Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- Acts - 027 (The Death of Ananias and Sapphira)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

14. అననీ మరియు సప్పీరా యొక్క మరణము (అపొస్తలుల 5:1-11)


అపొస్తలుల 5:7-11
7 ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను. 8 అప్పుడు పేతురుమీరు ఆ భూమిని ఇంతకే అమి్మతిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. 9 అందుకు పేతురుప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతొ 10 వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి. 11 సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను. 

ఈ తీర్పును బట్టి సంఘము కదిలించబడెను. ప్రతి ఒక్కరు ప్రభువు వెలుగులు వారు పాపములను చూసెరి, కనుక వారు దేవుని కోపమును బట్టి భయము చెందినవారైరి. కనుక అనేకులు పచ్చాత్తాపము కలిగి దేవుని ఎదుట భయము కలిగి పరిశుద్ధులైరి.

యవ్వనస్తుడు లేచి మరణించిన వాని శరీరమునకు వస్త్రముతో చుట్టెను. వణకుచున్న హృదయముతో వారు ఆ శరీరమును మోసుకొని, పరిశుద్దాత్మ మాటచేత పిడుగు వాలే కొట్టబడునట్లు ఉండిరి. ఎవరైతే ఆ శరీరమును మోసుకొన్నారో వారు ఖచ్చితముగా ప్రార్థన చేసి సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొని ఉంటారు. ధనాపేక్ష నుంచి నిరోధించబడిరి.

చనిపోయిన మనిషి భార్యకు దేవుడు అతని మోసమును బట్టి అతనికి మరణము తెచ్చియున్నాడని ఎవ్వరు ఆమెతో సంఘ సభ్యులు చెప్పలేదు. పరిశుద్ధాత్ముడు ఈ విషయమును చెప్పుటలో నిరోధించినది, ఎందుకంటె ప్రభువు ఆత్మ వ్యక్తిగత తీర్పును అన్వాయించినది అని అనుకొనిరి. ఎప్పుడైతే సాప్హిర సంఘములోనికి గర్వముగా వచ్చి తన సహకారమును తెచ్చెనో అప్పుడు పేతురు ఆమె దగ్గరకు వచ్చి ఇలా చెప్పెను: "నీవు నీ పొలమును అమ్మిన ప్రకారముగా ఇంత నీవు పొందుకున్నావా?" ఎందుకంటె అపొస్తలుడు ఆమెకు పచ్చాత్తాపము పడుటకు అవకాశము ఇచ్చెను, కనుక ఆమె దేవునితో సాయము మాటలాడుటకు. అయితే ఆమె సహజముగానే తన భర్తకు వ్యతిరేకముగా వెళ్లెను. ఆమె అతనికి మంచి మనసు కలిగి ఉండుమని చెప్పలేదు అయితే అతనితో మోసముతో వచ్చినదానిని పంచుకొనెను. ఒకవేళ ఆమె అతనిని అంత ఇవ్వవద్దు అని చెప్పి ఉండవచ్చు, ఎందుకంటె వారి కుటుంబమును బట్టి. అయితే ఆమె అబద్ధముచేత, గర్వముచేత మరియు వేషధారణచేత ఆమె భర్త దగ్గరకు చేరెను.

పేతురు ఆమె భర్తకు ఏవిధముగా అయితే చేసాడు, అలాగునే ఆ వేషధారణ కలిగిన స్త్రీ ముఖమునుంచి వస్త్రమును తీసివేసెను. సంఘములో జరిగిన మోసమును బట్టి అతను ఆమెను అడిగెను: "నీవు నీ భర్త ప్రభువు ఆత్మను ఏవిధముగా పరీక్షించిరి?" వివాహములో, భర్తకు లోబడుటముందు దేవునికి లోబడాలి. మనము మనుషులకంటే దేవునికే లోబడాలి, మన కుటుంబములలో కూడా. ఒకవేళ కుటంబములో భర్త చెడు చేస్తున్నప్పుడు, భార్య అతని మాటలను ఖండించి, హెచ్చరించి అతని కొరకు ప్రార్థన చేయాలి, అప్పుడు అతను వాటి నుంచి విమోచించబడతాడు.

