Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- Acts - 020 (Peter’s Sermon in the Temple)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Azeri -- Bulgarian -- Cebuano -- Chinese -- English -- French -- Georgian -- Greek -- Hausa -- Igbo -- Indonesian -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Turkish -- Urdu? -- Uzbek -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

అపోస్త - క్రీస్తు యొక్క విజయోత్సవ ఊరేగింపు
అపొస్తలుల కార్యముల యొక్క అధ్యయనాలు
భాగము 1 - యెరూషలేములో, యూదయలో, సమారియాలో మరియు సిరియా లోని సంఘములో క్రీస్తు యేసు పునాది - అపొస్తలుడైన పేతురు పరిశుద్దాత్మ ద్వారా ప్రాపకం చేయబడినది (అపొస్తలుల 1 - 12)
A - యెరూషలేములో ఉన్న ప్రారంభపు సంఘ ఎదుగుదల మరియు అభువృద్ది (అపొస్తలుల 1 - 7)

10. దేవాలయములో పేతురు ఉపన్యాసం (అపొస్తలుల 3:11-26)


అపొస్తలుల 3:17-26
17 సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును. 18 అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయ ములను ఈలాగు నెరవేర్చెను. 19 ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును 20 మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి. 21 అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము. 22 మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట విన వలెను. 23 ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను. 24 మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి. 25 ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు. 26 దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

పేతురు చెదిరిన యూదులతో ఒక న్యాయాధిపతిగా నిలబడలేదు, అయితే వారిని "సహోదరుడా" అని సంభోదించెను, అనగా వారు తిరిగి జన్మించాక పోయినను. అయితే యేసు వారి పాపములను సిలువలో క్షమించి, వారి మీద తన పరిశుద్ధాత్మను నింపి, వారిలో నివాసము చేయుటకు సిద్దపడెను. అయితే ఈ వాగ్దానము వారికి మాత్రమే కాదు అయితే ఎవరైతే అతనియందు విశ్వాసం కలిగి ఉంటారో వారికి కూడా ఈ వాగ్దానమును యిచ్చియున్నాడు. పేతురు వారికొరకు రక్షణ అనునది ఎదురుచూసి అతని కృపాకలిగిన ఉద్దేశములను ఇచ్చియున్నాడని చెప్పెను.

శిష్యులలో ఉన్న నాయకులూ విజయము కలిగిన యేసు శక్తిని ప్రార్థన ద్వారా నెరవేర్చారు: "తండ్రి వీరేమిచేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు". ఇది యూదులకు మరియు వారి నాయకులకు ఒకవిధమైన వివరణగా ఉన్నది. ఈ మాట పేతురు అనుభవము మీద ఆధారపడి ఉండెను, ఎందుకంటె పునరుత్తానుడైన వాడు అతనిని సమాధానపరచి ఉన్నాడు కనుక. అతని పాపములను బట్టి అతను కృప ద్వారా క్షమించబడినాడు, అయితే ఈ క్షమాపణ అతని మంచి కార్యముల ద్వారా మరియు ప్రవర్తన ద్వారా కలిగినది కాదు. పేతురు అతని వ్యక్తిగతమైన అనుభవము ద్వారా వివరించియున్నాడు. అతను క్రీస్తు కృపను బహిరంగముగా వివరించెను. అతను వినువారి పాపములను బట్టి క్లుప్తముగా వివరించి ఉన్నాడు. అయితే పరిశుద్దాత్ముని నేయపరమైన తీర్పుతరువాత వారికి ఒక ఆశీర్వాదము అనునది వచ్చియున్నది.

