Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- John - 046 (Sifting out of the disciples)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
B - యేసు జీవాహారము (యోహాను 6:1-71)

5. శిష్యులను పరిశోధించుట (యోహాను 6:59-71)


యోహాను 6:59-60
59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. 60 "ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని - ఇది కఠినమైన మాట,ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి."

దేవుని ఆహారమును మరియు వారికి ఆహారమును ఇచ్చుటను కొన్ని కొన్ని సందర్భములలో జరిగి ఉన్నది. అతను కొన్ని అంశములను చెప్పి వాటి అర్థమును చెప్పియున్నాడు. యోహాను వారి చర్చలకు సంబందించిన వాక్యములను తీసుకొన్నాడు. మనము గమనించినట్లయితే యేసు సైనాగోగులో తన మాటలను వింటున్నవారికి నేను మోషే కంటే ప్రముఖ్యుడని చెప్పుట మనము గ్రహించవచ్చు. మరియు విశ్వాసులందరు దానిలో పాలుపంచుకొని అతని శరీరమును మరియు రక్తములో కూడా పాలుపంచుకొనువారుగా ఉండిరి.

ఈ విధమైన ప్రకటన వారందరి దగ్గర ఉండెను మరియు యేసును వెంబడించువారుకూడా ఈ మాటలను వెంబడించువారుగా ఉండిరి. అప్పడు వారు అనుమానించి ప్రశ్నలు కలిగి ఉండిరి. వారు దేవునికి లోబడక ఉండి , ఏవిధముగా క్రీస్తు శరీరమును రక్తమును సేవిచాలని అనుమానము కలిగి ఉండిరి. ప్పుడు దాయకలిగిన యేసు వారి హృదయములను తెరచి జీవాహారమునకు సంబంధించిన ఉపమాణములను వారికి బోధించెను.

యోహాను 6:61-63
61 యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను - ''దీనివలన మీరు అభ్యంతర పుచున్నారా? 62 అలాగైతే మనుష్యుకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు ? 63 "ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి, గాని"

యేసు శిచ్యుల ఆలోచనలను పసిగట్టి, వారి ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేదు. వారి ఫిర్యాదులను అవిశ్వాసుల మాదిరిగానే ఎంచెను, అయితే ఇవన్నీ కూడా వారు అపార్థము చేసుకొన్నారు కాబట్టి ఉపమాన భావనను వారు తెలుసుకొనలేక పోయిరి. అయితే వాటి అర్థమును క్రీస్తు వారికి చెప్పే ముందు అతను ఈ లోకమునకు రక్షించుటకు వచ్చాను అని చెప్పెను.

అతను వారి కొరకు నామ మాత్రముగానే అనగా ఆత్మీయముగా చనిపోలేదు అయితే ఆటను తన తండ్రి దగ్గల కూడా ఉండెను, ఎందుకంటె అతను అక్కడినుంచే వచ్చాడు కాబట్టి. అతను పరలోకమునుంచి వచ్చాడు కాబట్టి అతను ఈ లోకములో నిత్యమూ ఉండడు. వారు అతను నీటి మీద నడుచుట చూచిరి. తనను వెంబడించువారికి తన ఆత్మను దయచేయుటకు అతను పరలోకమునకు ఏతెంచెను. ఇదే అతని మరణమునకు మరియు అతని రాకడకు ముఖ్య ఉద్దేశముగా ఉన్నది.వారికి అతని బహుమానము అతని శరీరము కాదు అయితే వారి హృదయములోనికి రావడమే అతని బహుమానము; అయితే ఇది బాహ్య్స శరీరము కాదు అయితే ఆత్మచేత వారి జీవితములోనికి రావడము.

ఎందుకంటె యేసుకు తెలుసు ఈ శరీరము నుంచి ఉపయోగము లేదు అని. మన మైతే ఈ విధముగానే సృష్టించబడినాము అయితే మన ఆలోచనా విధానము మనలను చెరిపి యున్నది. మన శరీరములో జీవించే శక్తి లేదు కానీ కేవలము పాపముచేసి శక్తి మాత్రమే ఉన్నది. అందుకే అతను చెప్పినట్టు, " యెడతెగక ప్రార్థన చేయుడి , లేనిచో మీరు శోధనలో ప్రవేశించెదరు, ఆత్మ బలముగా ఉన్నప్పుడు శరీరము బలహీనంగా ఉంటుంది కాబట్టి".

