Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- Acts - 001 (Introduction)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు

అపొస్తలుల కార్యములో క్రీస్తు విజయోత్సవ ఊరేగింపు ఏవిధముగా ప్రారంభమైనది


క్రీస్తు షరీరము సమాధిలో క్షయము కాలేదు, కనుకనే ప్రభువైన యేసు క్రీస్తు జీవము కలిగి ఉన్నాడు. అతను నిజముగా మరణమును గెలిచి లేచి తన శిష్యులకు నలభై దినములు కనపడి ఉన్నాడు. మరియు దానికి కొనసాగింపుగా అతను పరలోకమునకు వెళ్లి తన తండ్రి అయినా దేవుని కుడిపార్శ్యమున కూర్చున్నాడు, అక్కడే అతను పరిశుద్ధాత్మతో ఐక్యత కలిగి నిత్యమూ జీవించి ఉన్నాడు.

క్రీస్తు పరలోకమునకు ఏతెంచెను కనుక అక్కడ అతను సాతాను శక్తులకు వ్యతిరేకముగా మరియు ముందు జాగ్రత్తగా సంఘమును కట్టుచున్నాడు. అతని సంఘము ఫలములతో మరియు విజయముతో కలిగి ఉన్నది. అపొస్తలుల యొక్క కార్యములు మనిషి దేవునితో సయోధ్యకు చేయబడి ఉన్నది. క్రీస్తు సభ్యులందరూ కూడా ఈ విజయములో పాలుపంచుకున్నారు. కనుక సిలువ అపొస్తలులకు పునాదిగా మరియు నిలబడివుంది.

యేసు పరలోకమునకు వెళ్ళాక ముందు, యెరూషలేము విశ్వాసము కొరకు యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించెను. అతని ఆశ వారి హృదయములలో పరిశుద్దాత్మ శక్తిని నింపుట, అప్పటినుంచి యెరూషలేము నుంచి రోమా కు సువార్తను ప్రకటించుటకు అవసరమై ఉన్నది. కనుక క్రీస్తు ఈ లోకమునకు ప్రకటించుమని మరియు తన ఆజ్ఞను వారికి యిచ్చియున్నాడు. పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నాడు కనుక వేరే ఏ శక్తి కూడా ప్రకటించుటకు మరియు కార్యము చేయుటకు అవసరము లేదు.

అపొస్తలుల కార్యముల యొక్క విషయము

ఎవరైతే ఈ పుస్తకమును చదువుతారా వారికి అపొస్తలులు దీనిని చేసారని మాత్రమే కాక, క్రీస్తు యొక్క కార్యములు అతని శిష్యులలో తన ఆత్మ ద్వారా కార్యములు అతను పరలోకమునకు వెళ్ళినతరువాత కూడా జరిగి ఉన్నవి. ఈ పుస్తకము అపొస్తలులు చేసిన అద్భుత కార్యములను కూడా జ్ఞాపకము చేసి ఉన్నది, మరియు ఎక్కువగా పౌలు మరియు పేతురు యొక్క కార్యములను జ్ఞాపకము చేసి ఉన్నది. 13 వ అధ్యము నుంచి మనము పేతురును గురించి, మరియు అతని మరణమును గూర్చి మనము ఈ పుస్తకములో చూడలేము. పౌలు యొక్క పరిచర్యను బట్టి క్లుప్తముగా చెప్పబడి, మరియు రోమా లో అతని కారాగారమును గూర్చి కూడా చెప్పబడి ఉన్నది. గ్రంధకర్త అపొస్తలుల కార్యములను బట్టి ఖచ్చితముగా మరియు కాలానుక్రమముగా చెప్పబడలేదు. బదులుగా చదువు వారికి అతను చెప్పడము ఏమనగా క్రీస్తు సువార్తకు సంబంధించిన ఆర్థిక వనరులను అనగా యెరూషలేము నుంచి రోమా వరకు కావలసిన వాటిని సమకూర్చుటకు చెప్పెను.