పేతురు యేసు పునరుత్తనమును బట్టి అతని మాటలను వినెను. ఈ లోకమునకు క్రీస్తు శ్రమల ద్వారా తప్ప మరియు ఏ విధమైన పరిస్థితి ద్వారా రక్షణ లేదు అని తెలుసుకొనెను. ప్రవక్తలందరు ప్రవచించినట్లు దేవుని గొర్రెపిల్ల చనిపోవాలని తెలుసుకొనెను. కనుక ఇది సహజముగా జరుగు దేవుని చిత్తము కనుక దీనిగురించి ముందుగానే చెప్పెను. ఈ లోక పాపములు మరియు సిగ్గు ఏ దోషము లేని అతని మీద మోపవలసి ఉన్నదని నిర్ణయము చేయబడెను. కనుక మనకు బదులుగా అతను మాత్రమే చనిపోవలసి ఉండెను. పరలోకమందున్న తండ్రి ఈ చెడు లోకము కొరకు చనిపోవలసి ఉండెను, అతని పరిశుద్ధ కుమారుడు కాకుండా. అయితే అతని గొప్ప మరియు అద్భుతమైన ఉండడంలో, ఈ లోకమును భరించువాడు అతను మాత్రమే. అతని కుమారుడు తప్ప మనకొరకు చనిపోవుటకు అతనికి వేరే మార్గము లేకపోయెను. కనుక యేసు మరణము ద్వారా కాక ఈ లోకమునకు క్షమాపణ లేదు.

మనకొరకు బదులుగా శ్రమపొందుటకు మనకు కనపడునట్లుగా క్రీస్తు తన పరిశుద్ధాత్మచేత అభిషేకించెను. ఎవరైతే అతని సిలువను ధ్యానిస్తారో వారు దేవుని హృదయములోనికి నేరుగా చూస్తారు, ఎందుకంటె అతను పాపులను ప్రేమించి వారికొరకు తన కుమారుడిని ఇచ్చి వారు ఫలవంతులై ఉన్నట్లు వారిని పరిశుద్ధపరచి, వారు సమృద్ధి కరమైన ఫలములను ఫలించునట్లు వారిలో నివాసము చేయును.

నజరేయుడైన యేసు క్రీస్తు దేవుడని పాతనిబంధన గ్రంథమందు చెప్పెనని పేతురు చెప్పెను, అతను తండ్రితో ఐక్యత కలిగి ఉండుటకు అందరి కొరకు చనిపోయెను. అప్పుడు అతను వారిని మార్పుకలిగి ఉండుమని వారికి చెప్పెను. "పశ్చాత్తాపం" అను మాట శ్రమను మాత్రమే సూచించడము లేదు, లేదా కన్నీళ్లు, సిగ్గును, అయితే జీవితమును మార్చునదిగా ఉన్నది. మరియు ఇది గత జీవితమును విడిచి ఒక విధమైన ఆశయము కలిగి ఉండునట్లు చేయును. మరియు ఇది మనము మన పాపములనుంచి తిరుగునట్లు మరియు దేవుని ఉగ్రతను పొందుకొనునట్లు కూడా చేయును, మరియు కృప ద్వారా విశ్వాసము మరియు క్షమాపణను ఉచితముగా ఇచ్చునట్లు. దేవునికి సంపూర్ణ సమర్పణ అనునది అతని కృపను మనము పొందుకొనుటకు కలిగిన అవకాశము. క్రీస్తు మాత్రమే మన రక్షణను బట్టి ఆ సిలువలో ముగించాడు, కనుక ఎవరైతే విశ్వసిస్తారో వారు సమాధానపరచబడతారు.

ఎప్పుడైతే నీతికలిగిన దేవుడు మనహృదయములలో ఉండునో అప్పుడు దేవుని సమాధానము, అతని బహుమానంగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండును. క్రీస్తులో ఉన్న విశ్వాసము మరియు పచ్చాత్తాపము ఊరకనే యేసును వెంబడించువారిలో ఉండదు, మరియు అతని మరణమును బట్టి వారు దైవికమైనా ఫలముల ద్వారాకూడ. దానికి బదులుగా, పరిశుద్దాత్మ నివాసము చేసినప్పుడు దేవుని శక్తి వచ్చును. నీవు ప్రియా సహోదరుడా దేవునితో సహవాసములోనికి ప్రవేశించినవా? నీ జీవిత రూపకల్పనకు బట్టి పచ్చాత్తాపముతో మార్పు కలిగి ఉన్నావా. నూతన నిబంధనలో నీవు కొనసాగినట్లు మరియు అతని పరిశుద్ధాత్మతో నింపబడునట్లు క్రీస్తును నీ సొంత రక్షకునిగా హత్తుకో.

