపూర్ణముగా మార్చబడి తన రక్షకుడైన క్రీస్తు లా ఉండెదరు.కనుక దేవుని ప్రేమను బట్టి, శాంతిని బాతి, సమాధానమును బట్టి , అదేవిధముగా పరిశుద్దాత్మను బట్టి తెలుసుకొంటాడు. ఓర్పు సహనమును పొంది తన శత్రువులను కూడా ప్రేమించి, మంచి విశ్వాసముతో ఉండును.
  5. ఇతరులకు క్రీస్తు గురించి చెప్పు : క్రీస్తు తనను వెంబడించు వారిని చుట్టూ ఉంచి, వారు ఆయనలో చూసిన ప్రతి దానిని ఇతరులకు చెప్పునట్లుగా వారిని ఉంచెను. ఎవరైతే వారి పాపములను ఒప్పుకొని వారికి నిత్యజీవము కావాలని అనుకున్నారో వారికి పరిశుద్దాత్మ శక్తిని ఇచ్చెను. క్రీస్తు వారి పరిస్థితులను మార్చాలని ఉద్దేశము లేదు కానీ వారి యొక్క జీవితమును మార్చి వారియొక్క బలహీనతతో వారికి బలమునీశ్చుటకు ఉద్దేశించెను. కనుక ఒక తీగ ఎలాగైతే చెట్టుకు కలిగిఉంటుందో అదేవిధముగా ఆయనలో ఉండువారిపై ఆయన వారిని ఫలించువారినిగా చేసెను, అప్పుడు వారు సమృద్ధి ఫలములను ఫలించుటకు కారకులైరి.
  6. శ్రమలు కలుగును: ఎవరికైతే క్రీస్తు యొక్క కృపను పొందియుంటారో వారు ఆయన తీర్పులో ఉంది, తన పరిశుద్దాత్మ యొక్క నిత్యజీవములోనికి వారు వచ్చెదరు. తరువాత ఆటను ఈ లోకములో ఒక పరదేశుడని తెలిసికొనును. తన షెహితులు తనను వెక్కిరించి తనను వారు తిరస్కరించెదరు, తన పట్ల అబద్ధము చెప్పి తనను ద్వేషించెదరు. క్రీస్తును ఇదే విధముగా చేశారు కనుక అతనిని వెంబడించువారి యెడల కూడా ఇదే జరుగును. ఈ లోక ఆత్మా దేవుని ఆత్మను ద్వేషించి, వ్యతిరేకముగా పోరాటం చేసెను. అయితే క్రీస్తు ప్రేమ, అతని ఆశీర్వాదము ఈ లోక శాపముకంటె బలమైనది. అపొస్తలుడైన పౌలు తన ప్రాణమును కాపాడుకొనుటకు అనేక ప్రాంతములకు వెళ్లి క్రీస్తు సేవ చేసెను.
  7. క్రీస్తు విశ్వాసులకు కట్టుబడిఉండెను: క్రీస్తు సిలువమరణమును జయించి లేచెను. ఆయన పరలోకమునకు లేపబడి తిరిగి తనను వెంబడించు వారిని తన తండ్రిదగ్గరకు తీసుకొనుటకు తిరిగి వచ్చును. తనయందు విశ్వాసము కలిగిన వారిని తన వెంటబెట్టుకొని వెళ్ళుటకు వచ్చి వారిని తనతో పాటు ఉంచుకొనును. తన ప్రేమ విశ్వాసము వారి భవిష్యత్తు పట్ల ఖశ్చితంగా ఉండెను. క్రీస్తును వెంబడించు వారు అంటే వారి పాపములను బట్టి క్షమించబడి తీర్పుదినమునుండి విడిపించినవారుగా ఎంచబడెదరు. తన నిత్యనిబంధనద్వారా మన ప్రవర్తన ఆయనకు కట్టుబడి ఉండునట్లు చేయును. మన శ్రమలనుంచి, కష్టములనుంచి మనకు ఓర్పును దయచేసి ,ఈ విధమైన పరిస్థితులనుంచి మనము జయము పొందునట్లు తన మహిమకరమైన సహాయమును మనకు దయచేయును.

మత్తయి వీటినన్నిటిని తన జీవితములో అనుభవించి వీటినిబట్టి తన జీవితములో అవలంభించుకొని , క్రీస్తు యొక్క ఆజ్ఞలన్నిటిని తన హృదయములో వ్రాసుకొనెను. (మత్త 5 :1 - 7:29 ). వేరే అపొస్తలులు కూడా తనను అభిషేకించి క్రీస్తు మాటలు దాచుకొనిరి .( లూకా 1:2 ). మత్తయి అందరికంటే పెద్ద సువార్తను వ్రాసెను. తన స్వంత మాటలను వ్రాయక క్రీస్తు తన హృదయములో దేనిని ఉద్దేశించెనో వాటినే తన సువార్త పత్రికలో క్రీస్తు యొక్క కార్యములను, అతని మాటలను వ్రాసెను. మత్తయి చాల నమ్మకముగల క్రీస్తు సాక్షి అని చెప్పబడెను. ప్రకటనగ్రంధములో క్రీస్తు యోహాను దగ్గర మత్తయి పరలోకములో క్రొత్త యెరూషలేమునకు ఒక ముఖ్యమైన విలువగల రాయి అని చెప్పెను (ప్రకటన 21:14,19,20)