యేసు ఆత్మ చేత మన జీవితములో ఉండుటను బట్టి అతనికి మహిమ కలుగును గాక . అతని యందు ఉన్న ఆత్మ ఒక రహస్యముగా ఉన్నది. అతని మరణము ద్వారా మనకు వారి ఐక్యతను మనము చూడవచ్చు. అందుకే యేసు నీకొదేమనుతో నీటిమూలముగా మరియు ఆత్మ మూలముగా మనము తిరిగి జన్మించినట్లైతే అప్పుడు మనము దేవుని రాజ్యములోనికి ప్రవేశించినవారము అవుతాము అని చెప్పి ఉన్నదియు. అందుకే యేసు పెంతేకొస్తు దినమందు ఈ బాప్తీస్మమును గూర్చి వివరించెను. అప్పుడు యేసు వారి జీవితములోనికి వచ్చి ప్రభురాత్రి భోజనంలో అందరు పాలు పంచుకొనుటకు ఒక గొప్ప అవకాశమును దేవుడు దీని ద్వారా మనకు దయచేసియున్నాడు. అయితే ఇవన్నీ జరగాలంటే అది కేవలము పరిశుద్దాత్మ వలననే జరుగును. కనుక పరిశుద్దటమే మనకు ఏదైనా జరిగించగలడు కానీ శరీరము కాదు. విశ్వాసుల జీవితాలలో దేవుని సన్నిధి కేవలము క్రీస్తు ఆత్మచేతనే ఉండును.

మనమీదను పరిశుద్దాత్మ ఏవిధముగా వచ్చును ? ఇది ప్రతి ఒక్కరు అనగా యేసుతో సంబంధము కలిగి జీవించాలని ఉద్దేశించు అందరికి అనగా యేసు శరీరములో మరియు ఆయన రక్తములో పాలుపంచుకొనుట ఒక తాళపు చేవిగా ఉన్నది. అందుకే " నా మాటలకు మీ చెవులు తెరచి నా సువార్తను అంగీకరించు" అనెను. క్రీస్తు దేవుని వాక్యమై ఉన్నాడు; ఎవరైతే అతని మాటలు విని అతని యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు పరిశుద్త్మ ద్వారా నింపబడతారు. అందుకే దేవుని వాక్యముల ద్వారా నీవు నింపబడి అతని శక్తిని నీవు పొందుకో. అప్పుడు నీవు శక్తి కలిగి ఉండెదవు. కనుక రక్షించు దేవుని కృప నీకు కలిగి తన జీవితములో నిన్ను ఉంచి నీకు తన అధికారమును దయచేయును.

యోహాను 6:64-65
64 "మీలో విశ్వసించనివారు కొందరున్నారు అని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో,మొదటి నుండి యేసునకు తెలియును." 65 మరియు ఆయన - తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిని'' అనెను.

యేసును వెంబడించిన ఎంతో మంది వీటిని అవలంబించుటలో తప్పిపోయిరి కనుక వాటిని వారు వదిలివేసిరి. తన శరీరమును మరియు రక్తమును తిని త్రాగుట ఆ గాలీలయాలో సువార్త చేయబడుతున్నప్పుడు ఒక ఫేమస్ గ ఉన్నది. మరియు ఆయనను వెంబడించువారు అతనిని విడిచిపెట్టిరి. అక్కడున్న వారి మనసులు యేసును అంగీకరించకపోయిరి, అతనితో నిబంధన చేయుటలో వారు ధైర్యము చేయలేక అతని త్యాగమును చూడలేక పోయిరి.

యేసు వారిలో కొంత మంది తన ఆత్మను తిరస్కరించి అతని రాకడకు తమ హృదయ తలుపులు మూసుకొనిరి. అప్పుడు వారి హృదయ వేదనను క్రీస్తు చూసేను. మరియు యూదా ఇస్కరియోతు ఆ గుంపులో కలిసిపోయినది కూడా యేసుకు తెలుసు. అందుకే యూదా ఇస్కరియోతు తన హృదయమును క్రీస్తు ప్రేమకు తేరవకపోయెను. అందుకే మీలో ఒకరు నన్ను చంపుటకు పూనుకొనెదరు అని చెప్పియున్నాడు.

చివరలో, యేసు వారికి చేపట్టు , ఎవ్వరు కూడా దేవుని ఆత్మ నడిపింపులేక ఎవ్వరు కూడా దేవుడిచ్చు జీవములోనికి వెళ్ళలేరు అని చెప్పెను. మన విశ్వాసము అనునది దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధముగా మనము అర్థము చేసుకోవాలి. కనుక తండ్రి ఆత్మ కొరకు నీ ప్రాణములను తెరువుము, క్రీస్తు సత్యమునకు అడ్డుగా ఉండకు. అప్పుడు నీలోనికి యేసు రావడము నీవు అనుభవించెదవు. కనుక యేసు నీ కొరకు సిద్ధముగా చేయబడిన జీవాహారము.

ప్రశ్న:

  1. జీవము ఇచ్చు ఆత్మ యేసు శరీరములోని ఏవిధముగా జతచేయబడుతుంది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:52 AM | powered by PmWiki (pmwiki-2.3.3)