కనుక ప్రియా విశ్వాసి, నూతన నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశము పాపములను క్షమించి, నిత్యజీవమును పొంది, లేదా అద్భుతమైన పరిశుద్దాత్మ వరములను పొందుకొనుట అనునవి కావు, అయితే క్రీస్తు తిరిగి వచ్చుట. ఏ సర్వసృష్టి అంతాకూడా ఈ సృష్టి మరియు సృష్టికర్త వేరుపరచుటను, మరియు ఈ సృష్టికంతటికీ నాశనము అనునది జరుగుతాను ఎదురుచూచుట. దీనిని బట్టే మనము ఎదురుచూస్తున్నది. ఈ విధమైన విశ్వాసుల పునరుద్ధరణను క్రీస్తు రాకడలో అతని మహిమను నెరవేర్చునదిగా ఉన్నది. కనుక తగిన సమయములో మనిషి పాపములో పడున్నప్పుడు ఈ కార్యములన్నిటిని అతను పునరుద్ధరించును.

ప్రభువు పరలోకమునకు వెళ్ళినది తిరిగి వచ్చుటకు సిద్దము కలిగి ఉండుటకు అని శిష్యులు అర్థము చేసుకొనిరి. ఆత్మీయమైన మార్పు ఈ లోకమునకు అవసరమని వారికి తెలుసు. మరియు అతను వెళ్ళుట కూడా ఈ సృష్టిని పునరుత్తరించుటకు సుగమం చేయడానికని తెలుసుకొనిరి. మరియు క్రీస్తు పరలోకమునకు యేతెంచినది పరిశుద్ధాత్ముడు మనలో వచ్చుటకు కూడా ఒక ఆధారముగా ఉన్నది, అతను మనలను పునరుద్ధరించారు.

ప్రవక్తలందరు క్రీస్తు రాకడను ఈ లోక ముగింపుకు ఒక సూచనగా చెప్పిరి. అయితే ముగింపు అనునది మనకు కలుగు తీర్పును బట్టి వచ్చిన మార్పు కాదు అయితే సంతోషముతో మన కార్యములన్ని కూడా సత్యమైనదిగా చేయడము. వాగ్దానముగా మోషే చెప్పినట్లు కొంత కూడా వేరేగా లేదు. అతను నూతన నిబంధనకు ఒక హామీగా ఉన్నాడు, మరియు పాతనిబంధనను అధిగమించినట్లున్నది. ఎవరైతే ఈ క్రొత్త నిబంధనను తిరస్కరిస్తారో వారికి దేవునితో నిరీక్షణ ఉండదు, ఎందుకంటె రాయిలాంటి హృదయము కలిగిన వారు దీనిని తిరస్కరిస్తారు. ఎవరైతే క్రీస్తును తిరస్కరిస్తారో వారిని దేవుడు నాశనము చేయును. ఈ లోక చరిత్ర అనునది క్రీస్తును తిరస్కరించినదిగా అంగీకరించడము జరిగినది.