మత్తయి తన సంపాదనను మరియు తన పనిని వదిలి క్రీస్తును వెంబడించడము ప్రారంభించెను. క్రీస్తుతో ప్రయాణము చేయడము అతనికి సులువు కాదు అయినప్పటికీ క్రీస్తు కొరకు తాను పొందిన దానిలో తృప్తి పది అతనిని వెంబడించెను. ఒకప్పుడు సుంకపు గుత్తదారుడుగా ఉన్నప్పటికినీ తాను దానివిషయమై ఆలోచించక, ఇతరుల వాలే క్రీస్తు పట్టుబడిన సమయము వరకు అతనిని వెంబడించెను.

ఒకప్పుడు మత్తయి తనతో పాటు పనిచేస్తున్నవారందరికి నాయకుడుగా ఉన్నాడు, అయితే క్రీస్తును వెంబడించడం ప్రారంభించినప్పు తగ్గింపు స్వభావము కలిగిన వాడు గా మారెను. ఈ లోకపు ఆశలన్నిటిని వదిలి క్రీస్తు ఇచ్చు తృప్తిని బట్టి అతిశయించెను. రోమీయులతో పాటు చేస్తున్న పనిని విడిచిపెట్టి క్రీస్తు యొక్క పరిచారకులతో ఒకడిగా మెలగెను. క్రీస్తు తన పాపములన్నిటిని కడిగి పరిశుద్దతను అతనికి దయచేసెను. ఒంటరి జీవితమును వదిలి పరిశుద్ధాత్ముడు, దేవుని కుమారుడును అయినా క్రీస్తు ఇచ్చు శక్తిని పొందియున్నాడు.

క్రీస్తు "నన్ను వెంబడించు" అని మత్తయికి చెప్పెను , అనగా ఒక రాజకీయ పార్టీని వెంబడించు అని కాదు అయితే దేవుని యొక్క జీవముగల వాక్యమును వెంబడించు అని చెప్పెను. క్రీస్తు మాత్రమే తన మంచి భవిష్యత్తు అని నిజాము తెలుసుకొనెను కనుకనే క్రీస్తు అతనికి రక్షకుడు,స్వస్థపరచువాడు,విమోచించువాడు,విడిపించువాడు మరియు తన శక్తి అయి యుండెను. క్రీస్తు మత్తయికి బదులుగా తీరూపుదినమందు చనిపోయెను అందుకే మత్తయి ఆయన యెడల విశ్వాసము కలిగి ఈ విధముగా పేతురు కు వ్రాసెను "అందుకు సీమోను పేతురు నీయవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను".(మత్తయి 16:16)

ప్రియా చదువరి.
నిష్కళంకమైన హృదయముతో దేవుని కొరకు ఎదురుచూస్తున్నావా ? సృష్టికర్త అయినటువంటి పరలోకపు తండ్రి ఎదుట సమాధానము కలిగి ఉండాలనుకుంటున్నావా ? మంచి , చెడ్డ దినములయందు నీ రక్షకుడైన క్రీస్తుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నావా ? నిన్ను నీవే పరిశీలించుకో ; " నన్ను వెంబడించు " అని మత్తయి ని పిలిచినట్టుగా నిన్ను కూడా పిలిచినట్టు ఆయన స్వరమును విన్నట్లైతే ఒక నిర్ణయము కలిగిఉండు. విమానాశ్రయములో వాహనాలు ఎదురుచూచుట జ్ఞాపకము చేసుకో, నీ పాపాములో నుంచి నిన్ను విడిపించి నిన్ను తనను వెంబడించుమని క్రీస్తు పిలుచుచున్నాడు, నీ జీవితములో ఎవరు నీ ఉద్దేశమై ఉన్నారో తెలుసుకొని వారిని నీ గమ్యముగా చేసుకో. క్రీస్తును వెంబడించినట్లైతే తన సంతోషమైన తృప్తితో నిను నింపినప్పుడు నీవు నీ శాంతోషమును ఇతరులతో పంచుకొనెదవు. నీకు ఈ విధమైన పత్రికలూ పంపుటకు మేము సిద్ధముగా ఉన్నాము.

మా చిరునామా
WATERS OF LIFE
P.O. BOX 60 05 13
70305 STUTTGART
GERMANY

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on September 20, 2018, at 01:20 PM | powered by PmWiki (pmwiki-2.3.3)