Previous Lesson -- Next Lesson
1. సంహేద్రిన్ అనే బాప్తీస్మ అప్పగింత (యోహాను 1:19-28)
యోహాను 1:22-24
22 నీవు ఆ ప్రవక్తవా అని అడుగగాకానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారునీవెవరు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి. 23 అందుకు అతడు ప్రవక్త వైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడిగాని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. 24 పంపబడినవారు పరిసయ్యులు చెందిన వారు.
అక్కడున్న పెద్దల ప్రశ్నలు ఒక బాణముల గుచ్చుకున్నట్లుగా ఉన్నది. ఈ ప్రశ్నలు మెసయ్య అయినా క్రీస్తు వచ్చు ముందు వేసిన ప్రశ్నలుగా ఉన్నవి. అయితే ఎప్పుడైతే బాప్తీస్మ మిచ్చు యోహాను మోషే ప్రకటించినట్లు మెస్సయ్య కాదు అని మరియు ఏలీయా ప్రవక్త కాదని చెప్పినప్పుడు యోహాను వారి దృష్టిలో అపాయములో ఉన్నవాడాయెను. అయినప్పటికీ నీవు ఎవరని అతనిని అడిగిరి.
ఈ ప్రశ్నలు యెషయా చెప్పిన ప్రవచనమునకు ఎటువంటి సంబంధము లేదు (యెషయా 40 :3 ),అయితే ఆత్మా యోహానును ఈ పత్రికకు నడిపించియున్నది. అందుకే తనను తానూ అరణ్యములో ఒక కేక వాలే చెప్పి ప్రభువు రాకాదు సిద్దము చేయువాడుగా చెప్పియున్నాడు. ఒకవేళ యోహాను వాక్యములను వారికి చూపించకపోయి ఉన్నట్లయితే అతడు వారి దృష్టిలో చాలా అపాయకారముగా ఉందును. అప్పుడు అతడిని నిందిస్తుండిరి. అందుకే యోహాను తనను తానూ తగ్గించుకొని పాత నిబంధన గ్రంధము ప్రకారము ఉంది, అరణ్యములో ఒక స్వరముగా చెప్పుకున్నాడు.
మనమందరూ ఈ లోక అరణ్యములో నివాసము చేస్తున్నాము. అయితే దేవుడు ఈ బీద లోకమును ఒంటరిగా వదలక ఒక సహాయకుడిని పంపియున్నాడు. అతను మానవులకొరకు వచ్చి వారిని రక్షించును. ఇది పరలోకము నుండి వచ్చిన గొప్ప కృపగా ఉన్నది. పరిశుద్దుడైన దేవుడు మనలను నాశనములోనికి పడనీయక మన కొరకు వెతుకువాడుగా ఉన్నాడు. అతని ప్రేమ మన మెదడు కంటే గొప్పది అలాగే తన రక్షణ మన అరణ్య జీవితమును ఒక అందమైన పచ్చికవే చేయును.
యోహాను పరిశుద్దాత్మ ద్వారా దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని. అందుకే అతను అందరిని సిద్ధపాతుకలిగి వచ్చువాడికి స్వగాతాముపలక వలెనని చెప్పియున్నాడు. అతని కసి వచ్చువాని యొక్క స్వరమై వారు అందరు సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకున్నాడు. తనను తానూ ఒక ప్రవక్తగా కాక మరియు ఒక రాయబారిగా చెప్పుకొనలేదు అయితే క్రీస్తు స్వరముగా చెప్పియున్నాడు. అయితే ఈ స్వరము దేవుని యొక్క అధికారంలో ఉంది పాపములు ఉన్నవారికి ఒక ఓదార్పుగా ఉన్నది.
ఈ స్వరము ఎమూ చెప్తున్నది ? అతని సమాచారం: లెమ్ము నీ రాజ్యము నీ మీద ఉన్నది! కనుక నీ జీవితమును లేపు ! ఎందుకంటె దేవుడు పరిశుద్ధుడు కనుక నీకు తీర్పు తీర్చును. ఎందుకంటె ప్రతివిధమైన అబద్ధము, దొంగతనము, మరియు పాపమును దేవుడు నరకమునకు తీర్పులోనికి తెచ్చును. నీ పాపములను దేవుడు విడిచిపెట్టాడు ఎందుకంటె చెడ్డవాడు చెడ్డవానిగానే మిగలడు. కనుక చెడ్డవానికంటే ఎక్కువగా మంచివాడిగా ఉండు.
ఈ మాటలు యోహానుకు తన జ్ఞానమును, గర్వమును మరియు వ్యక్తిత్వమును తెలియపరచియుండి తన మనసును మార్చుకొనుటకు ఒక అవకాశముగా ఉన్నది. కనుక సహోదరుడా నీవు ఒక మంచివాడిగా యోగ్యుడుగా కనపడుచున్నావా ? నీవు యధార్థ కలిగి నీ పాపములను ఒప్పుకో! ఒకవేళ నీవు నీది కానిది వస్తువును దౌర్జన్యముతో తీసుకొన్నట్లయితే తిరిగి వారికి ఇచ్చేయుము. నీ గర్వములో మృతిపొంది దేవుని కొరకు బ్రతుకు.
అక్కడున్న వారిలో అనేకులు పరిసయ్యులు. వారు నీతిమంతులని తమకు తామే చెప్పుకొనుచు ధర్మశాస్త్రమునకు విధేయులని చెప్పుకొనుచు వారికి వారు మోసపరచుకుంటున్నారు. అందుకనే యోహాను మీకొరకు దేవుడు తిరిగి వస్తున్నదని మీ గర్వమైన హృదయములను మరియు మీ చెడ్డ జీవితములను మార్చుకున్నట్లైతే మీ కొరకు ప్రభువు త్వరగా రానై యున్నాడని చెప్పెను.
ప్రార్థన: దేవా నీకు నా హృదయము మరియు నా గత పాపములు తెలుసు, నీ ముందర నా దోషములనుబట్టి సిగ్గుపడుచున్నాను, నా ప్రతి చెడ్డతనమును ఒప్పుకొని నన్ను క్షమించుమని అడుగుచున్నాను. కనుక నీ సన్నిధి నుంచి నన్ను తీసివేయకుము. అదేవిధముగా నేను ఒకవేళ ఎవరినైనా నొప్పించినట్లైతే వారిని క్షమించే మనసు నాకు దయచేయుము. నా గర్వమును తీసి, నా ప్రతి పాపమును కడిగి నీ కనికరముచేత నన్ను జ్ఞాపకము చేసుకో.
ప్రశ్న:
- యోహాను ప్రజలను ప్రభువు కొరకు సిద్దపడుమని పిలిచియున్నాడు ?