Home
Links
Bible Versions
Contact
About us
Impressum
Site Map


WoL AUDIO
WoL CHILDREN


Bible Treasures
Doctrines of Bible
Key Bible Verses


Afrikaans
አማርኛ
عربي
Azərbaycanca
Bahasa Indones.
Basa Jawa
Basa Sunda
Baoulé
বাংলা
Български
Cebuano
Dagbani
Dan
Dioula
Deutsch
Ελληνικά
English
Ewe
Español
فارسی
Français
Gjuha shqipe
հայերեն
한국어
Hausa/هَوُسَا
עברית
हिन्दी
Igbo
ქართული
Kirundi
Kiswahili
Кыргызча
Lingála
മലയാളം
Mëranaw
မြန်မာဘာသာ
नेपाली
日本語
O‘zbek
Peul
Polski
Português
Русский
Srpski/Српски
Soomaaliga
தமிழ்
తెలుగు
ไทย
Tiếng Việt
Türkçe
Twi
Українська
اردو
Uyghur/ئۇيغۇرچه
Wolof
ייִדיש
Yorùbá
中文


ગુજરાતી
Latina
Magyar
Norsk

Home -- Telugu -- John - 019 (The first six disciples)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
B - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 1:19-28)

3. మొదటి ఆరు శిష్యులు (యోహాను 1:35-51)


యోహాను 1:47-51
47 యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచిఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను. 48 నన్ను నీవు ఏలాగు ఎరుగుదు వని నతనయేలు ఆయనను అడుగగా యేసుఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. 49 నతన యేలుబోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. 50 అందుకు యేసుఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. 51 మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుట యును చూతురని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.

క్రీస్తు నతనయేలు యొక్క అంతరంగమును చూసియున్నాడని తెలుసుకున్నప్పుడు. క్రీస్తును అర్థమును చేస్కుకోను వాడాయెను. నతనియేలు పాత నిబంధన విశ్వాసి, అందుకే తన పాపములను యోహాను యొద్ద ఒప్పుకున్నాడు, కనుకనే దేవుని రాజ్యమును కూడా హృదయపూర్వకముగా కోరుకున్నవాడాయెను. పాపములను బట్టి ప్రాయశ్చిత్తమునకు మిస్సయ్యాను పంపుమని దేవునిని అడిగిరి.

యేసు ఒక చెట్టు నీడన ఉన్నప్పుడు ప్రధాన చేయువారి విజ్ఞాపనము వినియున్నాడు. ఈ శక్తి మనిషిలో ఉన్న సత్యమును చూపినదిగా ఉన్నది.

క్రీస్తు అతనిని తిరస్కరించక ఒక ఉదాహరణ కలిగిన విశ్వాసిగా అందరికీ చూపించియున్నాడు, పాత నిబంధన గ్రంథ కాలములో క్రీస్తు రాకడ కొరకు ఎదురుచూచునట్లుగా.

క్రీస్తు ఆజ్ఞలు నతనియేలు యొక్క అనుమానములను తీర్చెను. క్రీస్తును బైబిల్ వాక్యములచేత గౌరవించి మెస్సయ్య మీద ఆధారపడెను: దేవుని కుమారుడని మరియు ఇశ్రాయేలు రాజు అని, ఈ విధమైన భావన అతని మరణమునకు కలిగెను. ఎందుకంటె యూదులు దేవునికి కుమారుడు ఉంటాడు అనే పదమునకు వ్యతిరేకమైరి. ఈ విధమైన మాటలను వ్యతిరేక స్వభావమునకు అర్థము. ఇశ్రాయేలునకు రాజు అని చెప్పినప్పుడు హేరోదు ద్వారా శ్రమలు వచ్చిఉండవచ్చు, అదేవిధముగా రోమా సామ్రాజ్యమునుంచి కూడా అరెస్ట్ అయి ఉండవచ్చు. అందుకే ఈ నమ్మకమైన విశ్వాసి ప్రవక్తల వాగ్దానములను ప్రకటించియున్నారు. మనుష్యులకంటే ఎక్కువగా దేవుడికి భయపడి తండ్రికి గౌరవంగా నడుచుకొన్నాడు. దూతలు క్రీస్తుకు చుట్టూ ఉండి ఆయన కార్యములను తెలియపరచి, ఆకాశమునకు మరియు భూమికి మధ్యన నడుచుచూ దేవుని ఆశీర్వాదములను ఇచ్చుచువచ్చిరి. యాకోబు యొక్క ప్రవచనము క్రీస్తులో జరిగించబడెను. పౌలు వ్రాసినట్లు, "మమ్ములను తన సమస్తమైన ఆశీర్వాదాలచేత ఆశీర్వదించిన తండ్రియైన దేవుని కుమారుడైన క్రీస్తుకు శుభములు". "క్రీస్తు నగరము చేత మరియు అతని బాప్తీస్మముచేత పరలోక తలుపులు తెరువబడ్డాయి. పరలోక ద్వారముల చెంత దేవుని దూతలు కూడా ఉండి, ఆయన ఉగ్రతను మరియు ఖడ్గమును తెలియపరచిరి. దేవుని దగ్గరకు వెలుగు తలుపులు క్రీస్తు ద్వారా తెరువబడ్డాయి.