ప్రభువుకు పరిచారము చేసేవారు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండి ఇతరులకు కూడా సువార్తను అనగా వారికి రక్షణ వారి పట్టణమునకు వచ్చువరకూ. కనుక అపొస్తలుల విషయము రక్షణ సువార్తకు నిజమైన విజయముగా క్రీస్తులో మరియు యెరూషలేము నుంచి రోమా వరకు ఉండెను.

ఈ పుస్తకము యొక్క కూర్పు

దేవుని రాజ్యము విస్తరించుటలో జరుగు ఆత్మీయ యుద్ధమును బట్టి అపొస్తలుడు ఏ విషయమును కూడా క్లుప్తముగా వ్రాయలేదు. అయితే జీవముకలిగిన ప్రభువు వ్యక్తిగతముగా అప్పుడప్పుడు జోక్యం చేసుకొన్నాడు, అతని సంఘము చివరి వరకు బలపరచువరకు అతని సంఘము జీవము కలిగి ఉండాలి.ప్రభువు గ్రీకు బాషా మాట్లాడు పౌలును ఎన్నుకొని రోమా లో తన సువార్తను చాటుటకు ఎన్నుకొని ఉన్నాడు. ప్రభువు పౌలును ఎన్నుకోను ముందు స్తెఫేనును మరియు అతనితో పాటు యూదులను క్రైస్తవులగుటకు పాలిస్తేనాలో వారిని వాడుకొని ఉన్నాడు. దానికి ఫలముగా రెండు గుంపుల సమస్యలు తీర్చబడినాయి. దీని కొరకే ప్రభువు అపొస్తలులును ఐక్యపరచి ఉన్నాడు, మరియు యెరూషలేములోవారు ఆత్మీయ ప్రేమకలిగి మొదటివారుగా ఉండునట్లు (15 వ అధ్యయము ). వారు కృప ద్వారానే రక్షణను పొందారు కానీ నీతికలిగిన కార్యముల ద్వారా కాదు. దీని ప్రకారముగా అన్యుల సంఘములు యూదుల ద్వారా ధర్మశాస్త్ర విషయములో బలపరచబడి ఉండిరి. క్రీస్తు ప్రేమ యొక్క గణనము ఈ లోక మతముగా మారి, నూతన భూభాగముగా మారిపోయెను.

అదేసమయములో జీవము కలిగిన దేవుడు తనకు తాను అంతియొక్ లో రెండవ క్రైస్తవముగా యెరూషలేములో మొదటిది అప్పుడే స్థాపించబడునట్లు కనుగొనబడెను. అంతియోచ్ లోనే మొదటగా సువార్త విస్తరించబడెను, ఆసియా ఖండము వరకు అది వ్యాపించి యున్నది. గొప్ప శక్తి ద్వారా సువార్త ఆసియా ఖండము నుంచి ఐరోపా వరకు వ్యాపించబడెను, మరియు గ్రీకు పట్టణముల నుండి రోమా వరకు చేరెను.

మూడు భాగములుగా ఈ పుస్తకము విభజించబడెను:

యెరూషలేములోని ప్రారంభపు సంఘము
(1-7 అధ్యాయములు)
సమారియా నుంచి అంతియోచ్ వరకు సువార్త వ్యాపించడము
(8-12 అధ్యాయములు)
ఆసియా కహండములో మరియు గ్రీసు లో సువార్త ప్రకటించబడుట రోమా లో పౌలు చివరి దశకు చేరుకొనుట
(13-28 అధ్యాయములు)

రచయిత ఎవరు?