ఈ లోతైన విస్ప్రుతమైన ప్రసంగము తరువాత, పేతురు యూదులను యేసును హత్తుకొనుమని ఉత్సాహపరచెను. వారు దేవుడు వారి పితరులతో నిబంధన చేసుకున్నట్లు వారు ప్రవక్తల పిల్లలని మరియు దేవుని నిబంధన ద్వారా కలిగినవారిని వివరించెను. వారు అతనితో సమానముగా నిబంధనలో పాలుపంచుకోలేరని దేవునికి తెలుసు. అయినప్పటికి, పరిశుద్దుడైన సృష్టికర్త పాపులకు, దోషము చేసినవారికి దగ్గరగా ఉండెను. ఇది అతని గొప్ప కృపకు ఒక నిదర్శనము.

అబ్రాహామును దేవుడు యేణ్ణకొన్నప్పుడు దేవుని చరిత్ర ప్రారంభమైనది. ఈ ప్రయాణికునికి పరిశుద్ధుడు చెప్పినది ఏమనగా నీ సంతానంలో శరీర మూలముగా ఈ భూమి మీద దేవుని ఆశీర్వాదమునకు కర్త అగునని చెప్పెను. సాతాను వ్యతిరేకములో మరియు మనుషుల విఫలములలో దేవుడు తన ప్రణాళికలను తీసికొనివచ్చెను. తన రాకడలో పరిశుద్ధాత్ముడు పాతనిబంధన హద్దులను పేల్చి, దేవునితో సంబంధము కలిగి ఉండుటకు పిలుచును. అయితే యూదులకు పేతురు మొదటగా కృపను ఇచ్చి, మరియు ఎవరైతే విశ్వసిస్తారో రక్షింపబడెదరని చెప్పెను.

దేవుడు తన శత్రువులను కూడా ఆశీర్వదించి, ఎవరైతే తన కుమారునికి మేకులు కొట్టారో వారు పచ్చాత్తాపము కలిగి ఉండుటకు అవకాశమును ఇచ్చెను. ప్రతి ఆత్మీయమైన ఆశీర్వాదమును తనను వెంబడించువారికి అతను మహిమపరచబడునట్లు అతనిని ఘనపరచెను. సిద్ధపాటు కలిగిన హృదయములను దేవుడు ఆశీర్వదించాడు, వారు పచ్చాత్తాపం పది మార్పు పొందుటకు. అయితే పచ్చాత్తాపము పొందుటలో మనిషి ప్రమేయము ఉండదు, అయితే పరిశుద్ధాత్ముడు క్రీస్తు నందు విశ్వాసము ఉంచులాగున సహాయము చేయును. ఒకవేళ మనిషి తన అసూయానుంచి మరియు చెడు నుంచి మార్పుచెందక పోతే అతను క్రీస్తుతో సహావాసములోనికి వెళ్ళలేడు. మనము ఇష్టముతో దేవునివైపు తిరగాలని అతను ఇష్టపడుచున్నాడు. అతను మనలో ఒక పునరుద్ధరణముగా కార్యము చేయుచున్నాడు. ప్రియా విశ్వాసి నీ పాపములను నీవు వదిలివేసావా? నీవు క్రీస్తులో నిలకడకలిగి ఉన్నావా?

ప్రార్థన: పరలోకమందున్న ఓ ప్రభువా, అన్నివిషయములను పునరుద్ధరించుటకు వచ్చుటకు నీవు సిద్ధపాటు కలిగి ఉండుటను బట్టి నీకు కృతజ్ఞతలు. నీ కృపలో మేము కొనసాగుటకు మరియు చెడును వదిలి వేయునట్లు మాకు సహాయము చేయుము, అప్పుడు నీవు మాత్రమే మా ఆశయమై మా జీవితమునకు ఒక ఉద్దేశముగా ఉందువు. నీ కృప ద్వారా మమ్ములను ఏవిధముగా అయితే రక్షించినావో అదేవిధముగా మా చుట్టూ ఉన్నవారిని కూడా రక్షించుము.

ప్రశ్న:

  1. మనిషి చరిత్ర యొక్క ఆశయము ఏమిటి?

www.Waters-of-Life.net

Page last modified on April 09, 2020, at 02:49 PM | powered by PmWiki (pmwiki-2.3.3)