యోహాను మొదటి సారిగా క్రీస్తును బట్టి " ఇదిగో నేను చెప్పుచున్నాను" అని, కృప యొక్క నిజస్వరూపము మనిషి యొక్క జ్ఞానమునకు ఎంతో దూరము అయితే మనిషికి ఇది అవసరమై ఉన్నది. కనుక మనము నూతన విశ్వాసముచేత ఉన్నప్పుడు ఈ విధమైన ఆత్మీయ మనసులు అవసరంగా ఉన్నాయి.

ఈ బోధ తరువాత క్రీస్తు నతనియేలు యొక్క సాక్ష్యమును బట్టి తనను మార్చాడు. ఎందుకంటె తన శ్రమల నుంచి తన శిష్యుల యొక్క మార్గమును మార్చియున్నాడు. క్రీస్తు తనను తానూ దేవుని కుమారుడని లేక వాగ్దాన మెస్సయ్య అని చెప్పలేదు అయితే "మనుష్య కుమారుడని" చెప్పియున్నాడు.ఈ పేరును క్రీస్తు సహజముగా వాడుకున్నాడు. ఆయన జన్మము ఒక గోపా ఆశ్చర్యముగా ఉండి మన వాలే మారుత ఒక వింతగా ఉన్నది, కనుక దేవుని మనకొరకు మనిషిగా జన్మించి దేవుని గొర్రెపిల్లగా చనిపోయి ఉన్నాడు.

దానియేలు గ్రంధములో వ్రాయబడినట్లు ఈ పేరు "మనుష్య కుమారుడు" ఒక చరిత్రగా ఉన్నది. ఎందుకంటె దేవుడు " ఈ మనుష్య కుమారుడిని " తీర్పుకొరకు" నిలిపియున్నాడు. నతనియేలు క్రీస్తు దేవుని కుమారుడని మరియు లోకమును తీర్పు తీర్చువాడని నమ్మియున్నాడు. క్రీస్తు చెడ్డ విశ్వాసులకు కూడా విశ్వాసముతో గొప్ప స్థానమునకు తీసుకొని వెళ్ళాడు. అయితే క్రీస్తుకు ఉన్న వయసును బట్టి ఇలాంటి విశ్వాసము చాలా కష్టము అయితే శిష్యులు క్రీస్తులో ఉన్న కృపను చూసి పరలోక ద్వారములు తెరచియున్నాడని విశ్వసించాడు.

ప్రార్థన: మామ్ములను తీర్పుతీర్చు దేవుని కుమారుడా నిన్ను మేము ఆరాధిస్తున్నాము. మేము ఏదియు కోరుకొనక కేవలము ఉగ్రతను బట్టి నీ క్షమాపణను కోరుకోనుచున్నాము, మరియు మా స్నేహితుల కూడా నీ దయను ఇవ్వుమని కోరుకోనుచున్నాము. నీ కొరకు కనిపెట్టు వారందరికీ నీ ఆశీర్వాదమును ఇచ్చి, నిన్ను చూసే భాగ్యమును దయచేయుము, మరియు నీ యందు నమ్మకము కలిగి ఉండి నీ జ్ఞానమును నిరీక్షణకు పొందునట్లు సహాయము చేయుము.

ప్రశ్న:

  1. "దేవుని కుమారుడు" మరియు " మనుష్య కుమారుడు" అను నామములు గల వ్యత్యాసము ఏమిటి.

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:27 AM | powered by PmWiki (pmwiki-2.3.3)