ఈ పుస్తకము యొక్క రచయిత తన పేరును గుర్తించలేదు, మరియు ఏవిధమైన సాక్ష్యములను కూడా ఇవ్వలేదు, తనకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. అయితే అక్కడ ఏకగ్రీవ ఒప్పందం గ్రీకుడైన లూకా ప్రారంభములో రచయితని చెప్పెను. అతను ఖచ్చితమైన జ్ఞానమును ఆ పరిస్థితులలో క్రైస్తవులకు ఇచ్చెను. లూకా కూడా గ్రీకు భాషలో ప్రావీణ్యము చెందినవాడు. అతను తన నివేదికను ప్రేమతో కనికరముతో వ్రాసి తన అపొస్తలుల ప్రసంఘములను ధారాళముగా క్లుప్తముగా వ్రాసిపెట్టాడు. ఈ పుస్తకములో అన్యులలో ఉన్న భక్తిగలవారిని అతను చూపుతున్నాడు,ఎందుకంటె అతను కూడా సువార్త సాక్ష్యము ద్వారా రక్షింపబడక మునుపు వారిలో ఒకడుగా ఉండెను. లూకా తన రెండవ సువార్త ప్రయాణములో పౌలుతో పాటు త్రోవ నుంచి ఫిలిప్పు వరకు వెళ్లెను. అక్కడ రోమా వీధులలో సువార్త ప్రకటించునప్పుడు అతను కూడా ఉండి, తరువాత నూతన సంఘములను బలపరచుటకు పౌలు అతనిని వదిలి వెళ్లెను. అయితే యెరూషలేమునకు వచ్చినప్పుడు అపొస్తలుడు అతనిని తిరిగి వెంటబెట్టుకొనెను, అక్కడే లూకా తన గురువును విడిచి అపొస్తలుల కార్యములకు సంబంధించిన సమాచారమును సమకూర్చుకొనెను. లూకా పౌలును కైసేరియలో మరియు అక్కడి తరువాత అప్పుడప్పుడు అతనిని కలుసుకొనెను. అతనితో కొనసాగి, పరిచర్య చేసి మరియు ఆత్మీయముగా అతని ద్వారా ఎంతగానో ఆకట్టుకొనబడెను. తరువాత పౌలు యొక్క రక్షణను అతను రోమా అధికారుల ముందు శ్రమలను బట్టి వ్రాసెను. అతను రోమా లోనికి ప్రవేశించువరకు అపాయములో అతను ఉన్నాడు కనుక అతనిని వదిలి ఉండలేదు. "మేము" అను బహువచనం ఏమనగా శ్రమలన్నిటిలో పౌలుతో లూకా కూడా ఉన్నాడని అర్థం.

ఎవరికి ఈ పుస్తకము వ్రాయబడెను

ఈ పుస్తకమును థియోఫిల్స్ కు పూర్తిగా అంకితము చేయబడెనని సువార్తీకుడైన లూకా వ్రాసెను, మరియు అదే మనిషిని గూర్చి అతని పరిశుద్ధ సువార్తలో కూడా చెప్పి యున్నాడు. లూకా ఇక్కడ ఇద్దరిని బట్టి వ్రాసియున్నాడు, మొత్తము ఏర్పాటుచేయబడెను అయితే రెండు భాగాలుగా. మనము థియోఫిలుస్ గురించి కొన్నివిషయాలు నేర్చుకోవచ్చు (లూకా). థియోఫిల్స్ అనగా "దేవుని ప్రేమికుడు" అని అర్థము, అతను రోమా సామ్రాజ్యములో ప్రాముఖ్యమైన వ్యక్తి. అతను అంతియొక్ లో పరిచర్య చేసేటప్పుడు క్రీస్తు మీద విశ్వాసము కలిగెను. క్రైస్తవమునకు సంబంధించిన ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఆశకలిగి ఉండెను, మరియు రోమా సామ్రాజ్యము వారు సంఘములను ఏవిధముగా భావము కలిగి ఉందిరా అని గమనించెను. ఎందుకంటె సువార్తకు సంబంధించిన సూత్రములు ఈ లోకములో ఏవిధముగా నూతన ఎదుగుదలను ఇస్తాయో అని ఎదురుచూసేను. పౌలుతో తాను ఉన్నప్పుడు క్రీస్తు యేసు యొక్క జ్ణానమును గూర్చి బేత్లెహేములో సమాచారమును సేకరించెను. అప్పుడు థియోఫిల్స్ కు అతను సేకరించిన సమాచారమును ఇచ్చి, సంఘములో దేవుని శక్తి ఏవిధముగా కార్యము చేయబడునో చెప్పెను. అతనిని విశ్వాసమందు బలము స్థాపించబడునట్లు ఆశకలిగి ఉండెను, పౌలు ఫిలిప్పులో ఉన్న జైలు అధికారితో చెప్పినట్లు: "నీవును నీ యింటివారును రక్షింపబడునట్లు యేసు ప్రభువు మీద విశ్వాసముంచుము".