సఫిరా మరియు ఆమె భర్త సాతాను ఆత్మకు వారి హృదయములను తెరచారు. పరిశుద్దాత్మ కార్యములు జరుగుటకు వ్యతిరేకించిరి, మరియు గర్వము, అబద్ధము, మరియు వేషధారణ ఆత్మ ప్రవేశించుట ప్రారంభించెను. ఈ ఆత్మను వారు నీతి అను స్థలములోనికి తెచ్చుటకు ప్రయత్నమూ చేసిరి. ఒకవేళ ఇది గమనించకపోతే సంఘములో ఉన్న ప్రేమను ఇది చంపేది, మరియు వారి పాదముల క్రిందకు తెచ్చునది. అపొస్తలులు వారికి పొలము అమ్మితే వచ్చిన మొత్తమును తెమ్మని చెప్పలేదు. సభ్యులందరి ముందు వారు ఈ అబద్ధమును ప్రచారము చేసిరి.

దేవుని ఉగ్రత ఈ మోసము చేసిన స్త్రీ పైన కూడా వచ్చెను. అపొస్తలుల పాదములచెంత ఆమె మరణమును ప్రభువు తెచ్చెను, అదే స్థలంలోనే ఆమె సంపూర్ణముగా తన జీవితమును త్యాగముచేయుటకు ఇష్టపడలేదు. ఆమె పడిపోయినది గొప్పది. సంఘములో ఉన్న ప్రతి స్త్రీ కూడా వారి కుటుంబములో వారి భర్తల బాధ్యతలను బట్టి ఆలోచన చేయుట ప్రారంభించిరి. స్త్రీలు వారి భర్తలను, పరలోకమునకు నడిపించెదరు లేదా నరకములోనికి త్రోసెదరు. ప్రార్థన శక్తి కలిగిన స్త్రీలు వారి భర్తల శ్రమలనుంచి విడిపించబడెదరు కనుక వారు దేవుని యందు నమ్మకము కలిగి ఉండెదరు. ఏ స్త్రీ అయితే తన భర్తను ఘనపరచి కీర్తి కలుగునట్లు చేయునో, అప్పుడు వారందరు సాతాను కుటుంబమంతా నుంచి విమోచించబడును.

నకిలీ కలిగిన స్త్రీని మోసుకొని వెళ్తున్న యెవ్వనస్తుల హృదయము త్వరగా కొట్టుకొనెను, ఎందుకంటె ఆమెను అతని ప్రక్కన పూర్చుచున్నప్పుడు. ఇది ఆ సమాజమునకు ఒక ఫాఠముగా ఉండెను. ఎందుకంటె ఒకే కుటుంబమునకు చెందిన భార్య, భర్తలజు ఒకే దినము చనిపోవుట ఆ సంఘములో జరిగెను. మరియు పరిశుద్దాత్మ ద్వారా నింపబడిన వారికి ఇది చాల భయంకరమైన విషయముగా ఉండెను. వారిలో వారికే ఆశ్చర్యము కలిగెను: ఈ జంటను బట్టి మనము గమనించగలుగుతున్నామా, మరియు వారిని హెచ్చరించుటలో విఫలమవుతున్నామా?

మన హృదయములలో వారికంటే మంచిగా ఉన్నామా? అననీ మరియు సఫిరియా క్రైస్తవులకు ఒక హెచ్చరికలాగా ఉన్నారు, దేవుడు ఈర్ష్య కలిగిన వాడు మరియు దహించు అగ్ని కలవాడు.

ప్రార్థన: ఓ పరిశుద్దుడైన దేవుడా, నీవు సర్వమును ఎరిగిన వాడవు. నీకు మా గతము మరియు ఇప్పుడున్న స్థితి నీకు తెలుసు. మమ్ములను శ్రమలోనికి వెళ్లకుండా మమ్ములను విడిపించు. నన్ను ధనాపేక్ష నుంచి మరియు అబద్ధములు నుంచి కాపాడు; నీ కుమారుని రక్తముచేత నన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరచు. మా సంఘములలో నిటారుగా ఉన్న కుటుంబములను ఉంచు అప్పుడు మేము ఒకరితో ఒకరు సత్యమునే మాట్లాడగలము. ఆమెన్

ప్రశ్న:

  1. వివాహ బంధములో ఉన్న వారి ఆత్మీయ పని ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 11, 2020, at 08:50 AM | powered by PmWiki (pmwiki-2.3.3)