తారీఖు

AD 61 లో పౌలు రోమా లోనికి ప్రవేశించాడు. ఆ తరువాత పరిస్థితి సమస్యగా మారిపోయింది, ఎందుకంటె లూకా సమయములో మిధ్య సువార్త కూడా ఉన్నది కనుక ఈ సువార్తను లూకా వ్రాసియున్నాడు. కనుక దాదాపు AD 62-70 మధ్య కాలములో వైద్యుడైనటువంటి లూకా ఈ అపొస్తలుల కార్యములను వ్రాసి ఉండెను.మరియు రెండవ భాగముగా క్రైస్తత్వము సువార్తకు కొనసాగి ఉండెను. అక్కడ అతను విచారణను, శ్రద్ధను, మరియు ప్రార్థనను గూర్చి వ్రాసిఉండెను. అతను క్రీస్తు జీవితమును కన్నులారా చూసినవారితో మరియు మరియా తో మరియు ఫిలిప్పుతో మాట్లాడివుండెను. క్రీస్తును మరియు అతని కార్యములను బట్టి తన పత్రికలో అతను వ్రాసి వాటిని ఉద్భవించాడు. అపొస్తలుల కార్యములను బట్టి అతను సమాచారమును కూడా సేకరించి ఉన్నాడు. తరువాత రెండు కార్యములను బట్టి అతని థియోఫిలుస్ కు సమర్పించుకొని ఉన్నాడు.

ఈ వైద్యుడను బట్టి మేము ప్రభువైన యేసు క్రీస్తుకు హృదయ పూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాము. అయితే జ్ఞానము కలిగిన మరియు జీవముకలిగిన ప్రభువు త్వరగా తిరిగి రాదనీ అతను చెప్తున్నాడు, కనుక అంతియొక్ లో ఉన్న క్రైస్తవులు పరిశుద్దాత్మ ద్వారా రక్షణ సువార్తను ఈ లోకమంతటికీ చాటిచెప్పారు. ఒకవేళ లూకా శ్రద్ధతో మరియు ఖచ్చితత్వముతో పనిచేయకపోతే మనము దేవుడు తన రాజ్యమును గ్రీకు దేశములో ఏవిధముగా వ్యాపింపచేశాడో తెలియలేకపోయెదము. ఆ సమయము నుంచి క్రీస్తు మనకు ఈ పుస్తకములో సువార్తను ఏవిధముగా ప్రకటించాలి మరియు సంఘమునకు ఏవిధముగా సహకరించాలి చెప్పెను. పరిశుద్ధాత్ముడు విశ్వాసులను ఏవిధముగా నూతనపరచగలడో మనము చూడవచ్చు. కనుక అపొస్తలుల కార్యములు చదువుట కంటే ఎక్కువైనా పుస్తకములు వారికి ఏవి కూడా లేవు. అప్పుడు అక్కడ ఎవరైతే క్రీస్తుకు లోబడి ఉంటారో వారిలో అతని హస్తమును మరియు అతని కార్యములను కూడా మనము చూడవచ్చు.

ప్రశ్న:

  1. అపొస్తలుల కార్యములను పౌలు వ్రాయటకు గల ఉద్దేశము ఏమిటి? థియోఫిలస్ గురించి నీకు ఏమి తెలుసు?

www.Waters-of-Life.net

Page last modified on April 11, 2020, at 08:55 AM | powered by PmWiki (pmwiki-2.3.3)